సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు సరిపోక ఆలో లక్ష్మణా అంటుంటే ఇక డబ్బింగ్ బ్యాచ్ కి చోటెక్కడిది. అందుకే జనవరి 12 తమిళనాడులో విడుదల కాబోతున్న కెప్టెన్ మిల్లర్, అయలన్ లు ఒకేసారి తెలుగులో వచ్చేందుకు ఛాన్స్ లేకపోవడంతో అనువాదాలను వాయిదా వేసుకుంటున్నాయి. హక్కులు కొన్న నిర్మాతలు దొరికిన కాసిన్ని స్క్రీన్లు, మల్టీప్లెక్సుల్లో అయినా రిలీజ్ చేయాలని చూస్తున్నారు కానీ సాధ్యపడకపోవచ్చు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే వ్యవహారం సీరియస్ గా మారుతుంది. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ కే నానా ఇబ్బందులు పడుతుంటే వీటికి సర్దటం జరగని పని.
ఈ పరిణామాలు ధనుష్, శివ కార్తికేయన్ లకు ఎంత మాత్రం మింగుడుపడటం లేదు. ఎందుకంటే ఇద్దరి మార్కెట్ 2022 నుంచి పుంజుకుంది. వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్, మహావీరుడు డీసెంట్ గా వర్కౌట్ కాగా సార్ ఏకంగా బ్లాక్ బస్టర్స్ సరసన చోటు దక్కించుకుంది. కెప్టెన్ మిల్లర్, అయలన్ రెండూ వాళ్ళ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందినవి. విజువల్ ఎఫెక్ట్స్ ని రిచ్ గా పొందుపరిచారు. తమిళంలో మాత్రమే రిలీజ్ చేస్తే వచ్చే తలనొప్పి రివ్యూలు, పైరసీ ప్రింట్లు, పబ్లిక్ టాక్ మొదలైనవి మొదటి రోజే బయటికి వస్తాయి. బాగుంటే సమస్య లేదు. తేడా కొడితేనే చిక్కు.
ఇంత జరుగుతున్నా వీలైనంత వరకు తెలుగు వెర్షన్ రిలీజ్ చేయమని ధనుష్, శివ కార్తికేయన్ తమ నిర్మాతల మీద ఒత్తిడి పెడుతున్నారని చెన్నై టాక్. కానీ వాస్తవ పరిస్థితులు తీవ్రంగా ఉన్న విషయాన్ని వివరించి చెప్పడంతో ప్రస్తుతానికి నిట్టూర్చారు కానీ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదని తెలిసింది. కెప్టెన్ మిల్లర్ ఈవెంట్ నిన్న చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. అయలన్ ఆడియో లాంచ్ ని ఘనంగా నిర్వహించారు. మొదటిసారి టాలీవుడ్ లో డబ్బింగులకు అడ్డుకట్ట వేసిన సంక్రాంతిగా 2024 నిలిచిపోయేలా ఉంది. చివరి నిమిషంలో ఏదైనా ట్విస్టులు ఎదురైతే తప్ప.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…