సంక్రాంతికి మన సినిమాలకే థియేటర్లు సరిపోక ఆలో లక్ష్మణా అంటుంటే ఇక డబ్బింగ్ బ్యాచ్ కి చోటెక్కడిది. అందుకే జనవరి 12 తమిళనాడులో విడుదల కాబోతున్న కెప్టెన్ మిల్లర్, అయలన్ లు ఒకేసారి తెలుగులో వచ్చేందుకు ఛాన్స్ లేకపోవడంతో అనువాదాలను వాయిదా వేసుకుంటున్నాయి. హక్కులు కొన్న నిర్మాతలు దొరికిన కాసిన్ని స్క్రీన్లు, మల్టీప్లెక్సుల్లో అయినా రిలీజ్ చేయాలని చూస్తున్నారు కానీ సాధ్యపడకపోవచ్చు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే వ్యవహారం సీరియస్ గా మారుతుంది. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ కే నానా ఇబ్బందులు పడుతుంటే వీటికి సర్దటం జరగని పని.
ఈ పరిణామాలు ధనుష్, శివ కార్తికేయన్ లకు ఎంత మాత్రం మింగుడుపడటం లేదు. ఎందుకంటే ఇద్దరి మార్కెట్ 2022 నుంచి పుంజుకుంది. వరుణ్ డాక్టర్, కాలేజీ డాన్, మహావీరుడు డీసెంట్ గా వర్కౌట్ కాగా సార్ ఏకంగా బ్లాక్ బస్టర్స్ సరసన చోటు దక్కించుకుంది. కెప్టెన్ మిల్లర్, అయలన్ రెండూ వాళ్ళ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందినవి. విజువల్ ఎఫెక్ట్స్ ని రిచ్ గా పొందుపరిచారు. తమిళంలో మాత్రమే రిలీజ్ చేస్తే వచ్చే తలనొప్పి రివ్యూలు, పైరసీ ప్రింట్లు, పబ్లిక్ టాక్ మొదలైనవి మొదటి రోజే బయటికి వస్తాయి. బాగుంటే సమస్య లేదు. తేడా కొడితేనే చిక్కు.
ఇంత జరుగుతున్నా వీలైనంత వరకు తెలుగు వెర్షన్ రిలీజ్ చేయమని ధనుష్, శివ కార్తికేయన్ తమ నిర్మాతల మీద ఒత్తిడి పెడుతున్నారని చెన్నై టాక్. కానీ వాస్తవ పరిస్థితులు తీవ్రంగా ఉన్న విషయాన్ని వివరించి చెప్పడంతో ప్రస్తుతానికి నిట్టూర్చారు కానీ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదని తెలిసింది. కెప్టెన్ మిల్లర్ ఈవెంట్ నిన్న చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. అయలన్ ఆడియో లాంచ్ ని ఘనంగా నిర్వహించారు. మొదటిసారి టాలీవుడ్ లో డబ్బింగులకు అడ్డుకట్ట వేసిన సంక్రాంతిగా 2024 నిలిచిపోయేలా ఉంది. చివరి నిమిషంలో ఏదైనా ట్విస్టులు ఎదురైతే తప్ప.
This post was last modified on January 4, 2024 4:39 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…