మాచో స్టార్ గోపీచంద్ గత కొన్నేళ్లుగా సక్సెస్ దూరమై ఇబ్బంది పడుతున్నాడు కానీ సరైన కంటెంట్ పడితే హిట్టు కొట్టే రేంజ్ లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో భీమా మీద అభిమానులకు మంచి అంచనాలున్నాయి. ఏ హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం లాంటి బలమైన సాంకేతిక మద్దతుతో బరిలో దిగుతున్న భీమా వచ్చే నెల ఫిబ్రవరి 16 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ టీజర్ ని విడుదల చేసింది. కథకు సంబంధించిన క్లూస్ ఎక్కువగా ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.
అదో విచిత్ర ప్రపంచం. చుట్టూ కొండలు, గుహలు తప్ప మనం చుట్టూ చూసే వాతావరణం అక్కడ ఉండదు. రాక్షసుల్లాంటి మనుషులదే రాజ్యం. పూజలు, హోమాల పేరుతో అక్కడ అరాచకం రాజ్యమేలుతూ మహిళలు, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి. ఇదేంటని ప్రశ్నించే నాథుడు ఉండడు. ఆ సమయంలో ఖాకీ దుస్తులతో వస్తాడు భీమా(గోపీచంద్). దున్నపోతు మీద వచ్చి మరీ వీళ్ళ భరతం పట్టేందుకు కంకణం కట్టుకుంటాడు. ఇంతకీ సభ్య సమాజంతో సంబంధం లేకుండా ఉన్న ఆ అడవి గుహల్లో జరుగుతోంది ఏమిటి, భీమా ఎందుకొచ్చాడనేదే స్టోరీ.
విజువల్స్ లో డెప్త్ కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ డిఫరెంట్ గా సెట్ చేయడంతో రెగ్యులర్ పోలీస్ స్టోరీ అనే ఫీలింగ్ కలగకుండా చేయడంలో హర్ష సక్సెస్ అయ్యాడు. గోపిచంద్ ని కొన్ని సెకండ్లకే పరిమితం చేసి అసలు మ్యాటర్ ని ట్రైలర్ ని రివీల్ చేసేందుకు ప్లాన్ చేశారు. నేపధ్య సంగీతం, కెమెరా పనితనంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి సైతం ప్రాధాన్యత ఇచ్చారు. ప్రియా భవాని శంకర్-మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న భీమాలో నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర తారాగణం. వీళ్లెవరినీ టీజర్ లో చూపించలేదు.
This post was last modified on January 5, 2024 3:56 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…