ఇంతకుముందులా లైన్ విని హీరోలు సినిమా ఓకే చేసేయడం.. బౌండెడ్ స్క్రిప్టు లేకుండా సినిమాను పట్టాలెక్కించేసేయడం టాలీవుడ్లో ఇప్పుడు జరగట్లేదు. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి స్టార్లు అయితే ఈ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు.
పూర్తి స్థాయి స్క్రిప్టు లేకుండా తెరకెక్కిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో మహేష్ చాలా స్ట్రిక్టుగా తయారయ్యాడు. స్క్రిప్టు ఓకే చేయకుండా సినిమా ఖరారు చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పేస్తున్నాడు. ఈ విషయంలో మొహమాటాలకు కూడా పోవట్లేదు.
అవతలున్నది అత్యంత సన్నిహితుడైనా చూడట్లేదు. వంశీ పైడిపల్లికి ఇలాగే షాక్ ఇచ్చాడు. మహర్షి తర్వాత అతడితో మంచి స్నేహం కుదిరినా సరే.. తర్వాతి సినిమాకు స్క్రిప్టు సంతృప్తికరంగా లేకపోవడంతో ఆ సినిమాను పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే.
మిగతా దర్శకుల విషయంలోనూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్న మహేష్ బాబు.. రాజమౌళి విషయంలో మాత్రం రూల్స్ బ్రేక్ చేయబోతున్నాడు. రాజమౌళితో సినిమా చేయాలని మహేష్ ఎప్పట్నుంచో కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అతడి కల ఫలించింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత తాను మహేష్ బాబుతోనే సినిమా చేస్తానని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ను మహేష్ కాదనే అవకాశమే లేదు. ఈ సినిమాను సూపర్ స్టార్ ఓకే చేయడం లాంఛనమే. అయితే ఈ చిత్రానికి ఇప్పటిదాకా జక్కన్న కథంటూ ఏమీ అనుకోలేదు.
ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచన కూడా లేదు. మహేష్తో ఏమీ డిస్కస్ చేయలేదు. కానీ సినిఆ మాత్రం అనౌన్స్ చేశాడు. మహేష్ కూడా ఈ సినిమా చేయబోతున్నాడు. అంటే పూర్తి స్క్రిప్టు కాదు కదా.. కనీసం లైన్ కూడా తెలియకుండానే మహేష్ ఈ సినిమా ఓకే చేసి రూల్స్ బ్రేక్ చేశాడన్నమాట.
This post was last modified on April 26, 2020 12:32 am
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…