Movie News

బేబీ ఘాటు అభిమానులకు సరిపోలేదా

సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అత్యంత క్రేజు మోజు ఉన్న గుంటూరు కారం నుంచి ఏ అప్డేట్ అయినా సరే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఇవాళ రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. ఓ మై బేబీ అంటూ శ్రీలీల హీరో మహేష్ బాబు వెంట పడుతూ అతని మీద ఎంత ప్రేమైందో, మనసు పడిందో వర్ణించే విధానాన్ని స్వీట్ మెలోడీగా కంపోజ్ చేశారు తమన్. రామజోగయ్య శాస్త్రి ఇంగ్లీష్, తెలుగు కలగలసిన క్యాచీ పదాలతో నింపేయగా సాఫ్ట్ ఇన్స్ ట్రుమెంట్స్ తో ఎక్కువ హోరు లేకుండా కూల్ గా సాగింది. అయితే ఫ్యాన్స్ కి ఈ డోస్ సరిపోయినట్టు లేదని ట్విట్టర్ చూస్తే అర్థమైపోతోంది.

క్రేజీ కాంబో కావడంతో అంచనాలు మాములుగా లేవు. మహేష్ తమన్ కలయికలో బెస్ట్ మెలోడీస్ సారొచ్ఛారా(బిజినెస్ మెన్), గురువారం మార్చి ఒకటి(దూకుడు), కళావతి కళావతి(సర్కారు వారి పాట) గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. వీటి సరసన కాదు వీటిని మించి గుంటూరు కారం పాటలను ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పైగా తమన్ ని మారుస్తారంటూ షూటింగ్ కు ముందు జరిగిన ప్రచారం అభిమానుల మధ్య పెద్ద చర్చకే దారి తీసింది. అయినా త్రివిక్రమ్ ఓటు తమన్ కే పడింది. అందుకే ఓ మై బేబీ మీద అందరి ఫోకస్ పడింది. తీరా మరీ సాఫ్ట్ గా అనిపించడంతో ఫీడ్ బ్యాక్ మిక్స్డ్ వినిపిస్తోంది.

విజువల్ గా చూసేదాకా నిర్ధారణకు రాలేం కానీ దం మసాలా బిర్యానీ లాంటి ఊర మాస్ కంపోజింగ్ విన్నాక ఇలాంటి బేబీలు అంత త్వరగా మెదడుకు చేరవు. కొంత టైం పడుతుంది. ఇంకో రెండు పాటలు ఉన్నాయి కాబట్టి పూర్తి ఆల్బమ్ విన్నాకే ఒక కంక్లూజన్ కు రాగలం. అయినా మహేష్ మూవీలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటే చాలు పాటలు గొప్పగా ఉన్నా, యావరేజ్ అనిపించినా రికార్డులు గల్లంతైపోతాయి. జనవరి 12 విడుదల కాబోతున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరులోనే చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

This post was last modified on December 14, 2023 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

12 minutes ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

1 hour ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

1 hour ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

4 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

7 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

9 hours ago