సలార్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా లేక బాక్సాఫీస్ కొంత డల్లుగా ఉంది. అదొచ్చి పది రోజులు దాటేసింది. ప్రేక్షకులు భారీగా చూసేశారు. అందుకే 29న విడుదలైన డెవిల్ కు మంచి ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ అంచనా వేసింది. డివైడ్ టాక్ సంగతి పక్కనపెడితే వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోంది. రిలీజ్ రోజు కంటే న్యూ ఇయర్ డేకి ఎక్కువ కలెక్షన్లు నమోదు కావడమే దానికి నిదర్శనం. మొదటి మూడు రోజులకు కేవలం అయిదు కోట్ల షేర్ మాత్రమే నమోదు చేసిన డెవిల్ నిన్న ఒక్క రోజే రెండున్నర కోట్లకు పైగా రాబట్టడం విశేషం. సలార్ తర్వాత అధిక ఆక్యుపెన్సీలు కళ్యాణ్ రామ్ కే కనిపించాయి.
ఇప్పటిదాకా వచ్చిన మొత్తం చూసుకుంటే ఏడు కోట్ల షేర్ దాటేయడం మంచి పరిణామం. అయితే టార్గెట్ ఇంకా దూరం ఉంది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇరవై కోట్లు రాబట్టాలి. ఇది అంత సులభం కాదు. పర్వాలేదనే మాట పబ్లిక్ నుంచి రావడంతో క్రమంగా కలెక్షన్లు మెరుగు పడుతున్నాయి. నిన్న సెలవు రోజు కావడం వల్లే నెంబర్లు పెరిగాయన్నది వాస్తవమే కానీ ఇవాళ్టి నుంచి రాబోయే ఆదివారం దాకా కాస్త హోల్డ్ చేసుకోగలిగితే గట్టెక్కే అవకాశాలు పెరుగుతాయి. బబుల్ గమ్, సర్కారు నౌకరి లాంటివి జనాన్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.
సో డెవిల్ కు ఇంకో పది రోజులు చేతిలో ఉన్నాయి. సరిగ్గా వాడుకుంటే లాభాలు కాకపోయినా కనీసం నష్టాలు రాకుండా సేఫ్ కావొచ్చు. ముందైతే టీమ్ ప్రమోషన్ల స్పీడ్ పెంచాలి. పోస్టర్లతో సరిపెట్టకుండా ఇంకేదైనా వినూత్నంగా ఆలోచించాలి. ఫ్యాన్స్ సక్సెస్ టూర్ లాంటివి డిమాండ్ చేస్తున్నారు కానీ టీమ్ అంత సుముఖంగా లేదట. దాని స్థానంలో ఏదైనా ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన ఉంది కానీ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అభిషేక్ నామా దర్శకత్వం ప్లస్ నిర్మాణంలో రూపొందిన డెవిల్ బృందం ప్రస్తుతం ఇంటర్వ్యూల ద్వారా పబ్లిసిటీ చేయడంలో బిజీగా ఉంది.
This post was last modified on January 2, 2024 6:28 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…