సోషల్ మీడియా వాడకం పెరిగాక సెలబ్రిటీలతో అభిమానులు దగ్గరయ్యే అవకాశం మరింత పెరిగింది. అధిక సందర్భాల్లో ఇది ప్రయోజనం కలిగించినా సమస్యలు తెచ్చిన దాఖలాలు లేకపోలేదు. నిన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ స్పేస్ లో ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. నిర్మాత నాగవంశీని ఆహ్వానిస్తే దానికి హాజరై ఆడియో రూపంలో ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒకటి రెండు థియేటర్లున్న సింగల్ స్టేషన్లలో గుంటూరు కారం విడుదల గురించి ఆందోళన పడుతున్న విషయం ఆయన దృష్టికి తెచ్చారు. సైంధవ్ కోసం స్క్రీన్లు బ్లాక్ చేస్తారనే అనుమానం వ్యక్తం చేశారు.
దీనికి నాగవంశీ స్పందిస్తూ అలాంటిదేమి లేదని, ఎక్కడ సమస్యలు రాకుండా మంచి రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నామని, స్వంత హీరో కాబట్టి సైంధవ్ కోసం సురేష్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్లానింగ్ కి తానెలా అడ్డుపడగలనని, వాళ్ళ దగ్గరికి వెళ్లి మాది పెద్ద సినిమా కాబట్టి సహకరించమని ఎలా అడగాలని సమాధానం చెప్పారు. ఇక్కడిదాకా బాగానే ఉంది ఆయన ఫ్లోలో అన్న మాటలు సైంధవ్ ఏదో చిన్న సినిమా అని అర్థం వచ్చేలా ఉండటంతో ఒక్కసారిగా వెంకటేష్ ఫ్యాన్స్ కి కోపం వచ్చేలా చేసింది. దీంతో నాగవంశీని ట్యాగ్ చేస్తూ ఆన్ లైన్లో దూషణల దండకం అందుకున్నారు.
వీళ్లకు ధీటుగా మహేష్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు కానీ నిజానికి నాగవంశీ అన్న మాటలకు అర్థాలను వివిధ కోణాల్లో అన్వయించడంతో ఈ తిప్పలొచ్చి పడింది. జనవరి 8 తర్వాత థియేటర్ల కేటాయింపు గురించి క్లారిటీ వస్తుందని, అప్పటిదాకా అనవసరంగా టెన్షన్ పడొద్దని పదే పదే చెబుతున్నా ప్రశ్నలు రిపీట్ కావడంతో ఆయన అన్న సమాధానం కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. దీంతో వెంకీ మహేష్ ఫ్యాన్స్ నువ్వా నేనా అనే తరహాలో ఆర్గుమెంట్లు చేసుకుంటున్నారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే నాగవంశీ ఇదంతా గమనించే ఉంటారు కాని ఎలా తిరిగి స్పందిస్తారేమో చూడాలి.
This post was last modified on January 3, 2024 12:03 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…