ఇటీవలే కొత్త పెళ్ళికొడుకుగా లావణ్య త్రిపాఠితో కలిసి నూతనోధ్యాయం మొదలుపెట్టిన వరుణ్ తేజ్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తెరపైకి వస్తున్నాడు. వాస్తవానికి ఈ డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఆపరేషన్ వాలెంటైన్ పలు కారణాల వల్ల తేదీ మార్చుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 థియేటర్లలో అడుగు పెట్టనుంది. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ వార్ డ్రామా ద్వారా వరుణ్ మరోసారి ఎక్స్ పరిమెంట్ చేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న స్కై థ్రిల్లర్ ని సోనీ ఎంటర్ టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇందాకా టీజర్ ని రిలీజ్ చేశారు.
శత్రుదేశం ఎంత కవ్వించినా ఓపికగా ఎదురు చూసే సంయమనం మన సైన్యానిది. ఎయిర్ ఫోర్స్ లో పని చేసే అర్జున్ దేవ్(వరుణ్ తేజ్) ది దూకుడు మనస్తత్వం. ప్రమాదాలను కవ్వించి మరీ ఎదురెళ్తాడు. ఈ క్రమంలో ఒక క్లిష్టమైన మిషన్ అప్పజెబుతుంది ప్రభుత్వం. రుద్ర అనే ఏజెంట్ పేరుతో జెట్ ఫ్లైట్ వేసుకుని వెళ్లిన అర్జున్ కి ఆకాశంలోనే ఎన్నో సవాళ్లు ప్రమాదాలు స్వాగతం చెబుతాయి. తనను ప్రేమించిన అమ్మాయి(మానుషీ చిల్లర్)కూడా తన విభాగమే కావడంతో ప్రోత్సహిస్తుంది. అసలు ఇంత పెద్ద ఆపరేషన్ కి వాలెంటైన్ పేరు ఎందుకు పెట్టారో అదే అసలు కథ.
నిమిషంన్నర వీడియోతో కంటెంట్ లోని గ్రాండియర్ ని స్పష్టంగా ఆవిష్కరించారు. వరుణ్ మార్కెట్ లెక్కలు కాకుండా సబ్జెక్టుని నమ్ముకుని ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు ఇది రీచ్ అవుతుందనే నమ్మకంతో తీసినట్టు కనిపిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తో పాటు స్క్రీన్ ప్లేలో అమీర్ ఖాన్, సిద్దార్థ్ రాజ్ కుమార్ పాలు పంచుకున్నారు. టెక్నికల్ గా స్టాండర్డ్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అంచనాలు రేకెత్తించేలా చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. ఫిబ్రవరి 16న ఆపరేషన్ వాలెంటైన్ ప్రేక్షకుల ముందుకు రానుంది
This post was last modified on December 18, 2023 7:57 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…