కెజిఎఫ్, సలార్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ కథతో హోంబాలే ఫిలింస్ మరో భారీ చిత్రాన్ని నిర్మించింది. పేరు బఘీరా. ఇందులో శ్రీమురళి హీరో. ప్రత్యేకంగా ఇతనితోనే కాంబినేషన్ సెట్ చేయడానికి కారణం ఉంది. నీల్ మొదటి సినిమా ఉగ్రం హీరో ఇతనే. ఇద్దరికీ పెద్ద బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ కలయిక తర్వాత మరో చిత్రం చేయాలని ప్లాన్ చేసుకున్నారు కానీ కుదరలేదు. ఒకదశలో శ్రీమురళిని కెజిఎఫ్ కోసం లుక్ టెస్ట్ చేశారు కానీ కుదరకపోవడంతో అది కాస్తా యష్ ని వరించి అతన్ని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ఆ లోటలా ఉండిపోయింది.
అందుకే శ్రీమురళి కోసం మరో పవర్ ఫుల్ సబ్జెక్టుని సిద్ధం చేసిన ప్రశాంత్ నీల్ దాన్ని భారీ బడ్జెట్ తో హోంబాలేలోనే నిర్మాణం జరిగేలా చూసుకున్నాడు. దర్శకత్వ బాధ్యతలు సూరికి ఇచ్చారు. షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇవాళ టీజర్ లాంచ్ చేశారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే టైటిల్ కనిపించింది కానీ దీన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. నగరమే అడవిగా మారి మనుషులు జంతువులుగా మారినప్పుడు వాటిని వేటాడ్డం కోసం ఒకడొస్తాడు. అతనే బఘీరా. మొహం కనిపించకుండా విరుచుకుపడే ఇతని కత్తికి దుర్మార్గుల తలలు తెగుతాయి.
విజువల్స్ గట్రా చూస్తుంటే ఇది కూడా యాక్షన్ డ్రామాని అర్థమైపోయింది. సంగీతం రవి బస్రూర్ కి ఇవ్వలేదు. విరూపాక్ష, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ కు ఆ బాధ్యతను అప్పగించారు. సప్తసాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ బఘీరాలో హీరోయిన్ కావడం మరో ఆకర్షణ. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, రంగనాయన రఘు ఇతర తారాగణం. కెజిఎఫ్, సలార్ లతో తమ మార్కెట్ రేంజ్ ని అమాంతం పెంచుకున్న హోంబాలేకి ఈ బఘీరా ప్రమోషన్ల పరంగా పెద్ద టెన్షన్ లేదు. శ్రీమురళికి ఇతర భాషల్లో ఇమేజ్ లేకపోయినా ప్రొడక్షన్ బ్యానర్ బ్రాండ్ ఇమేజే పెద్ద అండగా నిలవబోతోంది.
This post was last modified on December 17, 2023 12:14 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…