Movie News

అభిమానుల మధ్య సోషల్ మీడియా చిచ్చు

సోషల్ మీడియా వాడకం పెరిగాక సెలబ్రిటీలతో అభిమానులు దగ్గరయ్యే అవకాశం మరింత పెరిగింది. అధిక సందర్భాల్లో ఇది ప్రయోజనం కలిగించినా సమస్యలు తెచ్చిన దాఖలాలు లేకపోలేదు. నిన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ స్పేస్ లో ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. నిర్మాత నాగవంశీని ఆహ్వానిస్తే దానికి హాజరై ఆడియో రూపంలో ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకటి రెండు థియేటర్లున్న సింగల్ స్టేషన్లలో గుంటూరు కారం విడుదల గురించి ఆందోళన పడుతున్న విషయం ఆయన దృష్టికి తెచ్చారు. సైంధ‌వ్‌ కోసం స్క్రీన్లు బ్లాక్ చేస్తారనే అనుమానం వ్యక్తం చేశారు.

దీనికి నాగవంశీ స్పందిస్తూ అలాంటిదేమి లేదని, ఎక్కడ సమస్యలు రాకుండా మంచి రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నామని, స్వంత హీరో కాబట్టి సైంధ‌వ్‌ కోసం సురేష్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్లానింగ్ కి తానెలా అడ్డుపడగలనని, వాళ్ళ దగ్గరికి వెళ్లి మాది పెద్ద సినిమా కాబట్టి సహకరించమని ఎలా అడగాలని సమాధానం చెప్పారు. ఇక్కడిదాకా బాగానే ఉంది ఆయన ఫ్లోలో అన్న మాటలు సైంధ‌వ్‌ ఏదో చిన్న సినిమా అని అర్థం వచ్చేలా ఉండటంతో ఒక్కసారిగా వెంకటేష్ ఫ్యాన్స్ కి కోపం వచ్చేలా చేసింది. దీంతో నాగవంశీని ట్యాగ్ చేస్తూ ఆన్ లైన్లో దూషణల దండకం అందుకున్నారు.

వీళ్లకు ధీటుగా మహేష్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు కానీ నిజానికి నాగవంశీ అన్న మాటలకు అర్థాలను వివిధ కోణాల్లో అన్వయించడంతో ఈ తిప్పలొచ్చి పడింది. జనవరి 8 తర్వాత థియేటర్ల కేటాయింపు గురించి క్లారిటీ వస్తుందని, అప్పటిదాకా అనవసరంగా టెన్షన్ పడొద్దని పదే పదే చెబుతున్నా ప్రశ్నలు రిపీట్ కావడంతో ఆయన అన్న సమాధానం కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. దీంతో వెంకీ మహేష్ ఫ్యాన్స్ నువ్వా నేనా అనే తరహాలో ఆర్గుమెంట్లు చేసుకుంటున్నారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే నాగవంశీ ఇదంతా గమనించే ఉంటారు కాని ఎలా తిరిగి స్పందిస్తారేమో చూడాలి.

This post was last modified on January 3, 2024 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

9 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago