Movie News

సెకండ్ ఇన్నింగ్స్‌లో అమ్మడికి కలిసొచ్చిందిగా

జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నా, ఆ రేంజ్‌లో స్టార్ డమ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది ప్రియమణి. ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా, టూ పీస్ బికినీ షోతో రెచ్చిపోయినా… ఎందుకో కాని యూత్‌లో రావాల్సినంత క్రేజ్ ప్రియమణికి రాలేదు. సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిలైన ప్రియమణికి, సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయట.

తాజాగా ప్రియమణి బాలీవుడ్‌లో నటించిన ‘అతీత్’ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నేరుగా రిలీజైంది. ఈ సినిమాలో తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నటించింది ప్రియమణి.

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయడం కోసం నెలల పాటు నిరీక్షించడం కంటే, విస్తరిస్తున్న డిజిటల్ ఫ్లాట్‌ఫాంను వాడుకోవడమే బెటర్ ఛాయిస్ అంటోంది ప్రియమణి. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో యమా బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ‘మైదాన్‌’లో నటిస్తున్న ప్రియమణి… ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సిరీస్‌ చేస్తోంది.

ఇక తెలుగులోనూ వెంకటేశ్‌ ‘నారప్ప’ సినిమాలో నటిస్తోందట ప్రియమణి. ప్రకాశ్ రాజ్ రూపొందించిన ‘మనవూరి రామాయణం’ సినిమాలో చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రియమణి, నాలుగేళ్లుగా టాలీవుడ్‌లో కనిపించలేదు.

అయితే ఢీ షోలో జడ్జిగా తెలుగువాళ్లతో టచ్‌లోనే ఉంటోంది. వెంకటేష్ సరసన ‘నారప్ప’తో పాటు రానా ‘విరాట పర్వం’లోనూ మహిళా నక్సలైట్ గా నటిస్తోంది. అందుకే టాలీవుడ్‌లో ఈ ఏడాది తనకు మంచి కమ్ బ్యాక్ అవుతుందని చెబుతోంది. ఇవికాక కన్నడలోనూ రెండు సినిమాలు చేస్తోంది. అందరు హీరోయిన్లు పెళ్లైన తర్వాత అవకాశాలు కోల్పోతుంటే, ప్రియమణి మాత్రం మ్యారేజ్ చేసుకున్న తర్వాత బిజీ అయ్యింది.

This post was last modified on April 25, 2020 11:51 pm

Share
Show comments
Published by
Satya
Tags: Priyamani

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago