Movie News

ఇద్దరు సూపర్ స్టార్లు ఒకేసారి కనిపిస్తే

ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న గుంటూరు కారం తాలూకు అప్డేట్ ఏదైనా సరే అభిమానులకు విపరీతమైన ఎగ్జైట్ మెంట్ ఇస్తోంది. నిన్న సాయంత్రం ఫ్యాన్స్ పెట్టుకున్న ట్విట్టర్ స్పేస్ లో నిర్మాత నాగవంశీ ఇచ్చిన స్పెషల్ న్యూస్ వాళ్ళ ఉత్సహాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. దాని ప్రకారం సెకండ్ హాఫ్ లో ఇద్దరు సూపర్ స్టార్లు ఒకేసారి తెరమీద కనిపించబోతున్నారు. అంటే మహేష్ బాబుతో పాటు కృష్ణగారిని చూడొచ్చన్న మాట. అదేంటి నటశేఖర కాలం చేశారు కదా ఎలా సాధ్యమని అనుకోకండి. మనం గతంలో చూసిన టెక్నాలజీనే మరింత స్పెషల్ గా వాడబోతున్నట్టు తెలిసింది.

కలిసుందాం రా, యమదొంగ సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ ని స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించడమే కాదు ఏకంగా డ్యాన్సులు కూడా చేయించారు. ఇందులో కూడా అలాంటిది ఉంటుందని యూనిట్ టాక్. అయితే వాటికి భిన్నంగా కథతో త్రివిక్రమ్ దీన్ని ముడిపెట్టిన విధానం కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. మహేష్ సినిమాలకు అడ్డాగా చెప్పుకునే సుదర్శన్ 35 ఎంఎం కూడా ఒక పాత్రగా వస్తుందట. మరి గుంటూరులో మిర్చి వ్యాపారం చేసుకునే వెంకటరమణారెడ్డికి హైదరాబాద్ కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలియాలంటే జనవరి 12 దాకా ఆగి తెరమీద చూడాల్సిందే.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆరో తేదీ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో చేయబోతున్నట్టు తెలిసింది. పాసులను సిద్ధం చేసేశారు. అతిథిగా టీమ్ తప్ప ఎవరూ రాకపోవచ్చని తెలిసింది. మాములుగా త్రివిక్రమ్ సినిమాలకు స్పెషల్ గెస్టులు ఎవరూ ఉండరు. హీరోనే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాడు. ఈసారి కూడా అదే జరగనుంది. టైం తక్కువగా ఉండటంతో థియేటర్ల కేటాయింపు, బిజినెస్ వ్యవహారాలు, వేడుక తాలూకు ఏర్పాట్లతో టీమ్ బిజీగా ఉంది. కొన్నేళ్ల మాస్ కరువు దీంతో పూర్తిగా తీరుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది.

This post was last modified on January 3, 2024 2:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిది రోజులే ఉంది భగత్ గారూ !

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…

2 hours ago

తెలివైన స్ట్రాటజీతో ఎన్టీఆర్ & నీల్

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…

3 hours ago

మెడికో దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…

4 hours ago

స‌భ్య‌త్వం సౌండ్ లేదు సైనికా

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ స‌భ్య‌త్వాన్ని గత నెల‌లోనే ప్రారంభించిన…

8 hours ago

మార‌క‌పోతే మార్చేస్తా.. త‌మ్ముళ్ల‌కు బాబు హెచ్చరిక‌

పార్టీ విధానాల‌కు, సిద్ధాంతాల‌కు అనుగుణంగా నాయ‌కులు ప‌నిచేయాల‌ని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు క‌లివిడిగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు టీడీపీ నాయ‌కుల‌కు సూచించారు. నంద్యాల…

10 hours ago