నువ్వా నేనా అని తలపడుతున్న సంక్రాంతి సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ పోటీ పడుతున్నాయి. గుంటూరు కారం ఈ నెల 6 యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో వేడుకను లాక్ చేసుకోగా తాజాగా హనుమాన్ 7న ఎన్ కన్వెన్షన్ లో సెలబ్రేషన్ కు సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం ఖరారయ్యింది. ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళు అచ్చం చిరుని పోలి ఉన్నాయని కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా ఆయనే రావడం చూస్తే ఏదో లింక్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయన కాసేపు కనిపించడమో లేదా గొంతు వినిపించడమో ఉండొచ్చని భావిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం టీమ్ నుంచి అందిన లీక్స్ ని బట్టి అదేమీ లేదని తెలిసింది కానీ ఒకవేళ సర్ప్రైజ్ ఏదైనా ఉంటే వేదిక మీద తెలిసే అవకాశముంది. వ్యక్తిగతంగా చిరంజీవికి ఇష్టమైన దైవం హనుమంతుడే. అందుకే తల్లి పేరు అంజనా దేవి కావడం ఆశీర్వాదంగా ఆయన భావిస్తారు. పలు సందర్భాల్లో తాను కొలిచే దేవుడి గురించి చెప్పుకుంటూ వచ్చారు. జగదేకవీరుడు అతిలోకసుందరిలో కాసేపు హనుమంతుడి గెటప్ లో ఫైటింగ్ గట్రా చేసి అలరించారు. ఒక కార్టూన్ మూవీ తెలుగు అనువాదానికి స్వయంగా డబ్బింగ్ చెప్పి అప్పట్లో దానికి ఓపెనింగ్స్ వచ్చేలా దోహదపడ్డారు.
వీటితో పాటు హనుమాన్ హీరో తేజ సజ్జకు, చిరుకి స్క్రీన్ కనెక్షన్ ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడాలని ఉందిలో కొడుకుగా, ఇంద్రలో చిన్నప్పటి ఇంద్రసేనారెడ్డిగా బ్లాక్ బస్టర్స్ లో భాగమయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఆయనే గెస్టుగా రావడం కంటే ఉద్వేగం తేజకు ఇంకేముంటుంది. విపరీతమైన ఒత్తిడి మధ్య థియేటర్లను దక్కించుకోవడంలో చాలా కష్టపడుతున్న హనుమాన్ కు బజ్ తగినంత ఉంది కానీ స్టార్ హీరోలవి కాదని ఆడియన్స్ దీనికి రావాలంటే భక్తి సెంటిమెంట్ తో అదనపు హంగామాలు అవసరమే. ఇక్కడ కంటే ఉత్తరాదిలో భారీ ఎత్తున రిలీజవుతున్న హనుమాన్ కి బాలీవుడ్ లో కాంపిటీషన్ లేదు.
This post was last modified on January 3, 2024 7:51 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…