మెగాస్టార్ అభిమానుల దృష్టంతా ప్రస్తుతం ‘విశ్వంభర’ మీదే ఉంది. ‘భోళాశంకర్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న చిరు.. దాని తర్వాత చేస్తున్న చిత్రమిదే. నిజానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నప్పటికీ.. దాన్ని పక్కన పెట్టి మరీ చిరు ఈ చిత్రంలోనే నటిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బేనర్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నవంబర్లో ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే.
రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు వశిష్ఠ. ఆ షెడ్యూల్ చిరు లేకుండానే మొదలు కావడం విశేషం. మెగాస్టార్ లేకుండానే ఈ షెడ్యూల్ పూర్తిగా లాగించేశారట. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ఆరంభం కాబోతోంది. ఆ షెడ్యూల్లో కూడా చిరు వెంటనే జాయిన్ కావట్లేదని సమాచారం.
చిరుకు మోకాళ్ళ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దాన్నుంచి ఆయన నెమ్మదిగా కోరుకుంటున్నారు. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఓవైపు ఫిట్నెస్ కసరత్తులు చేస్తూనే.. మరోవైపు విశ్వంభరకు అవసరమైన లుక్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు మెగాస్టార్. అందుకు ఇంకో నెల రోజులు సమయం పడుతుందని సమాచారం. జనవరి చివరలో లేదా ఫిబ్రవరి ఆరంభంలో ఆయన అందుబాటులోకి వస్తారట. అక్కడి నుంచి ఆయన విరామం లేకుండా చిత్రీకరణలో పాల్గొంటాడట. అప్పటివరకు చిరుతో సంబంధంలేని సన్నివేశాలనే చిత్రీకరించబోతున్నారు.
ఈ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. దర్శకుడు వశిష్ఠ కూడా ఆ మధ్య ‘విశ్వంభర’ జానర్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రస్తావన తెచ్చాడు. మెగాస్టార్ అలాంటి స్వచ్ఛమైన ఫాంటసీ మూవీలో నటించి మూడు దశాబ్దాలు అవుతోందనీ… ‘విశ్వంభర’లో మళ్ళీ అలాంటి అందమైన ప్రపంచాన్ని చూపిస్తామని.. ఈ చిత్రంలో 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని అతను చెప్పాడు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…