కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెజిఎఫ్ పుణ్యమాని ఇప్పుడు కన్నడ మార్కెట్ పెరిగింది కానీ ఒకప్పుడు మహా అయితే యాభై కోట్ల గ్రాస్ దాటడమే గొప్పనుకునే బ్లాక్ బస్టర్లు వాళ్ళవి. అందుకే శాండిల్ వుడ్ డబ్బింగులు మన దగ్గర చాలా తక్కువ. కాంతారతో వాళ్ళ నమ్మకం బలపడింది. అలా అని మన మార్కెట్ ఏమీ తగ్గలేదు. డిమాండ్ మారలేదు. ఇది అక్కడి హీరోలు, నిర్మాతలకు ఎప్పటి నుంచో కంటగింపుగా ఉంది. తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ సలార్ గురించి ఒక ప్రెస్ మీట్ లో అన్న మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇతను నటించిన భారీ బడ్జెట్ చిత్రం కాటేరా ఈ నెల 29 విడుదల కాబోతోంది. అయితే కేవలం వారం ముందే సలార్, డంకీలు ఉండటంతో థియేటర్ల సమస్య రావొచ్చని మీడియా ప్రతినిధులు దర్శన్ దృష్టికి తీసుకొచ్చారు. అంతే ఒక్కసారిగా బాబు ఫైరయిపోయాడు. ఎవరో వస్తే నేనేందుకు భయపడాలి, కాటేరా మనోళ్ల కోసం ఇక్కడి థియేటర్ల కోసం తీసిన సినిమాని, తగ్గేదే ఉండదంటూ కాస్త గట్టిగానే అన్నాడు. ఇదే టాపిక్ కొన్ని వారాల క్రితం ఘోస్ట్ రిలీజ్ సందర్భంగా శివ రాజ్ కుమార్ ముందు వచ్చినప్పుడు ఆయన చాలా సౌమ్యంగా పరిష్కారం ఉభయ కుశలోపరిగా ఉండాలని సూచించాడు.
సినిమా అయినా మరొకటి అయినా ఇది వ్యాపారం. కస్టమర్లు ఏది కోరుకుంటే దాన్ని ఇవ్వాలి. అంతే. బలవంతంగా రుద్దితే పని జరగదు. బెంగళూరులో ఉన్న డెబ్భై శాతం మల్టీప్లెక్సులు కేవలం తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ చిత్రాలతోనే గట్టెక్కుతున్నాయి. పోనీ కన్నడవి వేసుకున్నా ఆడియన్స్ వస్తారన్న గ్యారెంటీ లేదు. కర్ణాటలోని చాలా పట్టణాలు, నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాటేరాలో దర్శన్ ఊర మాస్ పాత్ర చేశాడు. గతంలో ఇతని రాబర్ట్, క్రాంతి తెలుగులోనూ డబ్ అయ్యాయి కానీ ఆ రొటీన్ కంటెంట్ ని మనోళ్లు తిరస్కరించారు. కాటేరా ఇతర భాషల్లో రావడానికే జంకుతోంది.
This post was last modified on December 15, 2023 11:15 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…