Movie News

కొత్త నిబంధనలతో పైరసీని అడ్డుకోగలరా

సినిమా పరిశ్రమని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగిస్తోంది. కఠిన చట్టాలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇకపై ఎవరైనా థియేటర్లో షో జరుగుతుండగా వీడియో రికార్డింగ్ చేస్తే 3 నెలల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా విధించే దిశగా చట్టాన్ని తేబోతోంది. అంతే కాదు ఆడిట్ చేసిన గ్రాస్ ప్రొడక్షన్ కాస్ట్ లో 5 శాతం సొమ్ముని నిర్మాతకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో కారాగారవాసం మరింత పెరుగుతుంది. అంటే సెల్ ఫోన్ తో వీడియోలు తీస్తూ పట్టుబడినా చాలు ఈ చర్యలకు గురి కాక తప్పదు.

గవర్నమెంట్ ప్రత్యేకంగా నియమించిన నోడల్ ఆఫీసర్లు నిర్మాతలు ఏదైనా పైరసీ సైట్ గురించి ఫిర్యాదు చేసిన 48 గంటల్లో దాన్ని నిరోధించే దిశగా వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఈ బృందం నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. ప్రధాన నగరాల్లో దీని ఆఫీసులు ఉంటాయి. వినడానికి బాగానే ఉంది కానీ ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఆపరేట్ చేసే పైరసీ చోరులను పట్టుకోవడం అంత సులభం కాదు. ఆయా దేశాల సహకారం చాలా అవసరం. అది లేనందు వల్లే నిందితులు పేట్రేగిపోతున్నారు. మొదటి షో పడిన గంటల వ్యవధిలో క్వాలిటీ ప్రింట్లను వెబ్ సైట్ లో పెడుతున్నారు.

ఇదంతా పక్కాగా మారడానికి చాలా సమయమే పడుతుంది. కేవలం థియేటర్లో సెల్ ఫోన్లతో షూట్ చేసే వాళ్ళను కట్టడి చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. మహా అయితే వాళ్ళ రికార్డింగ్ కొన్ని నిముషాలు మాత్రమే ఉంటుంది. అయితే పైరసీ దొంగలు ఏ థియేటర్లో ఎవరి సహకారంతో మొత్తం సినిమాను బయటికి తీసుకొస్తున్నారో దాన్ని పసిగట్టాలి. కట్టడి చేసే మార్గాలను వెతకాలి. అంతే తప్ప పై పై పూతల పనులతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయినా సరే ఈ మాత్రం కదలిక ప్రభుత్వంలో రావడం మంచిదే.

This post was last modified on December 11, 2023 8:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

53 seconds ago

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

2 hours ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

3 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

3 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

4 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

4 hours ago