నువ్వా నేనా అని తలపడుతున్న సంక్రాంతి సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ పోటీ పడుతున్నాయి. గుంటూరు కారం ఈ నెల 6 యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో వేడుకను లాక్ చేసుకోగా తాజాగా హనుమాన్ 7న ఎన్ కన్వెన్షన్ లో సెలబ్రేషన్ కు సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం ఖరారయ్యింది. ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళు అచ్చం చిరుని పోలి ఉన్నాయని కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా ఆయనే రావడం చూస్తే ఏదో లింక్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయన కాసేపు కనిపించడమో లేదా గొంతు వినిపించడమో ఉండొచ్చని భావిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం టీమ్ నుంచి అందిన లీక్స్ ని బట్టి అదేమీ లేదని తెలిసింది కానీ ఒకవేళ సర్ప్రైజ్ ఏదైనా ఉంటే వేదిక మీద తెలిసే అవకాశముంది. వ్యక్తిగతంగా చిరంజీవికి ఇష్టమైన దైవం హనుమంతుడే. అందుకే తల్లి పేరు అంజనా దేవి కావడం ఆశీర్వాదంగా ఆయన భావిస్తారు. పలు సందర్భాల్లో తాను కొలిచే దేవుడి గురించి చెప్పుకుంటూ వచ్చారు. జగదేకవీరుడు అతిలోకసుందరిలో కాసేపు హనుమంతుడి గెటప్ లో ఫైటింగ్ గట్రా చేసి అలరించారు. ఒక కార్టూన్ మూవీ తెలుగు అనువాదానికి స్వయంగా డబ్బింగ్ చెప్పి అప్పట్లో దానికి ఓపెనింగ్స్ వచ్చేలా దోహదపడ్డారు.
వీటితో పాటు హనుమాన్ హీరో తేజ సజ్జకు, చిరుకి స్క్రీన్ కనెక్షన్ ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడాలని ఉందిలో కొడుకుగా, ఇంద్రలో చిన్నప్పటి ఇంద్రసేనారెడ్డిగా బ్లాక్ బస్టర్స్ లో భాగమయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఆయనే గెస్టుగా రావడం కంటే ఉద్వేగం తేజకు ఇంకేముంటుంది. విపరీతమైన ఒత్తిడి మధ్య థియేటర్లను దక్కించుకోవడంలో చాలా కష్టపడుతున్న హనుమాన్ కు బజ్ తగినంత ఉంది కానీ స్టార్ హీరోలవి కాదని ఆడియన్స్ దీనికి రావాలంటే భక్తి సెంటిమెంట్ తో అదనపు హంగామాలు అవసరమే. ఇక్కడ కంటే ఉత్తరాదిలో భారీ ఎత్తున రిలీజవుతున్న హనుమాన్ కి బాలీవుడ్ లో కాంపిటీషన్ లేదు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…