Movie News

చాప కింద నీరులా డంకీ ప్లానింగ్

విడుదలకు ఇంకో వారమే ఉన్నా డంకీ సౌండ్ పెద్దగా వినిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. సలార్ లాంటి డైనోసర్ ని ఎదురుగా పెట్టుకుని ఇంత నిశ్చింతగా ఉండటం విచిత్రమే. జవాన్ టైంలో పది రోజుల ముందు నుంచే రెండు రోజులకోసారి ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో క్రమం తప్పకుండా టచ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు మాత్రం అంత దూకుడు చూపించడం లేదు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు బాద్షా చాలా ఎగ్జైట్ కావడం జనాలకు గుర్తే. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించాలన్న కోరిక తీరిందని సంబరంగా చెప్పుకున్నాడు. పైగా స్వంత బ్యానర్ నిర్మాణం కూడా.

ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. లోలోపల ప్లానింగ్ చాప కింద నీరులా జరిగిపోతోందని ముంబై టాక్. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మొత్తం థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో 40 శాతం డంకీకి వచ్చేలా రెడ్ చిల్లీస్ తో పాటు మరికొన్ని కార్పొరేట్ సంస్థలు చేతులు కలపడంతో వ్యవహారం దానికి సానుకూలంగా మారుతోంది. ఓటిటి హక్కులు కొన్న జియో సినిమా కూడా తన వంతుగా చేయూత ఇస్తోందట. దీని వల్ల సలార్ కు ఎంత డిమాండ్ ఉన్నా సరే అన్ని భాషలకు కలిపి 38 శాతం స్క్రీన్లు ఇస్తారని టాక్. 12 శాతం ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డమ్, 10 శాతం మూడో వారం చేరుకున్న యానిమల్ కి కేటాయిస్తారు.

ఇదే జరిగితే సలార్ నేషనల్ వైడ్ ఓపెనింగ్స్ కి గండి పడినట్టే. పైగా డంకీ ఒకరోజు ముందే వస్తుంది కాబట్టి ప్రభాస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లలో డిసెంబర్ 21 మొత్తం డంకీనే వేస్తారు. మరుసటి రోజు నుంచి రెండు సినిమాల మధ్య పంపకాలు ఉంటాయి. ట్రైలర్ తో సహా డంకీ ప్రమోషనల్ కంటెంట్ కి ఆశించిన స్థాయిలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. అలా అని హిరానీకి తక్కువంచనా వేయడానికి లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈయన బ్రాండ్ కు తిరుగు లేదు. టాక్ చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ రేంజ్ లో ఫలితం కోసం ప్రభాస్, షారుఖ్ లు ఎదురు చూస్తున్నారు

This post was last modified on December 14, 2023 4:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

23 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

25 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago