సలార్ విడుదలై మూడు రోజులు దాటేసింది. ఒకపక్క రికార్డులు బద్దలైపోతున్నాయి. షారుఖ్ ఖాన్ డంకీని డామినేట్ చేసే తరహాలో అన్ని చోట్ల వసూళ్ల సునామి సృష్టిస్తోంది. అయితే ఇప్పటిదాకా దర్శక ధీర రాజమౌళి తన స్పందన ఇంకా చెప్పలేదని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కు ముందు ఆయనే స్వయంగా చొరవ తీసుకుని సలార్ టీమ్ అభ్యర్థన మేరకు ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి హోంబాలే ఫిలిమ్స్ చేసిన ప్రమోషన్ ఇదొక్కటే. ఇందులో కంటెంట్ బాగా వైరల్ అయ్యింది కూడా.
అలాంటిది రాజమౌళి సోషల్ మీడియాలో ఇంకా సలార్ గురించి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇవ్వకపోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి నుంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు అంటే చాలా బిజీ ఉన్నాడు కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు కానీ మాములుగా మొదటి రోజే ఇలాంటి సినిమాలు చూసే అలవాటున్న జక్కన్న ఇప్పటిదాకా ఆగారంటే నమ్మడం కష్టమే. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన రాజమౌళి దాని విషయంలోనూ మౌనంగా ఉన్నారు. అదంటే కంటెంట్ మీద డిబేట్లు జరిగాయి కాబట్టి ఏదో అనుకోవచ్చు. కానీ సలార్ కు ఆ సమస్య లేదుగా. అధిక శాతం ఆడియన్స్ మెచ్చుకున్నదేగా.
రేపో ఎల్లుండో ఏదైనా ట్వీట్ లేదా వీడియో ఉంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కి ఇంత పెద్ద ప్యాన్ ఇండియా ఇమేజ్ రావడానికి బాహుబలి వేసిన పునాది చిన్నది కాదు. అదే లేకపోతే ఇవాళ డార్లింగ్ మార్కెట్ ఈ స్థాయిలో ఉండేది కాదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అందుకే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ టైంలోనూ రాజమౌళి వాటి పట్ల ఆసక్తి చూపించి తనవంతుగా అంచనాలు పెంచేందుకు దోహదపడ్డారు. వరల్డ్ కప్ లో కోహ్లీ గురించి అభినందన ట్వీట్ తర్వాత రాజమౌళి నుంచి ట్విట్టర్ లో ఎలాంటి యాక్టివ్ మూమెంట్ లేదు. సలార్ తో మళ్ళీ మొదలుపెడతారేమో చూడాలి.
This post was last modified on December 24, 2023 11:27 pm
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువ.! నెల్లూరు జిల్లాలో అయితే ఓ ప్రజా ప్రతినిథి నేతృత్వంలోనే బెట్టింగులు…
అంబటి రాంబాబు.. పరిచయం అక్కర్లేని పేరిది. పేరుకి మంత్రి.! కానీ, ఆ నీటి పారుదల శాఖ తరఫున పెద్దగా మాట్లాడిందీ,…
"నేడు నా పుట్టిన రోజు.. వైసీపీ చచ్చిన రోజు``- అని వైసీపీ రెబల్ ఎంపీ, టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణరాజు…
మాములుగా కొత్త సినిమా ఏదైనా థియేటర్లో లేదా ఓటిటిలో నిర్మాత నిర్ణయాన్ని బట్టి రావడం ఇప్పటిదాకా చూస్తున్నాం. కానీ సోషల్…
ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి కూడా వారణాసి నియోజకవర్గం నుంచి తన నామినేషన్ సమర్పించారు. సొంత రాష్ట్రం…
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఏమైనా కావొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలోనూ ఇదే చర్చ సాగుతోంది. పోలింగ్…