సోషల్ మీడియా వాడకం పెరిగాక సెలబ్రిటీలతో అభిమానులు దగ్గరయ్యే అవకాశం మరింత పెరిగింది. అధిక సందర్భాల్లో ఇది ప్రయోజనం కలిగించినా సమస్యలు తెచ్చిన దాఖలాలు లేకపోలేదు. నిన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ స్పేస్ లో ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. నిర్మాత నాగవంశీని ఆహ్వానిస్తే దానికి హాజరై ఆడియో రూపంలో ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకటి రెండు థియేటర్లున్న సింగల్ స్టేషన్లలో గుంటూరు కారం విడుదల గురించి ఆందోళన పడుతున్న విషయం ఆయన దృష్టికి తెచ్చారు. సైంధవ్ కోసం స్క్రీన్లు బ్లాక్ చేస్తారనే అనుమానం వ్యక్తం చేశారు.
దీనికి నాగవంశీ స్పందిస్తూ అలాంటిదేమి లేదని, ఎక్కడ సమస్యలు రాకుండా మంచి రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నామని, స్వంత హీరో కాబట్టి సైంధవ్ కోసం సురేష్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్లానింగ్ కి తానెలా అడ్డుపడగలనని, వాళ్ళ దగ్గరికి వెళ్లి మాది పెద్ద సినిమా కాబట్టి సహకరించమని ఎలా అడగాలని సమాధానం చెప్పారు. ఇక్కడిదాకా బాగానే ఉంది ఆయన ఫ్లోలో అన్న మాటలు సైంధవ్ ఏదో చిన్న సినిమా అని అర్థం వచ్చేలా ఉండటంతో ఒక్కసారిగా వెంకటేష్ ఫ్యాన్స్ కి కోపం వచ్చేలా చేసింది. దీంతో నాగవంశీని ట్యాగ్ చేస్తూ ఆన్ లైన్లో దూషణల దండకం అందుకున్నారు.
వీళ్లకు ధీటుగా మహేష్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు కానీ నిజానికి నాగవంశీ అన్న మాటలకు అర్థాలను వివిధ కోణాల్లో అన్వయించడంతో ఈ తిప్పలొచ్చి పడింది. జనవరి 8 తర్వాత థియేటర్ల కేటాయింపు గురించి క్లారిటీ వస్తుందని, అప్పటిదాకా అనవసరంగా టెన్షన్ పడొద్దని పదే పదే చెబుతున్నా ప్రశ్నలు రిపీట్ కావడంతో ఆయన అన్న సమాధానం కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. దీంతో వెంకీ మహేష్ ఫ్యాన్స్ నువ్వా నేనా అనే తరహాలో ఆర్గుమెంట్లు చేసుకుంటున్నారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే నాగవంశీ ఇదంతా గమనించే ఉంటారు కాని ఎలా తిరిగి స్పందిస్తారేమో చూడాలి.
This post was last modified on January 3, 2024 12:03 pm
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…