అనుకున్నట్టే అయ్యింది. సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకుంటుందన్న ప్రచారమే నిజమయ్యింది. థియేటర్ల సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ లు సంయుక్తంగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరిపి ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయం వెల్లడించారు. దీని ప్రకారం ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఆ డేట్ ని ఆల్రెడీ అఫీషియల్ గా లాక్ చేసుకున్న టిల్లు స్క్వేర్ ని అక్కడి నుంచి మార్చడానికి నిర్మాత నాగవంశీ అంగీకరించడంతో పరిష్కారం సులభమయ్యింది. సో మాస్ మహారాజా నెలరోజుల తర్వాత రాబోతున్నాడు.
ఈ సందర్భంగా కౌన్సిల్ తరఫున మాట్లాడిన దిల్ రాజు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి కృతజ్ఞతలు చెప్పారు. ఒకరికొకరు అండర్ స్టాండింగ్ తో సహకరించుకోవడం వల్లే ఇది సాధ్యమయ్యిందని, మాట ఇచ్చినట్టు ఈగల్ కు సోలో రిలీజ్ వచ్చేలా ప్లాన్ చేశామని అన్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే గుంటూరు కారం, నా సామిరంగ రెండు ఊర మాస్ పండగ కంటెంట్ తో బరిలో దిగుతున్నాయి. సైంధవ్ కు వెంకటేష్ స్టార్ ఇమేజ్ తో పాటు బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ అండగా ఉంది. కంటెంట్ నే నమ్ముకున్న హనుమాన్ స్క్రీన్లు తక్కువైనా సరే తర్వాత పెరుగుతాయనే ధీమాలో ఉంది.
ఫైనల్ గా అయిదు సినిమాలకు బదులు నాలుగే రావడం పంపిణీదారులు ఊరట కలిగిస్తోంది. ఈగల్ పోస్ట్ పోన్ ఫ్యాన్స్ కోణంలో నిరాశ పరిచే అంశమే అయినా ఫిబ్రవరి మరీ బ్యాడ్ సీజన్ కాదు. గతంలో డీజే టిల్లు, భీమ్లా నాయక్, నేను లోకల్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఈ నెలలో వచ్చినవే. ఈగల్ మీద ఎలాగూ అంచనాలు బాగున్నాయి. సో ఒంటరిగా రావడం ఖచ్చితంగా లాభం చేకూరుస్తుంది. ఈగల్ వదిలేసుకున్న స్క్రీన్లను సమన్యాయం పద్ధతితో పంచుతారా లేక బయట టాక్ ఉన్నట్టు నా సామిరంగకు ఇస్తారా వేచి చూడాలి. మొత్తంగా రిలీజుల డ్రామాలో క్లైమాక్స్ ఊహించినట్టే వచ్చింది.
This post was last modified on January 4, 2024 9:03 pm
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.50…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇంకా ప్రారంభం కాని ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ టైటిల్…