వైష్ణవ్ తేజ్ సినిమా ‘ఉప్పెన’ ఓటిటిలో రిలీజ్ కావడం లేదు. ఇంత కంటే పెద్ద సినిమాలే ఓటీటీల బాట పట్టగా దీనిని ఎందుకని విడుదల చేయడం లేదు? నిజానికి ఓటిటి రిలీజ్కి నిర్మాతలు సిద్ధంగానే వున్నారు. ఒకటి, రెండు ఓటిటి సంస్థలతో చర్చలు కూడా జరిపారు. అయితే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కావడంతో ఓటిటిలు అంత మొత్తం ఆఫర్ చేయడం లేదు. ఆల్రెడీ మార్కెట్ వున్న హీరోల సినిమాలనయితే పెద్ద మొత్తం ఇచ్చి కొనేస్తున్నారు. ఫలానా హీరో సినిమా హిట్టయితే ఎంత ఆదాయం వస్తుందనేది లెక్కలు చూసుకుని అంత ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. కానీ వైష్ణవ్కి ఇది మొదటి సినిమా కావడంతో అతని మార్కెట్ ఏమిటనేది ఎవరికీ తెలియదు. వాళ్లు ఈ సినిమాకు ఆఫర్ చేసిన అమౌంట్ వల్ల లాస్ బాగా వస్తుంది కనుక థియేటర్లు తెరిచే వరకు వేచి చూడాలనే డిసైడ్ అయ్యారు.
ఒక విధంగా వైష్ణవ్ తేజ్ అదృష్టమిది అనుకోవాలి. ఏ హీరోకి అయినా మొదటి సినిమా థియేటర్లలో విడుదలైతేనే తన పట్ల ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా వున్నారనేది తెలుస్తుంది. ఓపెనింగ్స్ వస్తే మెగా ఫాన్స్ యాక్సెప్టెన్స్ వుందా లేదా అనేది అర్థమవుతుంది. అలా తన సినిమాకి అన్నీ తెలుసుకునే అవకాశం వైష్ణవ్కి దక్కింది. ఒకవేళ బడ్జెట్ తక్కువ అయినట్టయితే మొదటి సినిమానే టీవీలో చూడాల్సి వచ్చేది.
This post was last modified on September 2, 2020 1:32 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…