రెండు వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ల తర్వాత చూడాల్సిన ఫలితం కాదిది. డంకీ పెర్ఫార్మన్స్ చూసి అభిమానులు ఫీలవుతోంది ఇదే. అలా అని సినిమా దారుణమైన డిజాస్టర్ కాదు. చూసినవాళ్లు తిట్టిపోయడం లేదు. అంచనాలు అందుకోలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు తప్పించి విపరీతంగా నిరాశ పడ్డామనే మాట కాదు. అలా నిర్మొహమాటంగా తిరస్కారానికి గురయ్యింది జీరో మాత్రమే. రాజ్ కుమార్ హిరానీ తో షారుఖ్ ఖాన్ మొదటిసారి చేతులు కలిపాడు కాబట్టి 3 ఇడియట్స్, పీకేని మించిన అవుట్ ఫుట్ మూవీ లవర్స్ ఆశించారు. కానీ అందులో సగం అందుకోడమే కష్టంగా అనిపించింది.
ఎవరు ఔనన్నా కాదన్నా డంకీ ఖచ్చితంగా సలార్ తాకిడి వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఖన్సార్ లో దేవా చేస్తున్న హింసాత్మక విధ్వంసం ముందు హార్డీ వలసవాద కష్టాలు. కామెడీలు మాస్ జనాలకు ఎక్కడం లేదు. ఓవర్సీస్ వరకు బాగానే చేస్తున్నప్పటికి జవాన్, పఠాన్ టైంలో కనిపించిన ఊపు సగం కూడా లేదు. నిర్మాతలు అధికారికంగా చెప్పిన ప్రకారమే రెండు రోజులకు కేవలం వంద కోట్లే రాబట్టిన డంకీకి ఆదివారం వసూళ్లు మెరుగ్గా ఉండటం కలిసి వస్తోంది. ఒకవేళ సలార్ తో రిస్క్ చేయకుండా డంకీ కనక సోలోగా వచ్చి ఉంటే ప్రయోజనం ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండదన్నది వాస్తవం.
ఆడియన్స్ కి ఆప్షన్ లేని సమయంలో డంకీ లాంటి వాటికి ప్లస్ అవుతుంది. మాస్ అంశాలు లేనప్పుడు అలాంటి కంటెంట్ తోనే వస్తున్న సలార్ ని తక్కువంచనా వేయడం వల్లే ఈ సమస్య వచ్చి పడింది. షారుఖ్ చేశాడు కాబట్టి డంకీ ఈ మాత్రమైనా లాగుతోంది. ఒకవేళ ఏ వరుణ్ ధావనో సిద్దార్థ్ మల్హోత్రానో చేసి ఉంటే రెండో రోజుకే టపా కట్టాల్సి వచ్చేదన్న మాట అబద్దం కాదు. ఒకటి మాత్రం నిజం. హిరానీలోని మేజిక్ టచ్ తగ్గిపోయింది. ఇంకా ఆయన పదేళ్ల వెనుక ఎంటర్ టైన్మెంట్ మీదే ఆధారపడుతున్నారు. అప్డేట్ అవ్వకపోతే ఎంత క్లాసిక్ డైరెక్టర్ కైనా ఇలాంటి రిజల్టే వస్తుంది.
This post was last modified on December 24, 2023 9:27 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…