సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అత్యంత క్రేజు మోజు ఉన్న గుంటూరు కారం నుంచి ఏ అప్డేట్ అయినా సరే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఇవాళ రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. ఓ మై బేబీ అంటూ శ్రీలీల హీరో మహేష్ బాబు వెంట పడుతూ అతని మీద ఎంత ప్రేమైందో, మనసు పడిందో వర్ణించే విధానాన్ని స్వీట్ మెలోడీగా కంపోజ్ చేశారు తమన్. రామజోగయ్య శాస్త్రి ఇంగ్లీష్, తెలుగు కలగలసిన క్యాచీ పదాలతో నింపేయగా సాఫ్ట్ ఇన్స్ ట్రుమెంట్స్ తో ఎక్కువ హోరు లేకుండా కూల్ గా సాగింది. అయితే ఫ్యాన్స్ కి ఈ డోస్ సరిపోయినట్టు లేదని ట్విట్టర్ చూస్తే అర్థమైపోతోంది.
క్రేజీ కాంబో కావడంతో అంచనాలు మాములుగా లేవు. మహేష్ తమన్ కలయికలో బెస్ట్ మెలోడీస్ సారొచ్ఛారా(బిజినెస్ మెన్), గురువారం మార్చి ఒకటి(దూకుడు), కళావతి కళావతి(సర్కారు వారి పాట) గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. వీటి సరసన కాదు వీటిని మించి గుంటూరు కారం పాటలను ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పైగా తమన్ ని మారుస్తారంటూ షూటింగ్ కు ముందు జరిగిన ప్రచారం అభిమానుల మధ్య పెద్ద చర్చకే దారి తీసింది. అయినా త్రివిక్రమ్ ఓటు తమన్ కే పడింది. అందుకే ఓ మై బేబీ మీద అందరి ఫోకస్ పడింది. తీరా మరీ సాఫ్ట్ గా అనిపించడంతో ఫీడ్ బ్యాక్ మిక్స్డ్ వినిపిస్తోంది.
విజువల్ గా చూసేదాకా నిర్ధారణకు రాలేం కానీ దం మసాలా బిర్యానీ లాంటి ఊర మాస్ కంపోజింగ్ విన్నాక ఇలాంటి బేబీలు అంత త్వరగా మెదడుకు చేరవు. కొంత టైం పడుతుంది. ఇంకో రెండు పాటలు ఉన్నాయి కాబట్టి పూర్తి ఆల్బమ్ విన్నాకే ఒక కంక్లూజన్ కు రాగలం. అయినా మహేష్ మూవీలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటే చాలు పాటలు గొప్పగా ఉన్నా, యావరేజ్ అనిపించినా రికార్డులు గల్లంతైపోతాయి. జనవరి 12 విడుదల కాబోతున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరులోనే చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
This post was last modified on December 14, 2023 10:42 am
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…