ఒక పెద్ద హీరో సినిమా అందులోనూ బడా బ్యానర్ లో క్యాన్సిల్ కావడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే రవితేజ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్టుని వదులుకున్నప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది. బడ్జెట్ కారణాల వల్లే దీన్ని హిందీలో సన్నీ డియోల్ తో తీయాలని నిర్ణయించుకున్నట్టుగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. దీని సంగతలా ఉంచితే హరీష్ శంకర్ డైరెక్షన్ లో కొత్త సినిమాని రవితేజ నిన్న ఫోటో షూట్ తో గుట్టుచప్పుడు కాకుండా మొదలుపెట్టేసినట్టు సమాచారం. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం స్టిల్స్ సిద్ధం చేస్తున్నారు.
ఇది బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేకనే ప్రచారాన్ని ఎవరూ ఖండించడం లేదు. అజయ్ దేవగన్ హీరోగా 2018లో వచ్చిన ఈ మనీ క్రైమ్ థ్రిల్లర్ లో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఐటి దాడుల కోసం ఒక పెద్ద మనిషి ఇంటికి రైడ్ కోసం వెళ్లిన హీరోని ప్రమాదాలు చుట్టుముడతాయి. వీటిని తప్పించుకుని తన డ్యూటీ ఎలా చేశాడనే పాయింట్ మీద మంచి థ్రిల్లర్ టైపులో తీశారు. దీన్నే కొన్ని కీలక మార్పులతో మన ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా తీస్తారని ఇన్ సైడ్ టాక్. హరీష్ శంకర్ మాత్రం ఇది స్ట్రెయిట్ మూవీ అని కానీ రీమేకని కానీ ఎక్కడ చెప్పడం లేదు.
ఈ కాంబోలో ఇది మూడో సినిమా అవుతుంది. హరీష్ శంకర్ డెబ్యూ మూవీ షాక్ హీరో రవితేజనే. ఇది ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా అతని టేకింగ్ మీద నమ్మకంతో మిరపకాయ్ ఇచ్చాడు. ఇది బ్లాక్ బస్టర్ సాధించింది. దీని తర్వాతే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఛాన్స్ రావడం, దశ తిరగడం జరిగిపోయాయి. ఆ తర్వాత హిట్లున్నాయి కానీ మరీ పెద్ద స్థాయిలో దక్కలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ ఏమో కాస్త షూటింగ్ చేసుకుని ఎన్నికల కోసం ఆగిపోయింది. తిరిగి మొదలుపెట్టే లోగా టైం పట్టేలా ఉంది కాబట్టి ఈలోగా మాస్ రాజాతో రైడింగ్ అయిపోతుంది. టైటిల్ ఇంకా ఏమి అనుకోలేదట.
This post was last modified on December 13, 2023 6:13 pm
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…