తాను చేసిందే తప్పయితే రివర్స్ లో అది తప్పన్న వాళ్ళను కోర్టుకీడ్చి లాభపడాలనుకున్న లియో నటుడు కం సీనియర్ విలన్ మన్సూర్ అలీ ఖాన్ కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు వేసింది. త్రిష మీద అసభ్యంగా మాట్లాడి దానికి పశ్చాత్తాప పడాల్సింది పోయి ఇలా న్యాయస్థానంకు రావడం పట్ల జడ్జ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి త్రిషనే కేసు వేయాలని, కావాలని వివాదం కొని తెచ్చుకుని ఏదో మంచివాడినని రుజువు చేసుకోవడం కోసం తాపత్రయపడటం ఎంత మాత్రం సరి కాదని వ్యాఖ్యానించింది. ఇక్కడితో అయిపోలేదు.
మన్సూర్ అలీ ఖాన్ తరఫున లాయర్ పూర్తిగా తన క్లయింట్ మాట్లాడిన వీడియోని పరిశీలించాలని అప్పుడే వాస్తవాలు అవగతమవుతానని వివిపించాడు. పరువు నష్టం దావాలో పొందుపరించిన చిరంజీవి, త్రిష, ఖుష్బూ తరఫున రాతపూర్వక వివరణ కోరుతూ డిసెంబర్ 22కి వాయిదా వేసింది. అంటే ఈ ముగ్గురు కోర్టుకు ప్రత్యక్షంగా రాకపోయినా న్యాయవాది ద్వారా తమ వైపు నుంచి అభ్యంతరాలను వ్యక్తం చేయొచ్చు. ఒకవేళ ఇదంతా చేసినందుకు కోపం వచ్చి ఎవరు ఫ్రెష్ గా కేసు పెట్టినా మన్సూర్ అలీ ఖాన్ ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి పాతిక లక్షలకు పైగానే లాగాలని స్కెచ్ వేసుకున్నాడు.
ఇంత జరిగినా నడిగర్ సంఘం నుంచి మన్సూర్ మీద ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఎందరో సెలెబ్రిటీలు అతని వ్యాఖ్యల్ని ఖండించి బహిష్కరించమని కోరినా సరే ప్రస్తుతానికి కదలిక లేదు. కొన్ని పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు చేస్తుండటంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేమని, ఒకవేళ అలా చేస్తే నిర్మాతలు చాలా నష్టపోతారని, మళ్ళీ కొత్త ఆర్టిస్టులతో రీ షూట్ చేయలేరని చెప్పడం అసలు ట్విస్ట్. ఇలా కాకుండా భవిష్యత్తులో మన్సూర్ లాంటి వాళ్లకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రొడ్యూసర్లు నిర్ణయించుకుంటే సరిపోతుందని అంటున్నారు.
This post was last modified on December 11, 2023 9:30 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…