అదేంటి యానిమల్ విడుదలై పాతిక రోజులకు దగ్గరగా ఉంటే ఇంకా ఈ ఎడిటింగ్ ఏంటనుకుంటున్నారా. నిజమే. థియేట్రికల్ వెర్షన్ కోసం తాను రాజీ పడిన లోటుని భర్తీ చేసుకోవడానికి ఓటిటి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చే ప్రింట్ లో అన్ కట్ సీన్స్ ని జోడించే పనిలో ఉన్నాడట. ముందు తాను అనుకున్న 3 గంటల 30 నిమిషాల నిడివికి కట్టుబడి దానికి అనుగుణంగా ఏమేం మార్పులు అవసరమో వాటిని స్వయంగా చూసుకుంటున్నానని తాజాగా ఒక ముంబై మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో యాంకర్ షాక్ తిన్నాడు. ఇంకా పూర్తవ్వలేదని చెప్పడం మరో షాక్.
ఈ లెక్కన యానిమల్ స్మార్ట్ స్క్రీన్ లో చూసినప్పుడు ఫిల్టర్స్ లేకుండా స్పెషల్ సీన్లతో కొత్తగా కనిపిస్తాడన్న మాట. తొమ్మిది వందల కోట్లు దాటేసిన తర్వాత ఏ దర్శకుడైనా నింపాదిగా రెస్ట్ తీసుకోవడమో ;లేదా కొత్త సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టుకోవడమో చేస్తాడు. అంతే తప్ప ఇలా అమ్మేసిన ఓటిటి ప్రింట్ కోసం ఇంత కష్టపడటం అరుదు. కానీ సందీప్ వంగా మాత్రం రాజీ పడేది లేదంటున్నాడు. నిజానికి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నది ఇది కాదు. అసలు ఏ చిన్న కట్ లేకుండా సందీప్ మొదట్లో ఆమోదించిన నాలుగు గంటలకు పైగా ఉన్న లెన్త్ ని చూడాలని కోరుకుంటున్నారు.
కానీ అది సాధ్యపడకపోవచ్చు. లియో, పఠాన్, జవాన్ లాంటి వాటికి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది కానీ తీరా చూస్తే ఒకటి రెండు నిముషాలు తప్ప పెద్దగా తేడా లేకుండా స్ట్రీమింగ్ చేశారు. కానీ యానిమల్ వాటికి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. స్వయంగా సందీప్ వంగానే రంగంలోకి దిగాడు కాబట్టి మరింత పర్ఫెక్షన్ తో చూడొచ్చు. ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్, అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ ఇలా వరసగా మూడు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేసుకున్న సందీప్ రెడ్డి వంగాని వేరే హీరోలు ఎవరైనా కోరుకుంటే కనీసం 2027 దాకా ఎదురు చూడక తప్పేలా లేదు
This post was last modified on December 23, 2023 10:25 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…