ఏదైనా ఓపెన్ గా మాట్లాడ్డం అంత సులభం కాదు. అందులోనూ స్టార్ హీరోలతో వందల కోట్ల సినిమాలు చేస్తున్న దర్శకులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రశాంత్ నీల్ నేను ఆ బాపతు కాదంటున్నారు. ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న సలార్ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. కెజిఎఫ్ లో ఏవైతే పొరపాట్లు చేశానో సలార్ లోనూ అవే తప్పులు చేయాల్సి వచ్చిందని, పరిస్థితుల ప్రభావం, పని ఒత్తిడి తప్ప వేరే కారణం లేదని స్పష్టం చేశారు. అయితే ఆ మిస్టేక్స్ ఏంటనేది మాత్రం బయటికి చెప్పడం లేదు.
ఇక సినిమాల ద్వారా ఇచ్చే సందేశాల గురించి కూడా నీల్ ఘాటుగా సమాధానం చెప్పాడు. నేను ఇక్కడ ఉన్నది మెసేజ్ లు ఇవ్వడం కోసమో, సమాజంలో పరివర్తన తేవడం కోసమో కాదని, అది తలితండ్రులు చేయలేనప్పుడు నేనెవర్ని మిమ్మల్ని మార్చడానికి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఇంత స్ట్రెయిట్ గా చెప్పాక ఇక బదులు చెప్పడానికి ఏముంటుంది. సలార్ పూర్తిగా విభిన్న ప్రపంచమని, కెజిఎఫ్ తో ఏ రూపంలో ఏ రకంగా అయినా రవ్వంత కూడా కనెక్షన్ ఉండదని కుండ బద్దలు కొట్టాడు. సినిమాటిక్ యునివర్స్ ని హ్యాండిల్ చేసే సత్తా తనలో లేదని స్పష్టంగా చెప్పేశాడు.
రెండో ట్రైలర్ వచ్చాక సలార్ అంచనాల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. మొదటి వెర్షన్ లో ప్రభాస్ ఎక్కువ కనిపించలేదన్న కొరతని పూర్తిగా తీర్చేశారు. ముఖ్యంగా యాక్షన్ విజువల్స్ దెబ్బకు మొదటి రోజు చూడకుండా కంట్రోల్ చేసుకోవడం ఫ్యాన్స్ కి కష్టంగా అనిపిస్తోంది. ఏపీ తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ నిమిషం అయినా మొదలుపెట్టేలా ఉన్నారు. కర్ణాటక, కేరళలో ఇప్పటికే అమ్మకాలు ఉదృతంగా ఉన్నాయి. నార్త్ లో స్క్రీన్ల పంపకాల్లో డంకీ, అక్వమెన్ ల నుంచి ఇబ్బంది తలెత్తున్నప్పటికీ ఫైనల్ గా సలార్ లోని మాస్ కంటెంట్ సులభంగా వంద కోట్ల గ్రాస్ దాటించేలా ఉంది.
This post was last modified on December 19, 2023 11:17 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…