Movie News

టాక్సిక్ కోసం హీరోయిన్ల వేట

కెజిఎఫ్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న యష్ కొత్త సినిమా టాక్సిక్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారని ఇప్పటికే టాక్ ఉంది. ఇదిలా ఉండగా ఇందులో హీరోయిన్ గా ఎవరు చేస్తారనేది ఇంకా బయటికి చెప్పడం లేదు. లీక్స్ ని బట్టి అందుతున్న సమాచారం మేరకు ఒక ప్రధాన పాత్రకు బాలీవుడ్ నుంచి కరీనా కపూర్ ని అడిగినట్టు సమాచారం. కీలకమైన లేడీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం తనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఆల్మోస్ట్ ఓకే అయినట్టే. మెయిన్ హీరోయిన్ గా రెండు మూడు ఆప్షన్లు చూస్తున్నారు. సాయిపల్లవి, శృతి హాసన్, రష్మిక మందన్నలో ఎవరి కాల్ షీట్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఎవరికీ ఇంకా నెరేషన్ ఇవ్వలేదు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలుపెడతారనే దాన్నిబట్టి ఫైనల్ చేస్తారు. 2025లో విడుదల కాబోతున్న టాక్సిక్ గోవా కేంద్రంగా జరిగే డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది. యష్ క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు ఇంకా బయటికి రాలేదు కానీ యానిమల్ తరహాలో వైల్డ్ గా ఉంటుందని వినికిడి.

కేవలం స్క్రిప్ట్ కోసమే రెండేళ్లకు పైగా వెయిట్ చేసిన యష్ ఈ టాక్సిక్ మీద భారీ నమ్మకం పెట్టుకున్నాడు. తనకొచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ గాలివాటం కాదని శాశ్వతమని రుజువు చేసుకోవాలంటే ఇది బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. ఫిజిక్ కోసమే ఆరు నెలలు ప్రత్యేకంగా కష్టపడ్డాడు. ప్రత్యేకంగా రైఫిల్, మెషీన్ గన్ షూటింగ్ ని నిజంగానే నేర్చుకున్నాడు. మిగిలిన క్యాస్టింగ్ ఇంకా ఫైనల్ కాలేదు. కమర్షియల్ సినిమాలు హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా టేకింగ్ పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గీతూ మోహన్ దాస్ టాక్సిక్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

43 minutes ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

5 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

8 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

8 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

10 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

12 hours ago