ప్రభాస్ ‘ఆదిపురుష్’లో శ్రీరాముడి పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. బాహుబలి ప్రభాస్ రాముడిగా బాగుంటాడనే ఏకాభిప్రాయం వినిపిస్తోంది. అయితే అతని సరసన సీతగా నటించేదెవరు? కియారా అద్వానీని ఆ పాత్రకు కన్సిడర్ చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఈ కథనాలను ఖండించలేదు.
అయితే ఈ న్యూస్ రామ భక్తుల చెవిన పడిన తర్వాత సీతగా ఆమెను అంగీకరించమని, వేరే ఎవరినైనా పెట్టుకోవాలని సోషల్ మీడియాలో విన్నపాలు పెడుతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే కియారా ఇంతకుముందు చేసిన పాత్రలట. ‘లస్ట్ స్టోరీస్’లో వైబ్రేటర్ సీన్లో నటించిన తర్వాత ఆమె మీమ్స్ను వెటకారంగా వాడుతుంటారు. అలాగే ఇతర వెబ్ సినిమాలలో డ్రగ్స్, తాగుడు అలవాటున్న పాత్రలు పోషించింది.
ఆ ఇమేజ్ వున్న కియారాను సీతగా చూడలేమని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా ఆమెను ఈ పాత్రకోసం కన్సిడర్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ రియాక్షన్లు చూసిన తర్వాత వాళ్లు ఖచ్చితంగా ఆ ఐడియా డ్రాప్ చేసుకుంటారు. మరి ముందుగా వినిపించిన కీర్తి సురేష్ బెస్ట్ ఆప్షన్ అనుకుంటారా లేదా బాలీవుడ్ హీరోయిన్లలోనే సీతను వెతుక్కుంటారా?
This post was last modified on September 3, 2020 1:09 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…