అదేంటి యానిమల్ విడుదలై పాతిక రోజులకు దగ్గరగా ఉంటే ఇంకా ఈ ఎడిటింగ్ ఏంటనుకుంటున్నారా. నిజమే. థియేట్రికల్ వెర్షన్ కోసం తాను రాజీ పడిన లోటుని భర్తీ చేసుకోవడానికి ఓటిటి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చే ప్రింట్ లో అన్ కట్ సీన్స్ ని జోడించే పనిలో ఉన్నాడట. ముందు తాను అనుకున్న 3 గంటల 30 నిమిషాల నిడివికి కట్టుబడి దానికి అనుగుణంగా ఏమేం మార్పులు అవసరమో వాటిని స్వయంగా చూసుకుంటున్నానని తాజాగా ఒక ముంబై మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో యాంకర్ షాక్ తిన్నాడు. ఇంకా పూర్తవ్వలేదని చెప్పడం మరో షాక్.
ఈ లెక్కన యానిమల్ స్మార్ట్ స్క్రీన్ లో చూసినప్పుడు ఫిల్టర్స్ లేకుండా స్పెషల్ సీన్లతో కొత్తగా కనిపిస్తాడన్న మాట. తొమ్మిది వందల కోట్లు దాటేసిన తర్వాత ఏ దర్శకుడైనా నింపాదిగా రెస్ట్ తీసుకోవడమో ;లేదా కొత్త సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టుకోవడమో చేస్తాడు. అంతే తప్ప ఇలా అమ్మేసిన ఓటిటి ప్రింట్ కోసం ఇంత కష్టపడటం అరుదు. కానీ సందీప్ వంగా మాత్రం రాజీ పడేది లేదంటున్నాడు. నిజానికి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నది ఇది కాదు. అసలు ఏ చిన్న కట్ లేకుండా సందీప్ మొదట్లో ఆమోదించిన నాలుగు గంటలకు పైగా ఉన్న లెన్త్ ని చూడాలని కోరుకుంటున్నారు.
కానీ అది సాధ్యపడకపోవచ్చు. లియో, పఠాన్, జవాన్ లాంటి వాటికి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది కానీ తీరా చూస్తే ఒకటి రెండు నిముషాలు తప్ప పెద్దగా తేడా లేకుండా స్ట్రీమింగ్ చేశారు. కానీ యానిమల్ వాటికి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. స్వయంగా సందీప్ వంగానే రంగంలోకి దిగాడు కాబట్టి మరింత పర్ఫెక్షన్ తో చూడొచ్చు. ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్, అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ ఇలా వరసగా మూడు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేసుకున్న సందీప్ రెడ్డి వంగాని వేరే హీరోలు ఎవరైనా కోరుకుంటే కనీసం 2027 దాకా ఎదురు చూడక తప్పేలా లేదు
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…