ఈ మధ్య వెబ్ సిరీస్ లో ఏదైనా షాకింగ్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులకు వెంటనే చేరిపోయి దాని గురించిన చర్చలు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ‘కర్రీ అండ్ సైనైడ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్ వచ్చింది. ఇది 2002 నుంచి 2014 మధ్య జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. కేరళలోని కూడతాయి అనే పట్టణంలో జాలీ జోసెఫ్ అనే ఆవిడ ఏళ్ళ తరబడి తన స్వంత కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఒక్కొక్కరిని తిండిలో విషం పెట్టి చంపిన దారుణమైన సంఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. పదేళ్ల తర్వాత ఈ దారుణం వెలుగు చూసింది.
బాగా వెనుకబడిన కుటుంబానికి చెందిన జాలీ చదువుకున్న కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితంలో లగ్జరిలను చూడొచ్చనే ఉద్దేశంతో రాయ్ థామస్ ని జీవిత భాగస్వామి చేసుకుంటుంది. ఉద్యోగం చేయమని అత్త పోరు పెట్టడంతో ముందు ఆవిడని చంపేస్తుంది. తర్వాత తన మగ స్నేహాల మీద అనుమానపడిన మావయ్యని విషపు గుళికలు ఇచ్చి ప్రాణాలు తీస్తుంది. ఆ తర్వాత బంధువుని మోహించి అతని రెండేళ్ల కూతురిని, అతని భార్యని, ఇదంతా ముందే పసిగట్టిన దగ్గరి బంధువును ఇలా అందరినీ కాటికి పంపిస్తుంది. చివరికి ఆడపడుచుకి డౌట్ వచ్చి పోలీస్ కంప్లయింట్ ఇచ్చాక శవాలను తవ్వి తీస్తారు.
పక్కా ఆధారాలతో జాలీ కటకటాలపాలైంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. స్వంత కొడుకే తల్లి హంతకురాలని మీడియా ముందు చెప్పడం సంచలనం రేపింది. దీన్ని గంటా నలభై నిమిషాల సిరీస్ తరహా మూవీగా అందించారు. ఇందులో నిజంగా ఈ ఘటనకు సాక్షులుగా నిలిచిన కుటుంబ సభ్యులు, పోలీసులతో ఇంటర్వ్యూలు చేసి, ఇవన్నీ జరిగిన ఇళ్లను ప్రత్యక్షంగా చూపించి ఒళ్ళు గగుర్పొడిచేలా చూపించారు. సినిమాల్లో, వెబ్ సిరీస్ లు చూసి మనుషులు ఇంత దారుణంగా ఉంటారాని అనుకుంటాం కానీ అంత కన్నా కిరాతకంగా మంచితనం ముసుగు వేసుకున్న జాలీలు ఎందరో.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…