Movie News

మహేష్ అభిమానులు గరం గరం

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో పెద్దోడు చిన్నోడుని చాలా రోజుల తర్వాత ఒకే స్టేజి మీద చూడొచ్చని ఎదురు చూసిన అభిమానులకు నిన్న జరిగిన వెంకీ 75 ఈవెంట్ లో నిరాశే ఎదురయ్యింది. చిరంజీవితో పాటు నాగ్, బాలయ్య, మహేష్ బాబు వస్తారని నిర్వాహకులు ముందే ప్రకటించడంతో దానికి తగ్గట్టే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వచ్చారు. వేడుక నిర్వహించిన ఈటీవీ విన్ అడిగినట్టు నెల చందా తీసుకుని, సోషల్ మీడియాలో స్పందించి, వాళ్ళు కోరిన చోటకు వెళ్లి మరీ పాసులు తీసుకున్నారు. దీనికి గంటల తరబడి సమయాన్ని, వ్యయ ప్రయాసలను భరించారు. కానీ మహేష్ రాలేదు.

కారణం లేకపోలేదు. గుంటూరు కారం చివరి దశ షూటింగ్ పీకల మీద జరుగుతోంది.ఇవాళో రేపో గుమ్మడికాయ కొట్టేందుకు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి టైంలో రెండు మూడు గంటలు ఒక ఈవెంట్ కొచ్చి కూర్చునేంత తీరిక మహేష్ దగ్గర లేదు. ముందు రావాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమే. కానీ నిన్న షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీకరణ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో పొద్దుపోయే దాకా సెట్లోనే ఉండాల్సి వచ్చింది. పోనీ లేట్ గా వెళ్దామంటే అక్కడ ఇతర గెస్టులుగా చిరంజీవి లాంటి సీనియర్లొచ్చారు కాబట్టి సాధ్యం కాదు.

ఇలా మహేష్ ఇష్టంలేకపోయినా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. నాగార్జునది కూడా ఇదే సమస్య. నా సామిరంగ ఒత్తిడిలో పరుగులు పెడుతున్నాడు. బాలయ్య సైతం హాజరు కాలేదు. అందరూ వచ్చి ఉంటే ఆ కళ, సందడి వేరుగా ఉండేది. అరుదైన కలయికకు జ్ఞాపకంగా నిలిచేది. ఎందుకంటే నలుగురు సీనియర్ స్టార్లు పబ్లిక్ గా కలిసి కనిపించి చాల ఏళ్ళు గడిచాయి. కానీ ఉన్నంతలో చిరంజీవితో పాటు యూత్ స్టార్లు రావడంతో స్టేజి సందడిగా మారింది. కలియుగ పాండవులు టు సైంధ‌వ్‌ పేరుతో చేసిన ఈ ఈవెంట్ ఆదివారం నుంచి ఇంట్లోనే చూసుకోవచ్చు.

This post was last modified on December 28, 2023 10:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌లిసిన పాత మిత్రులు: బాబు-తుమ్మ‌ల భేటీ!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు క‌లుసుకున్నారు. సోమవారం అమ‌రావ‌తికి…

5 hours ago

లవ్ స్టోరీని లైట్ తీసుకున్న ప్రేక్షకులు

ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…

6 hours ago

అభిమానుల టెన్ష‌న్ తీర్చిన చిరు

70 ఏళ్ల వ‌య‌సులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవ‌ల మ‌న శంక‌ర…

6 hours ago

మాస్ట్రో ఇళయరాజాకు షాకిచ్చిన కోర్టు

తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…

7 hours ago

చంద్రబాబు విజన్ పై గేట్స్ అభినందనలు

ఏపీ సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేయ‌డం త‌న‌కు కొత్త‌కాద‌ని మైక్రోసాఫ్ట్ స‌హ వ్యవస్థాప‌కుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు త‌న‌కు…

7 hours ago

అర్జున్ విశ్వక్ ఇద్దరూ దొరికిపోయారు

పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…

7 hours ago