మెగాస్టార్ అభిమానుల దృష్టంతా ప్రస్తుతం ‘విశ్వంభర’ మీదే ఉంది. ‘భోళాశంకర్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న చిరు.. దాని తర్వాత చేస్తున్న చిత్రమిదే. నిజానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నప్పటికీ.. దాన్ని పక్కన పెట్టి మరీ చిరు ఈ చిత్రంలోనే నటిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బేనర్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నవంబర్లో ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే.
రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు వశిష్ఠ. ఆ షెడ్యూల్ చిరు లేకుండానే మొదలు కావడం విశేషం. మెగాస్టార్ లేకుండానే ఈ షెడ్యూల్ పూర్తిగా లాగించేశారట. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ఆరంభం కాబోతోంది. ఆ షెడ్యూల్లో కూడా చిరు వెంటనే జాయిన్ కావట్లేదని సమాచారం.
చిరుకు మోకాళ్ళ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దాన్నుంచి ఆయన నెమ్మదిగా కోరుకుంటున్నారు. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఓవైపు ఫిట్నెస్ కసరత్తులు చేస్తూనే.. మరోవైపు విశ్వంభరకు అవసరమైన లుక్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు మెగాస్టార్. అందుకు ఇంకో నెల రోజులు సమయం పడుతుందని సమాచారం. జనవరి చివరలో లేదా ఫిబ్రవరి ఆరంభంలో ఆయన అందుబాటులోకి వస్తారట. అక్కడి నుంచి ఆయన విరామం లేకుండా చిత్రీకరణలో పాల్గొంటాడట. అప్పటివరకు చిరుతో సంబంధంలేని సన్నివేశాలనే చిత్రీకరించబోతున్నారు.
ఈ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. దర్శకుడు వశిష్ఠ కూడా ఆ మధ్య ‘విశ్వంభర’ జానర్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రస్తావన తెచ్చాడు. మెగాస్టార్ అలాంటి స్వచ్ఛమైన ఫాంటసీ మూవీలో నటించి మూడు దశాబ్దాలు అవుతోందనీ… ‘విశ్వంభర’లో మళ్ళీ అలాంటి అందమైన ప్రపంచాన్ని చూపిస్తామని.. ఈ చిత్రంలో 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని అతను చెప్పాడు.
This post was last modified on December 27, 2023 9:56 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…