గత కొంత కాలంగా వరసగా ఎఫ్2, ఎఫ్3, ఓరి దేవుడా లాంటి ఎంటర్ టైనర్స్ తో నవ్వించే పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన విక్టరీ వెంకటేష్ చాలా గ్యాప్ తర్వాత ఊర మాస్ యాక్షన్ అవతారంలో సైంధవ్ గా రాబోతున్నాడు. నారప్పలో సీరియస్ క్యారెక్టర్ చేసినప్పటికీ అది ఓటిటి రిలీజ్ కావడంతో అభిమానులు అంతగా సంతృప్తి చెందలేదు. బిగ్ స్క్రీన్ మీద గణేష్ ని మించిన విశ్వరూపాన్ని ఆశిస్తున్నారు. అందుకే శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సైంధవ్ మీద ప్రాజెక్టు ప్రారంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. జనవరి 13 విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ చేశారు.
గారాల కూతురే ప్రాణంగా బ్రతికే సైంధవ్(వెంకటేష్) తనకే లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. ఓ రోజు స్కూల్లో పాప హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అది ప్రమాదకరమైన నరాల వ్యాధని, బ్రతకాలంటే 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు చెబుతారు. అప్పటిదాకా శాంతంగా జీవితాన్ని గడుపుతున్న సైంధవ్ హింసాత్మకమైన తన గతాన్ని తవ్వుతాడు. ఈ క్రమంలోనే మెడికల్ వ్యాపారంలో ఉన్న పాత్ర శత్రువులు(నవాజుద్దీన్ సిద్ధిక్-ముఖేష్ ఋషి)లతో తలపడాల్సి వస్తుంది. మనుషులను నల్లుల కంటే దారుణంగా చంపే పరిస్థితి వస్తుంది. అదెలాగో థియేటర్లోనే చూడాలి.
విజువల్స్ మొత్తం యాక్షన్ కంటెంట్ తో నిండిపోయాయి. ఫ్యాన్స్ అంచనాలకు మించి వెంకటేష్ చేసే రక్తపాతం మాములుగా లేదు. స్టోరీని దాచకుండా ట్రైలర్ లోనే రివీల్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇంత సీరియస్ సబ్జెక్టుని కమర్షియల్ కోటింగ్ తో చెప్పే ప్రయత్నం చేయడం సాహసమే. శ్రద్ధ శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియాలతో పాటు నవాజుద్దీన్ సిద్ధిక్ ల క్యారెక్టర్లు మంచి ఇంటెన్స్ తో కనిపిస్తున్నాయి. మణికందన్ ఛాయాగ్రహణం, సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం రెండూ ఎలివేట్ అయ్యాయి. సరిగ్గా ఇంకో పది రోజుల్లో తెరమీద సైంధవ్ ఊచకోత మొదలవుతుంది.
This post was last modified on January 3, 2024 11:32 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…