క్రిస్మస్ పండగని లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగిన సలార్ ఊహించిన దానికన్నా అరాచకంగా వసూళ్లు రాబడుతున్నాడు. యూనిట్ అధికారికంగా మూడు రోజుల గ్రాస్ ని 402 కోట్లుగా ప్రకటించడంలోని నిజాల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఓవరాల్ గా చూస్తే శుక్రవారంతో మొదలుపెట్టి ఇవాళ సోమవారం దాకా ప్రభాస్ చేస్తున్న విధ్వంసం హౌస్ ఫుల్ బోర్డుల రూపంలో కనిపిస్తోంది. అయితే కర్ణాటకలో మాత్రం ఆశించిన స్థాయిలో దూకుడు చూపించడం లేదు. తమిళనాడు. కేరళ కన్నా మెరుగ్గానే ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పద్నాలుగు కోట్లకు దగ్గరగా మాత్రమే షేర్ వచ్చింది.
దీనికి పలు కారణాలున్నాయి. మొదటిది సలార్ దర్శకుడు ప్రశాంత్ నీలే తీసిన కన్నడ మూవీ ఉగ్రంకి రీమేకనే నిర్ధారణ విడుదలకు ముందే వచ్చేయడం. ఉగ్రంని శాండల్ వుడ్ ఆడియన్స్ ఎప్పుడో చూసేసి బ్లాక్ బస్టర్ చేశారు. యూట్యూబ్ లో ఉచితంగా అందుబాటులో ఉంది. టీవీలో బోలెడుసార్లు చూసినవాళ్లకు సలార్ లో గ్రాండియర్ తప్ప కథ పరంగా కొత్తదనం అనిపించదు. పైగా సోషల్ మీడియాలో రెండు సినిమాల తాలూకు పిక్స్, వీడియోస్ పోలుస్తూ మరీ ట్వీట్లు చేయడం ఆసక్తిని తగ్గించింది. రెండోది ప్రభాస్ ని వాళ్ళు బాహుబలి మినహాయించి ఇంకా పూర్తిగా ఓన్ చేసుకోకపోవడం.
వీటికి తోడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తో స్వంత గడ్డ మీద ఇండస్ట్రీ హిట్టు కొట్టి ఇప్పుడు పక్క బాషల హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో సినిమాలు చేయడం హార్డ్ కోర్ కన్నడ అభిమానులకు నచ్చడం లేదు. ఈ నిరసన కూడా కొంత ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడమే కాదు కెజిఎఫ్ తో పోలిక తేవడం కూడా అధిక శాతం ప్రేక్షకులను దూరం చేసింది. తెలుగులో ఈ ఇబ్బంది ఎందుకు రాలేదంటే మనకు అల్లరి నరేష్ ఉగ్రం తెలుసు కానీ శ్రీమురళి ఉగ్రం చూడలేదు కాబట్టి. అదండీ కన్నడనాడులో సలార్ వెనుకబాటు వెనుక అసలు కోణం.
This post was last modified on December 25, 2023 8:09 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…