సినిమా పరిశ్రమని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగిస్తోంది. కఠిన చట్టాలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇకపై ఎవరైనా థియేటర్లో షో జరుగుతుండగా వీడియో రికార్డింగ్ చేస్తే 3 నెలల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా విధించే దిశగా చట్టాన్ని తేబోతోంది. అంతే కాదు ఆడిట్ చేసిన గ్రాస్ ప్రొడక్షన్ కాస్ట్ లో 5 శాతం సొమ్ముని నిర్మాతకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో కారాగారవాసం మరింత పెరుగుతుంది. అంటే సెల్ ఫోన్ తో వీడియోలు తీస్తూ పట్టుబడినా చాలు ఈ చర్యలకు గురి కాక తప్పదు.
గవర్నమెంట్ ప్రత్యేకంగా నియమించిన నోడల్ ఆఫీసర్లు నిర్మాతలు ఏదైనా పైరసీ సైట్ గురించి ఫిర్యాదు చేసిన 48 గంటల్లో దాన్ని నిరోధించే దిశగా వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఈ బృందం నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. ప్రధాన నగరాల్లో దీని ఆఫీసులు ఉంటాయి. వినడానికి బాగానే ఉంది కానీ ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఆపరేట్ చేసే పైరసీ చోరులను పట్టుకోవడం అంత సులభం కాదు. ఆయా దేశాల సహకారం చాలా అవసరం. అది లేనందు వల్లే నిందితులు పేట్రేగిపోతున్నారు. మొదటి షో పడిన గంటల వ్యవధిలో క్వాలిటీ ప్రింట్లను వెబ్ సైట్ లో పెడుతున్నారు.
ఇదంతా పక్కాగా మారడానికి చాలా సమయమే పడుతుంది. కేవలం థియేటర్లో సెల్ ఫోన్లతో షూట్ చేసే వాళ్ళను కట్టడి చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. మహా అయితే వాళ్ళ రికార్డింగ్ కొన్ని నిముషాలు మాత్రమే ఉంటుంది. అయితే పైరసీ దొంగలు ఏ థియేటర్లో ఎవరి సహకారంతో మొత్తం సినిమాను బయటికి తీసుకొస్తున్నారో దాన్ని పసిగట్టాలి. కట్టడి చేసే మార్గాలను వెతకాలి. అంతే తప్ప పై పై పూతల పనులతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయినా సరే ఈ మాత్రం కదలిక ప్రభుత్వంలో రావడం మంచిదే.
This post was last modified on December 11, 2023 8:18 am
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…