చూస్తుండగానే రెండు వారాల లోపే ఏడు వందల కోట్ల వసూళ్లు దాటేసిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. డిసెంబర్ 22 దాకా నెమ్మదించే సమస్యే లేదని బాలీవుడ్ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. నిన్న మొన్న వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో హాయ్ నాన్న లాంటి హిట్ మూవీని పెట్టుకుని కూడా మంచి వసూళ్లు రాబట్టుకోవడం గమనించాల్సిన విషయం. అయితే యానిమల్ పంజా దెబ్బ తప్పించుకున్న ఇద్దరు అదృష్టవంతుల గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఒకరు సన్నీ డియోల్ అయితే మరొకరు అక్షయ్ కుమార్. ఇది అర్థం కావాలంటే కొంచెం వెనక్కు వెళ్ళాలి.
యానిమల్ కు ముందు అనుకున్న విడుదల తేదీ ఆగస్ట్ 11. అదే రోజు గదర్ 2, ఓ మై గాడ్ 2 రావాలని నిర్ణయించుకున్నాయి. రన్బీర్ కపూర్ మూవీకున్న క్రేజ్ తెలిసి కూడా సన్నీ, అక్షయ్ నిర్మాతలు తలపడేందుకే సై అన్నారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొంత ఆలస్యం కావడంతో పాటు ట్రైలర్ సిద్ధం కాకపోవడం వల్ల టి సిరీస్ తమ యానిమల్ ని వెనక్కు తీసుకుంది. దీంతో మిగిలిన రెండింటికి రూట్ క్లియర్ కాగా గదర్ 2 బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ఓ మై గాడ్ 2 వంద కోట్లకు పైగా వసూళ్లతో చాలా గ్యాప్ తర్వాత అక్షయ్ కుమార్ ఖాతాలో హిట్ వేసింది. ఇదంతా యానిమల్ పుణ్యమే.
ఒకవేళ ఈ మూడు తలపడి ఉంటే యానిమల్ మేనియా ముందు నిలవడం పై రెండింటికి కష్టమయ్యేది. సందీప్ రెడ్డి వంగా దెబ్బకు ఇద్దరూ కుదేలైపోయేవారు. ఇది లక్కు కాక మరేమిటి. 2023లో నార్త్ డిస్ట్రిబ్యూటర్లు బాగా కోలుకున్నారు. పఠాన్, జవాన్, యానిమల్ మూడూ ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా టైగర్ 3 ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా మూడు వందల కోట్లతో పర్వాలేదనిపించుకుంది. యానిమల్ 2023 చివరి నెలను గ్రాండ్ గా ప్రారంభించగా డంకీ అంతే ఘనంగా క్లోజ్ చేస్తుందో లేక సలార్ దెబ్బకు తోక ముడుస్తుందో వేచి చూడాలి.
This post was last modified on December 11, 2023 10:29 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…