ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్న త్రిప్తి డిమ్రి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇంటర్వ్యూల కోసం మీడియా వెంటపడుతోంది. మొన్నటి దాకా ఎక్కడైనా ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే పట్టించుకోని జనం ఇప్పుడు సెల్ఫిల కోసం ఎగబడుతున్నారు. మెయిన్ హీరోయిన్ కాకపోయినా, సెకండ్ హాఫ్ లో ఒక గంటకు మాత్రమే పరిమితమైనా ఈ రేంజ్ లో ఇమేజ్ పెరగడం చాలా అరుదు. దెబ్బకు తెలుగు తమిళం నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయంటూ కథలు పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసిందన్న గాసిప్ చక్కర్లు కొట్టింది.
యూత్ లో త్రిప్తి డిమ్రికి ఇంత క్రేజ్ రావడానికి కారణమైన యానిమల్ బెడ్ రూమ్ సీన్ గురించి కొన్ని సంగతులు చెప్పుకొచ్చింది. తనతో పాటు రన్బీర్ కపూర్ దాదాపు నగ్నంగా అనిపించే ఈ రొమాంటిక్ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందే తనకు స్పష్టంగా వివరించాడు. ఏ మాత్రం అసౌకర్యం అనిపించినా మార్చేస్తానని, అసభ్యత లేకుండా తీసే బాధ్యత తన మీద ఉందని చెప్పాడు. హీరో హీరోయిన్ డైరెక్టర్ కాకుండా కేవలం కెమెరా మెన్ మాత్రమే రూమ్ లో ఉండేలా ముందే సెట్ చేసుకుని తమ జోడి మీద ఈ పడక గది షూట్ జరిగిందని క్లారిటీ ఇచ్చింది.
నిజంగానే పూర్తి వలువలు లేకుండా నటించకపోయినా ఆ స్థాయి ఇంపాక్ట్ ఆ సీన్ ఇచ్చిన మాట వాస్తవం. రన్బీర్ కపూర్ ని విపరీతంగా ఆరాధించే ఈ అమ్మాయి ఏకంగా తనతోనే జట్టు కట్టే ఛాన్స్ రావడంతో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే సినిమా చూశాక తల్లితండ్రులు కొంత భాగం చూసి ఇబ్బంది పడ్డారని, కానీ అదంతా వృత్తిలో భాగమని అర్థం చేసుకున్నాక దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా సహకరించారని చెప్పింది. ప్రస్తుతం రెండు మీడియం బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న త్రిప్తి డిమ్రికి ఇప్పుడు బడా నిర్మాణ సంస్థల నుంచి క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
This post was last modified on December 11, 2023 1:57 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…