చూస్తుండగానే రెండు వారాల లోపే ఏడు వందల కోట్ల వసూళ్లు దాటేసిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. డిసెంబర్ 22 దాకా నెమ్మదించే సమస్యే లేదని బాలీవుడ్ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. నిన్న మొన్న వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో హాయ్ నాన్న లాంటి హిట్ మూవీని పెట్టుకుని కూడా మంచి వసూళ్లు రాబట్టుకోవడం గమనించాల్సిన విషయం. అయితే యానిమల్ పంజా దెబ్బ తప్పించుకున్న ఇద్దరు అదృష్టవంతుల గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఒకరు సన్నీ డియోల్ అయితే మరొకరు అక్షయ్ కుమార్. ఇది అర్థం కావాలంటే కొంచెం వెనక్కు వెళ్ళాలి.
యానిమల్ కు ముందు అనుకున్న విడుదల తేదీ ఆగస్ట్ 11. అదే రోజు గదర్ 2, ఓ మై గాడ్ 2 రావాలని నిర్ణయించుకున్నాయి. రన్బీర్ కపూర్ మూవీకున్న క్రేజ్ తెలిసి కూడా సన్నీ, అక్షయ్ నిర్మాతలు తలపడేందుకే సై అన్నారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొంత ఆలస్యం కావడంతో పాటు ట్రైలర్ సిద్ధం కాకపోవడం వల్ల టి సిరీస్ తమ యానిమల్ ని వెనక్కు తీసుకుంది. దీంతో మిగిలిన రెండింటికి రూట్ క్లియర్ కాగా గదర్ 2 బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ఓ మై గాడ్ 2 వంద కోట్లకు పైగా వసూళ్లతో చాలా గ్యాప్ తర్వాత అక్షయ్ కుమార్ ఖాతాలో హిట్ వేసింది. ఇదంతా యానిమల్ పుణ్యమే.
ఒకవేళ ఈ మూడు తలపడి ఉంటే యానిమల్ మేనియా ముందు నిలవడం పై రెండింటికి కష్టమయ్యేది. సందీప్ రెడ్డి వంగా దెబ్బకు ఇద్దరూ కుదేలైపోయేవారు. ఇది లక్కు కాక మరేమిటి. 2023లో నార్త్ డిస్ట్రిబ్యూటర్లు బాగా కోలుకున్నారు. పఠాన్, జవాన్, యానిమల్ మూడూ ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా టైగర్ 3 ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా మూడు వందల కోట్లతో పర్వాలేదనిపించుకుంది. యానిమల్ 2023 చివరి నెలను గ్రాండ్ గా ప్రారంభించగా డంకీ అంతే ఘనంగా క్లోజ్ చేస్తుందో లేక సలార్ దెబ్బకు తోక ముడుస్తుందో వేచి చూడాలి.
This post was last modified on December 11, 2023 10:29 pm
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అప్పటికే ప్రేమతో మీ కార్తీక్…