Movie News

చాప కింద నీరులా డంకీ ప్లానింగ్

విడుదలకు ఇంకో వారమే ఉన్నా డంకీ సౌండ్ పెద్దగా వినిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. సలార్ లాంటి డైనోసర్ ని ఎదురుగా పెట్టుకుని ఇంత నిశ్చింతగా ఉండటం విచిత్రమే. జవాన్ టైంలో పది రోజుల ముందు నుంచే రెండు రోజులకోసారి ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో క్రమం తప్పకుండా టచ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు మాత్రం అంత దూకుడు చూపించడం లేదు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు బాద్షా చాలా ఎగ్జైట్ కావడం జనాలకు గుర్తే. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించాలన్న కోరిక తీరిందని సంబరంగా చెప్పుకున్నాడు. పైగా స్వంత బ్యానర్ నిర్మాణం కూడా.

ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. లోలోపల ప్లానింగ్ చాప కింద నీరులా జరిగిపోతోందని ముంబై టాక్. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మొత్తం థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో 40 శాతం డంకీకి వచ్చేలా రెడ్ చిల్లీస్ తో పాటు మరికొన్ని కార్పొరేట్ సంస్థలు చేతులు కలపడంతో వ్యవహారం దానికి సానుకూలంగా మారుతోంది. ఓటిటి హక్కులు కొన్న జియో సినిమా కూడా తన వంతుగా చేయూత ఇస్తోందట. దీని వల్ల సలార్ కు ఎంత డిమాండ్ ఉన్నా సరే అన్ని భాషలకు కలిపి 38 శాతం స్క్రీన్లు ఇస్తారని టాక్. 12 శాతం ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డమ్, 10 శాతం మూడో వారం చేరుకున్న యానిమల్ కి కేటాయిస్తారు.

ఇదే జరిగితే సలార్ నేషనల్ వైడ్ ఓపెనింగ్స్ కి గండి పడినట్టే. పైగా డంకీ ఒకరోజు ముందే వస్తుంది కాబట్టి ప్రభాస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లలో డిసెంబర్ 21 మొత్తం డంకీనే వేస్తారు. మరుసటి రోజు నుంచి రెండు సినిమాల మధ్య పంపకాలు ఉంటాయి. ట్రైలర్ తో సహా డంకీ ప్రమోషనల్ కంటెంట్ కి ఆశించిన స్థాయిలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. అలా అని హిరానీకి తక్కువంచనా వేయడానికి లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈయన బ్రాండ్ కు తిరుగు లేదు. టాక్ చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్ రేంజ్ లో ఫలితం కోసం ప్రభాస్, షారుఖ్ లు ఎదురు చూస్తున్నారు

This post was last modified on December 14, 2023 4:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

2 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

2 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

4 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

5 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago