సౌత్ దర్శకుల్లో భారీ డిమాండ్ ఉన్న లిస్టులో లోకేష్ కనగరాజ్ పేరు టాప్ ఫైవ్ లో ఉన్న వాస్తవం కాదనలేనిది. విజయ్ లియో విషయంలో అభిమానులు పూర్తి సంతృప్తి చెందకపోయినా తనదైన మేకింగ్ తో మరో అయిదు వందల కోట్ల బొమ్మని కోలీవుడ్ కి కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం తను సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనికన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న మూవీ ఖైదీ 2. లోకేష్ కి తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కి కొనసాగింపు కావాలని మూవీ లవర్స్ ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు.
దీనికి అనుగుణంగా కొన్ని అడుగులు పడ్డాయి. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లోని ప్రధాన పాత్రల మధ్య ఉన్న సంబంధాలను కలుపుతూ లోకేష్ కనగరాజ్ ఒక షార్ట్ ఫిలిం తీశాడు. నిడివి కేవలం పది నిముషాలు మాత్రమే. తనతో పాటు నరేన్ కూడా దీంట్లో భాగం పంచుకున్నాడు. ఢిల్లీ నుంచి లియో దాకా అందరూ ఈ మాఫియా ప్రపంచంలో ఒకరితో ఒకరు ఎలా ముడిపడ్డారనే విషయాలను వివరిస్తూ కొన్ని షాకింగ్ అంశాలను రివీల్ చేయబోతున్నారట. దీన్ని థియేటర్లలో రిలీజ్ చేయరు. సరైన సమయం చూసి యూట్యూబ్ లో అందరూ చూసేలా ఉచితంగా తీసుకొస్తారట.
సో లోకేష్ కనగరాజ్ తన యునివర్స్ మీద సీరియస్ గా వర్క్ చేస్తున్న విషయం అర్థమైపోయింది. ఖైదీ 2 కి మాత్రం టైం పట్టేలా ఉంది. ఎందుకంటే రజని సినిమా మొదలుపెట్టే లోపు 2024 వేసవి వచ్చేస్తుంది. దాని షూటింగ్ పూర్తయిపోయి థియేటర్లలో అడుగు పెట్టడానికి ఇంకో ఏడాది. ఆ తర్వాత ఖైదీ 2. దీనికన్నా ముందు సూర్యతో రోలెక్స్ ప్లాన్ ఉంది కానీ ఏది ముందు తీయాలో లోకేష్ ఇంకా తేల్చుకోలేదు. ఈ పొట్టి సినిమా ఐడియా ఏదో వెరైటీగా అనిపిస్తోంది. ఇటీవలే జపాన్ తో డిజాస్టర్ షాక్ తిన్న కార్తీ కూడా ఖైదీ 2 పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు కానీ ఫ్యాన్స్ తో పాటు తనకూ ఎదురు చూపులు తప్పవు.
This post was last modified on December 13, 2023 12:35 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…