మాచో స్టార్ గోపీచంద్ గత కొన్నేళ్లుగా సక్సెస్ దూరమై ఇబ్బంది పడుతున్నాడు కానీ సరైన కంటెంట్ పడితే హిట్టు కొట్టే రేంజ్ లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో భీమా మీద అభిమానులకు మంచి అంచనాలున్నాయి. ఏ హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం లాంటి బలమైన సాంకేతిక మద్దతుతో బరిలో దిగుతున్న భీమా వచ్చే నెల ఫిబ్రవరి 16 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ టీజర్ ని విడుదల చేసింది. కథకు సంబంధించిన క్లూస్ ఎక్కువగా ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.
అదో విచిత్ర ప్రపంచం. చుట్టూ కొండలు, గుహలు తప్ప మనం చుట్టూ చూసే వాతావరణం అక్కడ ఉండదు. రాక్షసుల్లాంటి మనుషులదే రాజ్యం. పూజలు, హోమాల పేరుతో అక్కడ అరాచకం రాజ్యమేలుతూ మహిళలు, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి. ఇదేంటని ప్రశ్నించే నాథుడు ఉండడు. ఆ సమయంలో ఖాకీ దుస్తులతో వస్తాడు భీమా(గోపీచంద్). దున్నపోతు మీద వచ్చి మరీ వీళ్ళ భరతం పట్టేందుకు కంకణం కట్టుకుంటాడు. ఇంతకీ సభ్య సమాజంతో సంబంధం లేకుండా ఉన్న ఆ అడవి గుహల్లో జరుగుతోంది ఏమిటి, భీమా ఎందుకొచ్చాడనేదే స్టోరీ.
విజువల్స్ లో డెప్త్ కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ డిఫరెంట్ గా సెట్ చేయడంతో రెగ్యులర్ పోలీస్ స్టోరీ అనే ఫీలింగ్ కలగకుండా చేయడంలో హర్ష సక్సెస్ అయ్యాడు. గోపిచంద్ ని కొన్ని సెకండ్లకే పరిమితం చేసి అసలు మ్యాటర్ ని ట్రైలర్ ని రివీల్ చేసేందుకు ప్లాన్ చేశారు. నేపధ్య సంగీతం, కెమెరా పనితనంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి సైతం ప్రాధాన్యత ఇచ్చారు. ప్రియా భవాని శంకర్-మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న భీమాలో నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర తారాగణం. వీళ్లెవరినీ టీజర్ లో చూపించలేదు.
This post was last modified on January 5, 2024 3:56 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…