ప్రభాస్ ‘ఆదిపురుష్’లో శ్రీరాముడి పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. బాహుబలి ప్రభాస్ రాముడిగా బాగుంటాడనే ఏకాభిప్రాయం వినిపిస్తోంది. అయితే అతని సరసన సీతగా నటించేదెవరు? కియారా అద్వానీని ఆ పాత్రకు కన్సిడర్ చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఈ కథనాలను ఖండించలేదు.
అయితే ఈ న్యూస్ రామ భక్తుల చెవిన పడిన తర్వాత సీతగా ఆమెను అంగీకరించమని, వేరే ఎవరినైనా పెట్టుకోవాలని సోషల్ మీడియాలో విన్నపాలు పెడుతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే కియారా ఇంతకుముందు చేసిన పాత్రలట. ‘లస్ట్ స్టోరీస్’లో వైబ్రేటర్ సీన్లో నటించిన తర్వాత ఆమె మీమ్స్ను వెటకారంగా వాడుతుంటారు. అలాగే ఇతర వెబ్ సినిమాలలో డ్రగ్స్, తాగుడు అలవాటున్న పాత్రలు పోషించింది.
ఆ ఇమేజ్ వున్న కియారాను సీతగా చూడలేమని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా ఆమెను ఈ పాత్రకోసం కన్సిడర్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ రియాక్షన్లు చూసిన తర్వాత వాళ్లు ఖచ్చితంగా ఆ ఐడియా డ్రాప్ చేసుకుంటారు. మరి ముందుగా వినిపించిన కీర్తి సురేష్ బెస్ట్ ఆప్షన్ అనుకుంటారా లేదా బాలీవుడ్ హీరోయిన్లలోనే సీతను వెతుక్కుంటారా?
This post was last modified on September 3, 2020 1:09 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…