ఈ మధ్య వెబ్ సిరీస్ లో ఏదైనా షాకింగ్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులకు వెంటనే చేరిపోయి దాని గురించిన చర్చలు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ‘కర్రీ అండ్ సైనైడ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్ వచ్చింది. ఇది 2002 నుంచి 2014 మధ్య జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. కేరళలోని కూడతాయి అనే పట్టణంలో జాలీ జోసెఫ్ అనే ఆవిడ ఏళ్ళ తరబడి తన స్వంత కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఒక్కొక్కరిని తిండిలో విషం పెట్టి చంపిన దారుణమైన సంఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. పదేళ్ల తర్వాత ఈ దారుణం వెలుగు చూసింది.
బాగా వెనుకబడిన కుటుంబానికి చెందిన జాలీ చదువుకున్న కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితంలో లగ్జరిలను చూడొచ్చనే ఉద్దేశంతో రాయ్ థామస్ ని జీవిత భాగస్వామి చేసుకుంటుంది. ఉద్యోగం చేయమని అత్త పోరు పెట్టడంతో ముందు ఆవిడని చంపేస్తుంది. తర్వాత తన మగ స్నేహాల మీద అనుమానపడిన మావయ్యని విషపు గుళికలు ఇచ్చి ప్రాణాలు తీస్తుంది. ఆ తర్వాత బంధువుని మోహించి అతని రెండేళ్ల కూతురిని, అతని భార్యని, ఇదంతా ముందే పసిగట్టిన దగ్గరి బంధువును ఇలా అందరినీ కాటికి పంపిస్తుంది. చివరికి ఆడపడుచుకి డౌట్ వచ్చి పోలీస్ కంప్లయింట్ ఇచ్చాక శవాలను తవ్వి తీస్తారు.
పక్కా ఆధారాలతో జాలీ కటకటాలపాలైంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. స్వంత కొడుకే తల్లి హంతకురాలని మీడియా ముందు చెప్పడం సంచలనం రేపింది. దీన్ని గంటా నలభై నిమిషాల సిరీస్ తరహా మూవీగా అందించారు. ఇందులో నిజంగా ఈ ఘటనకు సాక్షులుగా నిలిచిన కుటుంబ సభ్యులు, పోలీసులతో ఇంటర్వ్యూలు చేసి, ఇవన్నీ జరిగిన ఇళ్లను ప్రత్యక్షంగా చూపించి ఒళ్ళు గగుర్పొడిచేలా చూపించారు. సినిమాల్లో, వెబ్ సిరీస్ లు చూసి మనుషులు ఇంత దారుణంగా ఉంటారాని అనుకుంటాం కానీ అంత కన్నా కిరాతకంగా మంచితనం ముసుగు వేసుకున్న జాలీలు ఎందరో.
This post was last modified on December 26, 2023 12:04 pm
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…