జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నా, ఆ రేంజ్లో స్టార్ డమ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది ప్రియమణి. ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా, టూ పీస్ బికినీ షోతో రెచ్చిపోయినా… ఎందుకో కాని యూత్లో రావాల్సినంత క్రేజ్ ప్రియమణికి రాలేదు. సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిలైన ప్రియమణికి, సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయట.
తాజాగా ప్రియమణి బాలీవుడ్లో నటించిన ‘అతీత్’ సినిమా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో నేరుగా రిలీజైంది. ఈ సినిమాలో తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నటించింది ప్రియమణి.
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయడం కోసం నెలల పాటు నిరీక్షించడం కంటే, విస్తరిస్తున్న డిజిటల్ ఫ్లాట్ఫాంను వాడుకోవడమే బెటర్ ఛాయిస్ అంటోంది ప్రియమణి. ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్లతో యమా బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ‘మైదాన్’లో నటిస్తున్న ప్రియమణి… ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సిరీస్ చేస్తోంది.
ఇక తెలుగులోనూ వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలో నటిస్తోందట ప్రియమణి. ప్రకాశ్ రాజ్ రూపొందించిన ‘మనవూరి రామాయణం’ సినిమాలో చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రియమణి, నాలుగేళ్లుగా టాలీవుడ్లో కనిపించలేదు.
అయితే ఢీ షోలో జడ్జిగా తెలుగువాళ్లతో టచ్లోనే ఉంటోంది. వెంకటేష్ సరసన ‘నారప్ప’తో పాటు రానా ‘విరాట పర్వం’లోనూ మహిళా నక్సలైట్ గా నటిస్తోంది. అందుకే టాలీవుడ్లో ఈ ఏడాది తనకు మంచి కమ్ బ్యాక్ అవుతుందని చెబుతోంది. ఇవికాక కన్నడలోనూ రెండు సినిమాలు చేస్తోంది. అందరు హీరోయిన్లు పెళ్లైన తర్వాత అవకాశాలు కోల్పోతుంటే, ప్రియమణి మాత్రం మ్యారేజ్ చేసుకున్న తర్వాత బిజీ అయ్యింది.
This post was last modified on April 25, 2020 11:51 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…