‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో లోకేష్ కనకరాజ్ దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. అతని తర్వాతి సినిమా ‘లియో’ సినిమా మీద అంచనాలు ఏ స్థాయికి చేరాయో తెలిసిందే. ఐతే ‘లియో’ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. లోకేష్ కెరీర్లో వీకెస్ట్ మూవీ ఇదే అనడంలో సందేహం లేదు. అసలేముందని ఈ కథతో సినిమా తీశాడు అనే ప్రశ్నలు తలెత్తాయి. అతను అప్పుడే టచ్ కోల్పోయాడా.. తనలో కంటెంట్ అయిపోయిందా అనే చర్చ జరిగింది. ఐతే తన ప్రతి సినిమాకూ వచ్చే ఫీడ్ బ్యాక్ తీసుకుని పని చేస్తానని చెప్పే లోకేష్.. తన తర్వాతి చిత్రం విషయంలో జాగ్రత్త పడుతున్న విషయం వెల్లడైంది. లియో విషయంలో జరిగిన తప్పేంటో లోకేష్ స్వయంగా ఒప్పుకున్నాడు.
‘లియో’ విషయంలో జరిగిన అతి పెద్ద తప్పు.. స్క్రిప్టు, షూటింగ్ విషయంలో హడావుడి పడటం. ‘విక్రమ్’ రిలీజైన కొన్ని రోజులకే ఈ సినిమాను మొదలుపెట్టేశాడు. స్క్రిప్టు సరిగా తీర్చిదిద్దుకోలేదు. షూటింగ్ కూడా హడావుడిగా చేసేశారు. ముందే రిలీజ్ డేట్ డెడ్ లైన్ పెట్టుకుని ఆ ప్రెజర్ మీద పని చేశాడు లోకేష్. ఆ ఎఫెక్ట్ ఔట్ పుట్ మీద పడింది. ఈ విషయమై లోకేష్ ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడాడు. లియో సెకండాఫ్ విషయంలో వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ మొత్తం తాను తీసుకున్నానని.. రజినీకాంత్ తో తాను చేయబోయే జాగ్రత్త పడతానని లోకేష్ తెలిపాడు.
లియో సినిమాకు సంతకం చేసినప్పుడే 10 నెలల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసేలా ఒప్పందం జరిగిందని.. ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. ఆ ఒత్తిడితోనే పనిచేశానని.. దానివల్ల అవుట్ ఫుట్ దెబ్బతిందని లోకేష్ ఒప్పుకున్నాడు. రజినీకాంత్ సినిమా విషయంలో ముందే రిలీజ్ డేట్ ప్రకటించట్లేదని.. తనకు కావాల్సినంత టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేస్తానని.. సినిమా తీసే విషయంలో కూడా రాజీపడనని లోకేష్ తెలిపాడు. లోకేష్ మాటలను బట్టి చూస్తే అతడి నుంచి కొత్త సినిమా రావడానికి దాదాపు రెండేళ్లు పట్టొచ్చని తెలుస్తోంది. కాబట్టి ఈసారి అతడి నుంచి మంచి క్వాలిటీ మూవీ ఆశించవచ్చు.
This post was last modified on December 14, 2023 9:36 pm
కొన్ని సినీ సిత్రాలు విచిత్రంగా ఉంటాయి. అవి సదరు హీరోలు దర్శకులు చెప్పినప్పుడే బయటికి వస్తాయి. అలాంటిదే ఇది. ఎల్లుండి…
పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్ కు చెందిన 26 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడిన సంగతి…
సమంత నిర్మాతగా మారి తీసిన శుభం ఎల్లుండి విడుదల కాబోతోంది. దీని మీద బోలెడంత నమ్మకంతో ఉన్న సామ్ నిన్నటి…
జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…
ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…
భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…