Movie News

ఓటిటి కోసం ఎడిటింగ్ పనిలో సందీప్ వంగా

అదేంటి యానిమల్ విడుదలై పాతిక రోజులకు దగ్గరగా ఉంటే ఇంకా ఈ ఎడిటింగ్ ఏంటనుకుంటున్నారా. నిజమే. థియేట్రికల్ వెర్షన్ కోసం తాను రాజీ పడిన లోటుని భర్తీ చేసుకోవడానికి ఓటిటి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చే ప్రింట్ లో అన్ కట్ సీన్స్ ని జోడించే పనిలో ఉన్నాడట. ముందు తాను అనుకున్న 3 గంటల 30 నిమిషాల నిడివికి కట్టుబడి దానికి అనుగుణంగా ఏమేం మార్పులు అవసరమో వాటిని స్వయంగా చూసుకుంటున్నానని తాజాగా ఒక ముంబై మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో యాంకర్ షాక్ తిన్నాడు. ఇంకా పూర్తవ్వలేదని చెప్పడం మరో షాక్.

ఈ లెక్కన యానిమల్ స్మార్ట్ స్క్రీన్ లో చూసినప్పుడు ఫిల్టర్స్ లేకుండా స్పెషల్ సీన్లతో కొత్తగా కనిపిస్తాడన్న మాట. తొమ్మిది వందల కోట్లు దాటేసిన తర్వాత ఏ దర్శకుడైనా నింపాదిగా రెస్ట్ తీసుకోవడమో ;లేదా కొత్త సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టుకోవడమో చేస్తాడు. అంతే తప్ప ఇలా అమ్మేసిన ఓటిటి ప్రింట్ కోసం ఇంత కష్టపడటం అరుదు. కానీ సందీప్ వంగా మాత్రం రాజీ పడేది లేదంటున్నాడు. నిజానికి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నది ఇది కాదు. అసలు ఏ చిన్న కట్ లేకుండా సందీప్ మొదట్లో ఆమోదించిన నాలుగు గంటలకు పైగా ఉన్న లెన్త్ ని చూడాలని కోరుకుంటున్నారు.

కానీ అది సాధ్యపడకపోవచ్చు. లియో, పఠాన్, జవాన్ లాంటి వాటికి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది కానీ తీరా చూస్తే ఒకటి రెండు నిముషాలు తప్ప పెద్దగా తేడా లేకుండా స్ట్రీమింగ్ చేశారు. కానీ యానిమల్ వాటికి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. స్వయంగా సందీప్ వంగానే రంగంలోకి దిగాడు కాబట్టి మరింత పర్ఫెక్షన్ తో చూడొచ్చు. ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్, అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ ఇలా వరసగా మూడు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేసుకున్న సందీప్ రెడ్డి వంగాని వేరే హీరోలు ఎవరైనా కోరుకుంటే కనీసం 2027 దాకా ఎదురు చూడక తప్పేలా లేదు

This post was last modified on December 23, 2023 10:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

36 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago