సలార్ విడుదలై మూడు రోజులు దాటేసింది. ఒకపక్క రికార్డులు బద్దలైపోతున్నాయి. షారుఖ్ ఖాన్ డంకీని డామినేట్ చేసే తరహాలో అన్ని చోట్ల వసూళ్ల సునామి సృష్టిస్తోంది. అయితే ఇప్పటిదాకా దర్శక ధీర రాజమౌళి తన స్పందన ఇంకా చెప్పలేదని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కు ముందు ఆయనే స్వయంగా చొరవ తీసుకుని సలార్ టీమ్ అభ్యర్థన మేరకు ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి హోంబాలే ఫిలిమ్స్ చేసిన ప్రమోషన్ ఇదొక్కటే. ఇందులో కంటెంట్ బాగా వైరల్ అయ్యింది కూడా.
అలాంటిది రాజమౌళి సోషల్ మీడియాలో ఇంకా సలార్ గురించి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇవ్వకపోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి నుంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు అంటే చాలా బిజీ ఉన్నాడు కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు కానీ మాములుగా మొదటి రోజే ఇలాంటి సినిమాలు చూసే అలవాటున్న జక్కన్న ఇప్పటిదాకా ఆగారంటే నమ్మడం కష్టమే. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన రాజమౌళి దాని విషయంలోనూ మౌనంగా ఉన్నారు. అదంటే కంటెంట్ మీద డిబేట్లు జరిగాయి కాబట్టి ఏదో అనుకోవచ్చు. కానీ సలార్ కు ఆ సమస్య లేదుగా. అధిక శాతం ఆడియన్స్ మెచ్చుకున్నదేగా.
రేపో ఎల్లుండో ఏదైనా ట్వీట్ లేదా వీడియో ఉంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కి ఇంత పెద్ద ప్యాన్ ఇండియా ఇమేజ్ రావడానికి బాహుబలి వేసిన పునాది చిన్నది కాదు. అదే లేకపోతే ఇవాళ డార్లింగ్ మార్కెట్ ఈ స్థాయిలో ఉండేది కాదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అందుకే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ టైంలోనూ రాజమౌళి వాటి పట్ల ఆసక్తి చూపించి తనవంతుగా అంచనాలు పెంచేందుకు దోహదపడ్డారు. వరల్డ్ కప్ లో కోహ్లీ గురించి అభినందన ట్వీట్ తర్వాత రాజమౌళి నుంచి ట్విట్టర్ లో ఎలాంటి యాక్టివ్ మూమెంట్ లేదు. సలార్ తో మళ్ళీ మొదలుపెడతారేమో చూడాలి.
This post was last modified on December 24, 2023 11:27 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…