Movie News

మల్టీప్లెక్సుల అడ్డుకట్టను సలార్ తెంచుకుంటాడా

రోజుల నుంచి గంటల కౌంట్ డౌన్ లోకి మారిపోయిన సలార్ విడుదల దగ్గరపడే కొద్దీ స్క్రీన్ బయట కూడా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే రెండు కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన మల్టీప్లెక్సుల్లో టికెట్ల అమ్మకాలు ఇంకా షురూ కాలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో సరిపడా షోలు, థియేటర్లు ఇవ్వని కారణంగా ఈ రెండు కంపెనీలకు చెందిన సముదాయాల్లో సలార్ ఇవ్వకూడదని నిర్మాతలు నిర్ణయించినట్టుగా వచ్చిన వార్తలు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

సమస్యల్లా డంకీతో వచ్చింది. ఆశించిన స్థాయిలో భారీ బజ్ లేకపోయినా ఎక్కువ షోలు దానికే కేటాయించడం వాళ్ళ సలార్ నష్టపోతోందని హోంబాలే టీమ్ వాదన. ఇది అధికారికంగా ధృవీకరించిన సమాచారం కాకపోయినా ఏపీ, తెలంగాణ బుక్ మై షో, పేటిఎంలో ఎక్కడా సదరు మల్టీప్లెక్స్ బుకింగ్స్ లేకపోవడంతో నిజమనేందుకు ఆధారాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ముంబై లాంటి ప్రధాన నగరాల్లో చాలా సింగల్ స్క్రీన్లలో డిమాండ్ తో సంబంధం లేకుండా డిసెంబర్ 22 కూడా డంకీనే వేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదనే కామెంట్లో నిజముంది.

ఇదంతా వీలైనంత త్వరగా కొలిక్కి రావాలి. ఎందుకంటే టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇంకా కొనని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇండియాలో పెద్ద మల్టీప్లెక్స్ బ్రాండ్ లేకుండానే గంటకు ముప్పై వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అలాంటిది ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ కార్పొరేట్ సంస్థ వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించుకోవాలి. ఆలస్యమయ్యే కొద్దీ ఇబ్బందులు పెరుగుతాయి. ఇదే కనక నిజమైతే డంకీకి తెలుగు రాష్ట్రాల్లో అనధికార బాయ్ కాట్ తప్పకపోవచ్చు. ఇప్పటికైతే నార్త్ కు సంబంధించిన ముఖ్య నగరాల్లో బుకింగ్స్ మొదలయ్యాయి కానీ అసలు టెన్షన్ సౌత్ లోనే ఉంది.

This post was last modified on December 20, 2023 10:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

16 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

1 hour ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago