త్వరలోనే ఈ ఏడాది బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ చూడబోతున్నాం. ఈ క్రిస్మస్ సీజన్లో బాలీవుడ్ భారీ చిత్రం డంకిని.. సౌత్ మెగా మూవీ సలార్ ఢీకొట్టబోతోంది. ఈ రెండు చిత్రాలు వేటికవే ప్రత్యేక ఆసక్తి కలిగిస్తున్నాయి. రెంటి మీదా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు చిత్రాల్లో ఏది పై చేయి సాధిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మాస్, యాక్షన్ మూవీ కావడం వల్ల సలార్ కి ఓపెనింగ్స్ ఎక్కువగా వస్తాయనడంలో సందేహం లేదు. ఇది కచ్చితంగా సలార్ కు అడ్వాంటేజే.
కానీ సలార్ మీద పెట్టుబడులు భారీగా పెట్టేసిన బయ్యర్లలో ఆందోళన లేకపోలేదు. ఒకవేళ సలార్ టాక్ కొంచెం అటు ఇటు అయి.. డంకికి మెరుగైన టాక్ వస్తే అది బాక్సాఫీస్ దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సలార్ కు గట్టి దెబ్బ పడుతుంది.
అదే సమయంలో క్లాస్ సినిమా కావడం, సలార్ లాంటి భారీ యాక్షన్ మూవీతో పోటీ పడడం డంకీకి మైనస్. ఇందువల్ల పఠాన్, జవాన్ చిత్రాలకు వచ్చిన ఓపెనింగ్స్ తో పోలిస్తే తక్కువ ఆరంభ వసూళ్లతో డంకి సరి పెట్టుకోవాల్సిందే. పండుగ సీజన్లో ఇలా పెద్ద సినిమాలు పోటీ పడినప్పుడు టాక్ బాగున్న సినిమాకు అనుకున్న దానికంటే భారీ వసూళ్లు వస్తాయి. అదే సమయంలో టాక్ తేడా కొట్టిన సినిమా అన్యాయం అయిపోతుంది.
అందులోనూ పెద్ద సినిమా అయితే.. భారీ పెట్టుబడులు పెట్టిన చిత్రమైతే దెబ్బ మామూలుగా ఉండదు. ఇదే సలార్ బయ్యర్లను కంగారు పెడుతోంది. మొత్తంగా చూస్తే క్రిస్మస్ కు రాబోతున్న రెండు చిత్రాలకు రిస్క్ ఉన్నట్లే. కాకపోతే టాక్ బాగున్న సినిమా ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుని జాక్ పాట్ కొడుతుంది. బాలేని సినిమా డేంజర్ జోన్లో పడుతుంది. మరి సలార్, డంకీల్లో ఆ ముప్పుని ఎదుర్కొనే చిత్రమేదో చూడాలి.
This post was last modified on December 18, 2023 10:16 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…