విడుదలకు ఇంకో వారమే ఉన్నా డంకీ సౌండ్ పెద్దగా వినిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. సలార్ లాంటి డైనోసర్ ని ఎదురుగా పెట్టుకుని ఇంత నిశ్చింతగా ఉండటం విచిత్రమే. జవాన్ టైంలో పది రోజుల ముందు నుంచే రెండు రోజులకోసారి ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో క్రమం తప్పకుండా టచ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు మాత్రం అంత దూకుడు చూపించడం లేదు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు బాద్షా చాలా ఎగ్జైట్ కావడం జనాలకు గుర్తే. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించాలన్న కోరిక తీరిందని సంబరంగా చెప్పుకున్నాడు. పైగా స్వంత బ్యానర్ నిర్మాణం కూడా.
ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. లోలోపల ప్లానింగ్ చాప కింద నీరులా జరిగిపోతోందని ముంబై టాక్. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మొత్తం థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో 40 శాతం డంకీకి వచ్చేలా రెడ్ చిల్లీస్ తో పాటు మరికొన్ని కార్పొరేట్ సంస్థలు చేతులు కలపడంతో వ్యవహారం దానికి సానుకూలంగా మారుతోంది. ఓటిటి హక్కులు కొన్న జియో సినిమా కూడా తన వంతుగా చేయూత ఇస్తోందట. దీని వల్ల సలార్ కు ఎంత డిమాండ్ ఉన్నా సరే అన్ని భాషలకు కలిపి 38 శాతం స్క్రీన్లు ఇస్తారని టాక్. 12 శాతం ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డమ్, 10 శాతం మూడో వారం చేరుకున్న యానిమల్ కి కేటాయిస్తారు.
ఇదే జరిగితే సలార్ నేషనల్ వైడ్ ఓపెనింగ్స్ కి గండి పడినట్టే. పైగా డంకీ ఒకరోజు ముందే వస్తుంది కాబట్టి ప్రభాస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లలో డిసెంబర్ 21 మొత్తం డంకీనే వేస్తారు. మరుసటి రోజు నుంచి రెండు సినిమాల మధ్య పంపకాలు ఉంటాయి. ట్రైలర్ తో సహా డంకీ ప్రమోషనల్ కంటెంట్ కి ఆశించిన స్థాయిలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. అలా అని హిరానీకి తక్కువంచనా వేయడానికి లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈయన బ్రాండ్ కు తిరుగు లేదు. టాక్ చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ రేంజ్ లో ఫలితం కోసం ప్రభాస్, షారుఖ్ లు ఎదురు చూస్తున్నారు
This post was last modified on December 14, 2023 4:30 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…