ప్రభాస్- ప్రశాంత్ నీల్ మెగా కాంబినేషన్లో రూపొందిన సలార్ ఇంకొక్క రోజు వ్యవధిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అంతకంతకు అంచనాలు పెరిగాయి తప్ప తగ్గలేదు. దీంతో సినిమాకు బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగింది. బాహుబలిని మించి వివిధ ఏరియాల్లో రేట్లు పలకడం విశేషం. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు రూ. 350 కోట్లకు పైగా బిజినెస్ జరగడం గమనార్హం.
ప్రతి ఏరియాలోనూ టార్గెట్లు పెద్దగానే ఉన్నాయి. ప్రి రిలీజ్ హైప్ భారీగానే ఉన్నప్పటికీ… సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలకడగా ఒక వారం పాటు భారీ వసూళ్లు సాధిస్తే తప్ప ఆ టార్గెట్లను అందుకోవడం తేలిక కాదు. ఇంతకీ ఏ ఏరియాలో సలార్ టార్గెట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం.
ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.65 కోట్ల బిజినెస్ చేసింది సలార్. అంటే తెలంగాణ వరకే గ్రాస్ వసూళ్లు 100 కోట్లు దాటాలన్నమాట. ఇక ఆంధ్ర ఏరియాలో కూడా నైజాంకు దీటుగా బిజినెస్ జరిగింది. అక్కడ హక్కులు రూ.62 కోట్లు పలికాయి. సీడెడ్ హక్కులు రూ.24 కోట్లు తెచ్చిపెట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో సలార్ 150 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక్కడ మాత్రమే సినిమా 250 కోట్ల మేర గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
ఇక సౌత్ ఇండియా లో మిగతా రాష్ట్రాల్లో రూ.50 కోట్ల బిజినెస్ జరిగింది సలార్ కు. హిందీ వర్షన్ హక్కులు 75 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ మరో 75 కోట్లు పలికాయి. మొత్తంగా సలార్ థియేట్రికల్ బిజీనెస్ 350 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ టార్గెట్ ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. సినిమాకు ఉన్న హైప్ దృష్ట్యా టాక్ బాగుంటే ఈ టార్గెట్ మరీ కష్టమేమీ కాదు.
This post was last modified on December 21, 2023 7:26 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…