ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తున్న త్రిప్తి డిమ్రి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇంటర్వ్యూల కోసం మీడియా వెంటపడుతోంది. మొన్నటి దాకా ఎక్కడైనా ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే పట్టించుకోని జనం ఇప్పుడు సెల్ఫిల కోసం ఎగబడుతున్నారు. మెయిన్ హీరోయిన్ కాకపోయినా, సెకండ్ హాఫ్ లో ఒక గంటకు మాత్రమే పరిమితమైనా ఈ రేంజ్ లో ఇమేజ్ పెరగడం చాలా అరుదు. దెబ్బకు తెలుగు తమిళం నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయంటూ కథలు పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసిందన్న గాసిప్ చక్కర్లు కొట్టింది.
యూత్ లో త్రిప్తి డిమ్రికి ఇంత క్రేజ్ రావడానికి కారణమైన యానిమల్ బెడ్ రూమ్ సీన్ గురించి కొన్ని సంగతులు చెప్పుకొచ్చింది. తనతో పాటు రన్బీర్ కపూర్ దాదాపు నగ్నంగా అనిపించే ఈ రొమాంటిక్ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందే తనకు స్పష్టంగా వివరించాడు. ఏ మాత్రం అసౌకర్యం అనిపించినా మార్చేస్తానని, అసభ్యత లేకుండా తీసే బాధ్యత తన మీద ఉందని చెప్పాడు. హీరో హీరోయిన్ డైరెక్టర్ కాకుండా కేవలం కెమెరా మెన్ మాత్రమే రూమ్ లో ఉండేలా ముందే సెట్ చేసుకుని తమ జోడి మీద ఈ పడక గది షూట్ జరిగిందని క్లారిటీ ఇచ్చింది.
నిజంగానే పూర్తి వలువలు లేకుండా నటించకపోయినా ఆ స్థాయి ఇంపాక్ట్ ఆ సీన్ ఇచ్చిన మాట వాస్తవం. రన్బీర్ కపూర్ ని విపరీతంగా ఆరాధించే ఈ అమ్మాయి ఏకంగా తనతోనే జట్టు కట్టే ఛాన్స్ రావడంతో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే సినిమా చూశాక తల్లితండ్రులు కొంత భాగం చూసి ఇబ్బంది పడ్డారని, కానీ అదంతా వృత్తిలో భాగమని అర్థం చేసుకున్నాక దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా సహకరించారని చెప్పింది. ప్రస్తుతం రెండు మీడియం బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న త్రిప్తి డిమ్రికి ఇప్పుడు బడా నిర్మాణ సంస్థల నుంచి క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
This post was last modified on December 11, 2023 1:57 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…