మాములుగా ఒక నిర్మాణ సంస్థ పెద్ద స్థాయికి చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఉదాహరణకు సురేష్ ప్రౌఢుక్షన్స్, గీత ఆర్ట్స్, వైజయంతి మూవీస్ లాంటివి వందల కోట్ల బడ్జెట్ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. కానీ హోంబాలే ఫిలింస్ మాత్రం దీనికి భిన్నంగా ఎదుగుతోంది. కెజిఎఫ్, కాంతార, సలార్ దెబ్బకు ఒక్కసారిగా ఇండియాస్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటిగా మారిపోయింది. అయితే దీని వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. అదేంటో చూద్దాం. ఈ బ్యానర్ అధినేత విజయ్ కిరగందూర్ స్వంత ఊరు కర్ణాటకలోని మండ్య జిల్లాలో చిన్న గ్రామం.
సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడు గ్రామదేవత హోంబాలమ్మ పేరుని మిత్రుడు పునీత్ రాజ్ కుమార్ సూచించడంతో ఇంకేం ఆలోచించకుండా నామకరణం చేశారు. మొదటి చిత్రం నిన్నిందలే ఈ కాంబోలోనే ఘనవిజయం సాధించింది. యష్ తో తీసిన మాస్టర్ పీస్ బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా వీరి దశ తిరిగిపోయింది. తర్వాత పునీత్ రాజకుమార కూడా అదే ఫలితం అందుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో పరిచయం, కెజిఎఫ్ కు రూపకల్పన జరగడం, శాండల్ వుడ్ స్థాయి వెయ్యి కోట్లను దాటడం చకచకా జరిగిపోయాయి. విజయ్ భాగస్వామి చలువే గౌడ.
పునీత్ ఇచ్చిన సూచన వల్లే తనకు అమ్మవారి పేరు ఇంత ఖ్యాతిని విజయాలను ఇస్తోందని విజయ్ కిరగందూర్ నమ్మకం. పునీత్ తో ఒక భారీ ప్యాన్ ఇండియా మూవీని ప్రకటించాక అతను హఠాత్తుగా కన్నుమూయడం హోంబాలే అధినేతలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఒకవేళ పునీత్ కనక బ్రతికి ఉంటే కన్నడ చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే ఒక గొప్ప చిత్రాన్ని అందించేవాడినని విజయ్ తన సన్నిహితులతో అంటుంటారు. సలార్ సైతం బ్లాక్ బస్టర్ కావడంతో వీళ్ళ ఆనందం మాములుగా లేదు. తర్వాత బఘీరా, సలార్ 2 శౌర్యాంగ పర్వంలతో లైనప్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.
This post was last modified on December 24, 2023 2:15 pm
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…
ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో…
ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీల పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ గురించి ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. నెలకు కొంత…