Movie News

రఘురాముడిగా మారబోతున్న క్రూర జంతువు

యానిమల్ విడుదలకు ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేసి రన్బీర్ కపూర్ ని మోయడం చూసి చాలా మంది అతిశయోక్తి అనుకున్నారు. తీరా తెరమీద అతని నటన చూశాక ఇప్పటి తరంలో ఆ స్థాయి పెర్ఫార్మన్స్ ఇచ్చేవాళ్ళు దరిదాపుల్లో కూడా లేరనే విషయం అందరికీ అర్థమైపోయింది. దానికి తోడు కేవలం రెండు వారాల లోపే ఏడు వందల కోట్ల వసూళ్లు దాటించి షారుక్ ఖాన్ కే సవాల్ విసిరే రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించాడు. ముందు వెనుకా చూడకుండా ఫ్యామిలీ కోసం ఎంత నరమేధానికి అయినా సిద్ధపడే పాత్రలో రన్బీర్ కాకుండా ఇంకెవరినైనా ఊహించుకోవడం కష్టం.

ఇంత వయొలెంట్ రూపం కళ్ళముందు ఉండగానే రన్బీర్ కపూర్ త్వరలో రఘురాముడిగా మారబోతున్నాడు. దంగల్ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త నాలుగైదు నెలల క్రితమే వచ్చినప్పటికీ నిర్ధారణగా ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు స్వయంగా హీరోనే ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడంతో ఇంకెలాంటి అనుమానం లేదు. రెండు లేదా మూడు భాగాలుగా ఇది ఉంటుందని ముంబై టాక్.

ఒక యాక్టర్ కి కావాల్సిన ట్రాన్స్ ఫర్మేషన్ రన్బీర్ కపూర్ అతి తక్కువ టైంలో దొరకడం అతని అదృష్టమే. మూడేళ్ళుగా రామాయణం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ప్రభాస్ ఆదిపురుష్ మీద వచ్చిన విమర్శలు చూశాక అలాంటి పొరపాట్లకు ఎలాంటి తావు లేకుండా నితీష్ ప్రతిదీ జాగ్రతగా చూసుకుంటున్నారు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ ని తీసుకున్నారనే న్యూస్ ఉంది కానీ అఫీషియల్ గా చెప్పే దాకా నమ్మలేం. దీంతో పాటు రన్బీర్ చేతిలో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవ్ ఉంటుంది. అందులో రణ్వీర్ సింగ్ కూడా భాగం అవుతాడట. రాముడిగా రన్బీర్ బాగా నప్పుతాడు. మరి ఎలా మెప్పిస్తాడో చూడాలి.

This post was last modified on December 13, 2023 12:06 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

22 mins ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

1 hour ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

1 hour ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

3 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

3 hours ago

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

3 hours ago