మెగాస్టార్ అభిమానుల దృష్టంతా ప్రస్తుతం ‘విశ్వంభర’ మీదే ఉంది. ‘భోళాశంకర్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న చిరు.. దాని తర్వాత చేస్తున్న చిత్రమిదే. నిజానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నప్పటికీ.. దాన్ని పక్కన పెట్టి మరీ చిరు ఈ చిత్రంలోనే నటిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బేనర్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నవంబర్లో ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే.
రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు వశిష్ఠ. ఆ షెడ్యూల్ చిరు లేకుండానే మొదలు కావడం విశేషం. మెగాస్టార్ లేకుండానే ఈ షెడ్యూల్ పూర్తిగా లాగించేశారట. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ఆరంభం కాబోతోంది. ఆ షెడ్యూల్లో కూడా చిరు వెంటనే జాయిన్ కావట్లేదని సమాచారం.
చిరుకు మోకాళ్ళ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దాన్నుంచి ఆయన నెమ్మదిగా కోరుకుంటున్నారు. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఓవైపు ఫిట్నెస్ కసరత్తులు చేస్తూనే.. మరోవైపు విశ్వంభరకు అవసరమైన లుక్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు మెగాస్టార్. అందుకు ఇంకో నెల రోజులు సమయం పడుతుందని సమాచారం. జనవరి చివరలో లేదా ఫిబ్రవరి ఆరంభంలో ఆయన అందుబాటులోకి వస్తారట. అక్కడి నుంచి ఆయన విరామం లేకుండా చిత్రీకరణలో పాల్గొంటాడట. అప్పటివరకు చిరుతో సంబంధంలేని సన్నివేశాలనే చిత్రీకరించబోతున్నారు.
ఈ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. దర్శకుడు వశిష్ఠ కూడా ఆ మధ్య ‘విశ్వంభర’ జానర్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రస్తావన తెచ్చాడు. మెగాస్టార్ అలాంటి స్వచ్ఛమైన ఫాంటసీ మూవీలో నటించి మూడు దశాబ్దాలు అవుతోందనీ… ‘విశ్వంభర’లో మళ్ళీ అలాంటి అందమైన ప్రపంచాన్ని చూపిస్తామని.. ఈ చిత్రంలో 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని అతను చెప్పాడు.
This post was last modified on December 27, 2023 9:56 pm
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…
సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…