ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకపోయినా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీ కోసం అభిమానుల ఎదురుచూవులు మాములుగా లేవు. గేమ్ ఛేంజర్ విపరీతమైన జాప్యం వల్ల ఫ్యాన్స్ ఫోకస్ మెల్లగా ఆర్సి 16 వైపు వెళ్తోంది. ఇంకా హీరోయిన్, ఇతర క్యాస్టింగ్ తదితర వివరాలు బయటికి చెప్పడం లేదు కొన్ని లీక్స్ అఫీషియల్ గా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ విషయం ఆయనే కెప్టెన్ మిల్లర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో బయటికి వచ్చింది.
శాండల్ వుడ్ లో ఎంత పేరున్నా ఇంత సుదీర్ఘమైన అనుభవంలో శివరాజ్ కుమార్ బయట భాషల్లో నటించలేదు. జైలర్ లో నరసింహగా కనిపించాకే ఆయన రేంజ్ ఏంటో మూవీ లవర్స్ కి అర్థమయ్యింది. అంతకు ముందు బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణిలో బుర్రకథ పాటలో నర్తించారు కానీ అధిక శాతం ఆడియన్స్ కి అంతగా రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ లో ముఖ్యమైన క్యారెక్టర్ ఇవ్వడంతో చెన్నైలోనే మకాం వేసి పబ్లిసిటీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్సి 16లో ఉన్నానని చెప్పారు కానీ దాని తీరుతెన్నులు, ఎంతసేపు ఉంటారనే విషయాలు పంచుకోకుండా దాటవేశారు.
రాజ్ కుమార్ కుటుంబంతో చిరంజీవికి ఎంత అనుబంధం ఉన్నా ఆ ఫ్యామిలీ యాక్టర్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు రామ్ చరణ్ ఆ లోటుని తీర్చడం చిరునైనా సంతోషపరిచేదే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్న రామ్ చరణ్ 16ని వేసవి నుంచి ప్రారంభించాలని బుచ్చిబాబు గట్టి సంకల్పంతో ఉన్నారు. కానీ ఎదురుచూసే కొద్దీ దర్శకుడు శంకర్ తన గేమ్ ఛేంజర్ కి గుమ్మడికాయ కొట్టనివ్వడం లేదు. పల్లెటూరి నేపథ్యంతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ డ్యూయల్ రోల్ ఉంటుందనే లీక్ ఉంది కానీ
ఖచ్చితమైన సమాచారమైతే ఇంకా తెలియాల్సి ఉంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…