అదేంటి యానిమల్ విడుదలై పాతిక రోజులకు దగ్గరగా ఉంటే ఇంకా ఈ ఎడిటింగ్ ఏంటనుకుంటున్నారా. నిజమే. థియేట్రికల్ వెర్షన్ కోసం తాను రాజీ పడిన లోటుని భర్తీ చేసుకోవడానికి ఓటిటి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చే ప్రింట్ లో అన్ కట్ సీన్స్ ని జోడించే పనిలో ఉన్నాడట. ముందు తాను అనుకున్న 3 గంటల 30 నిమిషాల నిడివికి కట్టుబడి దానికి అనుగుణంగా ఏమేం మార్పులు అవసరమో వాటిని స్వయంగా చూసుకుంటున్నానని తాజాగా ఒక ముంబై మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో యాంకర్ షాక్ తిన్నాడు. ఇంకా పూర్తవ్వలేదని చెప్పడం మరో షాక్.
ఈ లెక్కన యానిమల్ స్మార్ట్ స్క్రీన్ లో చూసినప్పుడు ఫిల్టర్స్ లేకుండా స్పెషల్ సీన్లతో కొత్తగా కనిపిస్తాడన్న మాట. తొమ్మిది వందల కోట్లు దాటేసిన తర్వాత ఏ దర్శకుడైనా నింపాదిగా రెస్ట్ తీసుకోవడమో ;లేదా కొత్త సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టుకోవడమో చేస్తాడు. అంతే తప్ప ఇలా అమ్మేసిన ఓటిటి ప్రింట్ కోసం ఇంత కష్టపడటం అరుదు. కానీ సందీప్ వంగా మాత్రం రాజీ పడేది లేదంటున్నాడు. నిజానికి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నది ఇది కాదు. అసలు ఏ చిన్న కట్ లేకుండా సందీప్ మొదట్లో ఆమోదించిన నాలుగు గంటలకు పైగా ఉన్న లెన్త్ ని చూడాలని కోరుకుంటున్నారు.
కానీ అది సాధ్యపడకపోవచ్చు. లియో, పఠాన్, జవాన్ లాంటి వాటికి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది కానీ తీరా చూస్తే ఒకటి రెండు నిముషాలు తప్ప పెద్దగా తేడా లేకుండా స్ట్రీమింగ్ చేశారు. కానీ యానిమల్ వాటికి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. స్వయంగా సందీప్ వంగానే రంగంలోకి దిగాడు కాబట్టి మరింత పర్ఫెక్షన్ తో చూడొచ్చు. ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్, అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ ఇలా వరసగా మూడు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేసుకున్న సందీప్ రెడ్డి వంగాని వేరే హీరోలు ఎవరైనా కోరుకుంటే కనీసం 2027 దాకా ఎదురు చూడక తప్పేలా లేదు
This post was last modified on December 23, 2023 10:25 pm
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…