రోజుల నుంచి గంటల కౌంట్ డౌన్ లోకి మారిపోయిన సలార్ విడుదల దగ్గరపడే కొద్దీ స్క్రీన్ బయట కూడా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే రెండు కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన మల్టీప్లెక్సుల్లో టికెట్ల అమ్మకాలు ఇంకా షురూ కాలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో సరిపడా షోలు, థియేటర్లు ఇవ్వని కారణంగా ఈ రెండు కంపెనీలకు చెందిన సముదాయాల్లో సలార్ ఇవ్వకూడదని నిర్మాతలు నిర్ణయించినట్టుగా వచ్చిన వార్తలు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
సమస్యల్లా డంకీతో వచ్చింది. ఆశించిన స్థాయిలో భారీ బజ్ లేకపోయినా ఎక్కువ షోలు దానికే కేటాయించడం వాళ్ళ సలార్ నష్టపోతోందని హోంబాలే టీమ్ వాదన. ఇది అధికారికంగా ధృవీకరించిన సమాచారం కాకపోయినా ఏపీ, తెలంగాణ బుక్ మై షో, పేటిఎంలో ఎక్కడా సదరు మల్టీప్లెక్స్ బుకింగ్స్ లేకపోవడంతో నిజమనేందుకు ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ముంబై లాంటి ప్రధాన నగరాల్లో చాలా సింగల్ స్క్రీన్లలో డిమాండ్ తో సంబంధం లేకుండా డిసెంబర్ 22 కూడా డంకీనే వేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదనే కామెంట్లో నిజముంది.
ఇదంతా వీలైనంత త్వరగా కొలిక్కి రావాలి. ఎందుకంటే టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇంకా కొనని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇండియాలో పెద్ద మల్టీప్లెక్స్ బ్రాండ్ లేకుండానే గంటకు ముప్పై వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అలాంటిది ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ కార్పొరేట్ సంస్థ వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించుకోవాలి. ఆలస్యమయ్యే కొద్దీ ఇబ్బందులు పెరుగుతాయి. ఇదే కనక నిజమైతే డంకీకి తెలుగు రాష్ట్రాల్లో అనధికార బాయ్ కాట్ తప్పకపోవచ్చు. ఇప్పటికైతే నార్త్ కు సంబంధించిన ముఖ్య నగరాల్లో బుకింగ్స్ మొదలయ్యాయి కానీ అసలు టెన్షన్ సౌత్ లోనే ఉంది.
This post was last modified on December 20, 2023 10:18 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…