ప్రభాస్ ‘ఆదిపురుష్’లో శ్రీరాముడి పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. బాహుబలి ప్రభాస్ రాముడిగా బాగుంటాడనే ఏకాభిప్రాయం వినిపిస్తోంది. అయితే అతని సరసన సీతగా నటించేదెవరు? కియారా అద్వానీని ఆ పాత్రకు కన్సిడర్ చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఈ కథనాలను ఖండించలేదు.
అయితే ఈ న్యూస్ రామ భక్తుల చెవిన పడిన తర్వాత సీతగా ఆమెను అంగీకరించమని, వేరే ఎవరినైనా పెట్టుకోవాలని సోషల్ మీడియాలో విన్నపాలు పెడుతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే కియారా ఇంతకుముందు చేసిన పాత్రలట. ‘లస్ట్ స్టోరీస్’లో వైబ్రేటర్ సీన్లో నటించిన తర్వాత ఆమె మీమ్స్ను వెటకారంగా వాడుతుంటారు. అలాగే ఇతర వెబ్ సినిమాలలో డ్రగ్స్, తాగుడు అలవాటున్న పాత్రలు పోషించింది.
ఆ ఇమేజ్ వున్న కియారాను సీతగా చూడలేమని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా ఆమెను ఈ పాత్రకోసం కన్సిడర్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ రియాక్షన్లు చూసిన తర్వాత వాళ్లు ఖచ్చితంగా ఆ ఐడియా డ్రాప్ చేసుకుంటారు. మరి ముందుగా వినిపించిన కీర్తి సురేష్ బెస్ట్ ఆప్షన్ అనుకుంటారా లేదా బాలీవుడ్ హీరోయిన్లలోనే సీతను వెతుక్కుంటారా?
This post was last modified on September 3, 2020 1:09 am
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…