లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో సినిమా హీరోలు గతంలో మాదిరిగా ఎక్కువగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా తమను చూడాలని తహతహలాడే ఫాన్స్ తృష్ణ తీరుస్తున్నారు చాలా మంది హీరోలు. మహేష్, చరణ్ ఫోటోలు పెట్టడం తక్కువే అయినా కానీ వారి సతీమణులు ఆ బాధ్యత తీసుకున్నారు. ఆగస్ట్ 15కి రామ్ చరణ్ చిన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. పవన్కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ కూడా తరచుగా కనబడుతూనే వున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం లాక్డౌన్ తర్వాత ఫాన్స్కి పూర్తిగా మొహం చాటేసాడు. కనీసం అతని పుట్టినరోజుకి కూడా ఎలాంటి స్పెషల్ వీడియోలు, పోస్టర్లు విడుదల చేయలేదు.
నిత్యం ఎన్టీఆర్ గురించిన వార్తలయితే వస్తున్నాయి, అడపాదడపా అతని ట్విట్టర్లో ట్వీట్లు కూడా పడుతున్నాయి కానీ తారక్ ఫోటోలు మాత్రం బయటకు రావడం లేదు. ఎన్టీఆర్ భార్య సోషల్ మీడియాకు దూరంగా వుండడంతో ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు ఎక్కడా దర్శనమివ్వడం లేదు. ఏప్రిల్ 21న ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ వీడియో పెట్టిన తర్వాత మళ్లీ ఎన్టీఆర్ కనబడలేదు. ఇంతకాలం తమ హీరో కనిపించకపోవడం కంటే పెద్ద కష్టం అభిమానులకు వుండదు. ఆర్.ఆర్.ఆర్. మొదలు కావడానికి ఇంకా సమయం వుంది కనుక ఫాన్స్ కోసమయినా తారక్ ఒక ఫోటో షేర్ చేస్తే బాగుంటుందేమో.
This post was last modified on September 2, 2020 1:28 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…