Movie News

మెగా విలన్ దొరికేశాడు

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయిన సంగతి తెలిసిందే. ఇంకా హీరో ఎంట్రీ జరగలేదు. ప్యాడింగ్ ఆర్టిస్టులతో కొన్ని కీలక సన్నివేశాలతో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. మెగాస్టార్ సంక్రాంతి తర్వాత జాయినవుతారనే వార్త వచ్చింది కానీ ఇప్పుడది ఫిబ్రవరి కావొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా ఈ మెగా ప్యాన్ ఇండియా మూవీలో ముందు విలన్ గా దగ్గుబాటి రానాని అనుకున్న సంగతి తెలిసిందే. ప్రాధమికంగా కథా చర్చలు జరిగి ఓకే అనేసుకున్నారు. అయితే డేట్ల సమస్యతో పాటు ఇతరత్రా కారణాల వాళ్ళ రానా డ్రాప్ అయ్యాడట.

తాజాగా భల్లాలదేవా స్థానంలో బాలీవుడ్ విలన్ కునాల్ కిషోర్ కపూర్ ని తీసుకున్నట్టు అప్డేట్. ఇతనికిది డెబ్యూ కాదు. గతంలో నాగార్జున నాని దేవదాస్ లో తెరంగేట్రం చేశాడు. సైమా అవార్డుకు నామినేట్ అయ్యాడు కానీ పురస్కారం దక్కలేదు. కానీ మూవీ ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో మళ్ళీ తెలుగులో కనిపించలేదు. అమీర్ ఖాన్ రంగ్ దే బసంతి నుంచే ఆడియన్స్ కి పరిచయమున్న కునాల్ కపూర్ పంతొమ్మిదేళ్ళ సుదీర్ఘ కెరీర్ లో చేసింది చాలా తక్కువ సినిమాలు. ఇప్పుడు విశ్వంభర కనక క్లిక్ అయితే కెరీర్ పరంగా మరో ఇన్నింగ్స్ ని టాలీవుడ్లో మొదలుపెట్టొచ్చు.

యూనిట్ ఏదీ అఫీషియల్ గా చెప్పడం లేదు. త్రిషను లాక్ చేసుకోవడం, ఇప్పుడు కునాల్ వచ్చి చేరడం, మారేడుమిల్లిలో కొంత పూర్తి కావడం ఇవన్నీ గుట్టుచప్పుడు కాకుండా కానిస్తున్నారు. సంక్రాంతికి టైటిల్ అనౌన్స్ మెంట్ కి అధికారికంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫోటో షూట్ నుంచి ఒక చిరు స్టిల్ తీసుకుని ఫస్ట్ లుక్ వదిలే ఆలోచన చేస్తున్నారు కానీ ఎంత వరకు నిజమవుతుందో చెప్పలేం. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న విశ్వంభరలో మరో ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలియాల్సి ఉంది. అనుష్క, మృణాల్ ఠాకూర్ ఇలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

This post was last modified on December 27, 2023 6:44 pm

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

2 minutes ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

32 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

49 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

1 hour ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

3 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago