సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అత్యంత క్రేజు మోజు ఉన్న గుంటూరు కారం నుంచి ఏ అప్డేట్ అయినా సరే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఇవాళ రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. ఓ మై బేబీ అంటూ శ్రీలీల హీరో మహేష్ బాబు వెంట పడుతూ అతని మీద ఎంత ప్రేమైందో, మనసు పడిందో వర్ణించే విధానాన్ని స్వీట్ మెలోడీగా కంపోజ్ చేశారు తమన్. రామజోగయ్య శాస్త్రి ఇంగ్లీష్, తెలుగు కలగలసిన క్యాచీ పదాలతో నింపేయగా సాఫ్ట్ ఇన్స్ ట్రుమెంట్స్ తో ఎక్కువ హోరు లేకుండా కూల్ గా సాగింది. అయితే ఫ్యాన్స్ కి ఈ డోస్ సరిపోయినట్టు లేదని ట్విట్టర్ చూస్తే అర్థమైపోతోంది.
క్రేజీ కాంబో కావడంతో అంచనాలు మాములుగా లేవు. మహేష్ తమన్ కలయికలో బెస్ట్ మెలోడీస్ సారొచ్ఛారా(బిజినెస్ మెన్), గురువారం మార్చి ఒకటి(దూకుడు), కళావతి కళావతి(సర్కారు వారి పాట) గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. వీటి సరసన కాదు వీటిని మించి గుంటూరు కారం పాటలను ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పైగా తమన్ ని మారుస్తారంటూ షూటింగ్ కు ముందు జరిగిన ప్రచారం అభిమానుల మధ్య పెద్ద చర్చకే దారి తీసింది. అయినా త్రివిక్రమ్ ఓటు తమన్ కే పడింది. అందుకే ఓ మై బేబీ మీద అందరి ఫోకస్ పడింది. తీరా మరీ సాఫ్ట్ గా అనిపించడంతో ఫీడ్ బ్యాక్ మిక్స్డ్ వినిపిస్తోంది.
విజువల్ గా చూసేదాకా నిర్ధారణకు రాలేం కానీ దం మసాలా బిర్యానీ లాంటి ఊర మాస్ కంపోజింగ్ విన్నాక ఇలాంటి బేబీలు అంత త్వరగా మెదడుకు చేరవు. కొంత టైం పడుతుంది. ఇంకో రెండు పాటలు ఉన్నాయి కాబట్టి పూర్తి ఆల్బమ్ విన్నాకే ఒక కంక్లూజన్ కు రాగలం. అయినా మహేష్ మూవీలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటే చాలు పాటలు గొప్పగా ఉన్నా, యావరేజ్ అనిపించినా రికార్డులు గల్లంతైపోతాయి. జనవరి 12 విడుదల కాబోతున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరులోనే చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
This post was last modified on December 14, 2023 10:42 am
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…
పదహారు సంవత్సరాల క్రితం 2010లో విడుదలైన డార్లింగ్ అంటే ప్రభాస్ అభిమానులకు ఒక స్పెషల్ ఎమోషన్. మాస్ ఫార్ములాకు దూరంగా…