సలార్ విడుదలై మూడు రోజులు దాటేసింది. ఒకపక్క రికార్డులు బద్దలైపోతున్నాయి. షారుఖ్ ఖాన్ డంకీని డామినేట్ చేసే తరహాలో అన్ని చోట్ల వసూళ్ల సునామి సృష్టిస్తోంది. అయితే ఇప్పటిదాకా దర్శక ధీర రాజమౌళి తన స్పందన ఇంకా చెప్పలేదని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కు ముందు ఆయనే స్వయంగా చొరవ తీసుకుని సలార్ టీమ్ అభ్యర్థన మేరకు ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి హోంబాలే ఫిలిమ్స్ చేసిన ప్రమోషన్ ఇదొక్కటే. ఇందులో కంటెంట్ బాగా వైరల్ అయ్యింది కూడా.
అలాంటిది రాజమౌళి సోషల్ మీడియాలో ఇంకా సలార్ గురించి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇవ్వకపోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి నుంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు అంటే చాలా బిజీ ఉన్నాడు కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు కానీ మాములుగా మొదటి రోజే ఇలాంటి సినిమాలు చూసే అలవాటున్న జక్కన్న ఇప్పటిదాకా ఆగారంటే నమ్మడం కష్టమే. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన రాజమౌళి దాని విషయంలోనూ మౌనంగా ఉన్నారు. అదంటే కంటెంట్ మీద డిబేట్లు జరిగాయి కాబట్టి ఏదో అనుకోవచ్చు. కానీ సలార్ కు ఆ సమస్య లేదుగా. అధిక శాతం ఆడియన్స్ మెచ్చుకున్నదేగా.
రేపో ఎల్లుండో ఏదైనా ట్వీట్ లేదా వీడియో ఉంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కి ఇంత పెద్ద ప్యాన్ ఇండియా ఇమేజ్ రావడానికి బాహుబలి వేసిన పునాది చిన్నది కాదు. అదే లేకపోతే ఇవాళ డార్లింగ్ మార్కెట్ ఈ స్థాయిలో ఉండేది కాదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అందుకే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ టైంలోనూ రాజమౌళి వాటి పట్ల ఆసక్తి చూపించి తనవంతుగా అంచనాలు పెంచేందుకు దోహదపడ్డారు. వరల్డ్ కప్ లో కోహ్లీ గురించి అభినందన ట్వీట్ తర్వాత రాజమౌళి నుంచి ట్విట్టర్ లో ఎలాంటి యాక్టివ్ మూమెంట్ లేదు. సలార్ తో మళ్ళీ మొదలుపెడతారేమో చూడాలి.
This post was last modified on December 24, 2023 11:27 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…