Movie News

కూరలో విషంతో భయపెట్టిన జాలీ

ఈ మధ్య వెబ్ సిరీస్ లో ఏదైనా షాకింగ్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులకు వెంటనే చేరిపోయి దాని గురించిన చర్చలు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ‘కర్రీ అండ్ సైనైడ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్ వచ్చింది. ఇది 2002 నుంచి 2014 మధ్య జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. కేరళలోని కూడతాయి అనే పట్టణంలో జాలీ జోసెఫ్ అనే ఆవిడ ఏళ్ళ తరబడి తన స్వంత కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఒక్కొక్కరిని తిండిలో విషం పెట్టి చంపిన దారుణమైన సంఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. పదేళ్ల తర్వాత ఈ దారుణం వెలుగు చూసింది.

బాగా వెనుకబడిన కుటుంబానికి చెందిన జాలీ చదువుకున్న కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితంలో లగ్జరిలను చూడొచ్చనే ఉద్దేశంతో రాయ్ థామస్ ని జీవిత భాగస్వామి చేసుకుంటుంది. ఉద్యోగం చేయమని అత్త పోరు పెట్టడంతో ముందు ఆవిడని చంపేస్తుంది. తర్వాత తన మగ స్నేహాల మీద అనుమానపడిన మావయ్యని విషపు గుళికలు ఇచ్చి ప్రాణాలు తీస్తుంది. ఆ తర్వాత బంధువుని మోహించి అతని రెండేళ్ల కూతురిని, అతని భార్యని, ఇదంతా ముందే పసిగట్టిన దగ్గరి బంధువును ఇలా అందరినీ కాటికి పంపిస్తుంది. చివరికి ఆడపడుచుకి డౌట్ వచ్చి పోలీస్ కంప్లయింట్ ఇచ్చాక శవాలను తవ్వి తీస్తారు.

పక్కా ఆధారాలతో జాలీ కటకటాలపాలైంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. స్వంత కొడుకే తల్లి హంతకురాలని మీడియా ముందు చెప్పడం సంచలనం రేపింది. దీన్ని గంటా నలభై నిమిషాల సిరీస్ తరహా మూవీగా అందించారు. ఇందులో నిజంగా ఈ ఘటనకు సాక్షులుగా నిలిచిన కుటుంబ సభ్యులు, పోలీసులతో ఇంటర్వ్యూలు చేసి, ఇవన్నీ జరిగిన ఇళ్లను ప్రత్యక్షంగా చూపించి ఒళ్ళు గగుర్పొడిచేలా చూపించారు. సినిమాల్లో, వెబ్ సిరీస్ లు చూసి మనుషులు ఇంత దారుణంగా ఉంటారాని అనుకుంటాం కానీ అంత కన్నా కిరాతకంగా మంచితనం ముసుగు వేసుకున్న జాలీలు ఎందరో.

This post was last modified on December 26, 2023 12:04 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

58 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

2 hours ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago