యానిమల్ దెబ్బకు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రమోషన్ల పని మీద యుఎస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్న క్రమంలో తనకెంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే కనక ఒక యాక్షన్ డ్రామాని తీస్తానని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. తనకు చిరు, పవన్ కళ్యాణ్ ల మీద ఎంత ఫ్యానిజం ఉందో పాత ట్వీట్లు, ఇంటర్వ్యూలు చూస్తే అర్థమైపోతుంది. సరే వినడానికి బాగానే ఉంది కానీ ఇది సాధ్యమయ్యే ఛాన్స్ ఏ మేరకు ఉందంటే సమాధానం చెప్పడం కష్టం.
ఎందుకంటే సందీప్ వంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ప్రభాస్ స్పిరిట్ మొదలుపెడతాడు. దానికో రెండేళ్లు వేసుకున్నా ఆ తర్వాత అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేయాలి. ఇది పూర్తయ్యేలోగా సులభంగా 2028 వచ్చేస్తుంది. అప్పటికి ఎవరికి కొత్త కమిట్ మెంట్లు ఇవ్వకపోతే చిరు కాంబినేషన్ కుదురుతుంది. అన్నింటికి మించి ముందు కథ కుదరాలి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ అంటే కమల్ హాసన్ విక్రమ్ రేంజ్ లో ఉంటేనే కిక్కు. సందీప్ ఎలాగూ రొటీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్లు చేయడు కాబట్టి దానికి అనుగుణంగా చిరునే తన స్టైల్ ని మార్చుకోవాల్సి ఉంటుంది.
సో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవ్వడం తప్ప ఈ కాంబోకి చాలా టైం పడుతుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చి వీలైనంత వేగంగా చిరుతో చేసే ఛాన్స్ వస్తే తప్ప కార్యరూపం దాల్చదు. ప్రస్తుతం విశ్వంభరలో బిజీగా ఉన్న చిరంజీవి ఇంకా యానిమల్ చూశారో లేదో కానీ ఆయన వైపు నుంచి ఎక్స్ లో ఎలాంటి అభినందనల ట్వీట్ లేదు. ఆ మాటకొస్తే అల్లు అర్జున్, ప్రభాస్ లు మాత్రమే సందీప్ పనితనం గురించి ఓపెన్ గా పొగిడారు. వాళ్ళతో సినిమాలు చేయబోవడం ఒక కారణం కావొచ్చేమో కానీ మిగిలిన వాళ్ళు మాత్రం ఎందుకొచ్చిన సోషల్ మీడియా తలనెప్పని స్పందించకుండా సైలెంట్ గా ఉన్నారు.
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…