ఎవరైనా స్టార్ ఫ్యామిలీ నుంచి హీరో హీరోయిన్లు వస్తున్నారంటే జనాల దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది. ఫస్ట్ లుక్ తో మొదలుపెట్టి ఫైనల్ అవుట్ ఫుట్ దాకా చాలా నిశితంగా గమనిస్తారు. నిన్న నెట్ ఫ్లిక్స్ లో ది ఆర్చీస్ మూవీ రిలీజయ్యింది. ప్రత్యేక విశేషం ఏంటంటే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవి రెండో తనయ కం జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ దీంతో పరిచయమయ్యారు. ముంబైలో టాప్ బాలీవుడ్ సెలెబ్రిటీస్ అందరికీ స్పెషల్ షో వేస్తే ఏ ఒక్కరు మిస్ కాకుండా అందరూ వచ్చారు. ఏదో అవార్డు ఫంక్షన్ కి తరలి వచ్చినట్టు థియేటర్ మొత్తం నిండిపోయింది.
ట్విస్ట్ ఏంటంటే సుహానా, ఖుషిలు ట్రోలింగ్ బ్యాచ్ కి దొరికిపోయారు. వాళ్ళ ఎక్స్ ప్రెషన్లు, నటనను భూతద్దంలో పట్టి చూపిస్తూ సోషల్ మీడియాలో ఎగతాళి పర్వం మొదలుపెట్టారు. నిజానికి ఈ ఇద్దరూ నటన పరంగా ఇంకా బేసిక్ స్టేజిలో ఉన్నారు. శిక్షణ ఇప్పించారు కానీ ఇంకా మెరుగు పడాల్సింది చాలా ఉంది. సుహానా డాన్స్ బాగా చేసినా ఎమోషన్స్ ఎక్కువగా పండించాల్సిన సీన్స్ లో తడబడింది. ఖుషిది కూడా ఇదే సమస్య. దీంతో నెటిజెన్లు స్క్రీన్ షాట్లు తీసి మరీ టార్గెట్ చేసుకున్నారు. ఆర్చీస్ కి రివ్యూస్ పర్వాలేదనే వచ్చాయి. ఒక విభిన్న ప్రయత్నమంటూ మెచ్చుకున్నారు.
దర్శకురాలు జోయా అక్తర్ ని నమ్మి భారీ బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దీన్ని నిర్మించింది. 1960 బ్యాక్ డ్రాప్ లో లేలేత టీనేజర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఆర్చీస్ ని రూపొందించారు. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేందుకు భారీ సెట్లు వేసి, విఎఫెక్స్ కూడా గట్టిగానే వాడారు. అయితే కామన్ ఆడియన్స్ మాత్రం ఆర్చీస్ కి నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. బోరింగ్ గా తీశారని, డ్రామా తగ్గిపోయి సంభాషణల మీద విపరీతంగా ఆధారపడటం వల్ల సాగతీత జరిగిందని విమర్శించారు. సరే ఓటిటి కాబట్టి సరిపోయింది అదే థియేటర్ సినిమా అయితే ఇదింకా తీవ్రంగా ఉండేదనడంలో డౌట్ అక్కర్లేదు.
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ ను…
తమ సినిమా పెద్ద హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెప్పుకోవడం మామూలే. ఇలా ఎవరైనా చెప్పుకుంటుంటే అదేమీ…
ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తుంటే.. తెలుగు సినిమాకు ప్రాతినిధ్యం దక్కితే ఆశ్చర్యపోయేవాళ్లం. మన సినిమాలకు ఏదైనా విభాగంలో జాతీయ అవార్డు…
పార్టీలో కార్యకర్తల స్థాయిలో ఉన్నవారు.. పార్టీ పెద్దలతో ఫొటోలు అంటే.. ఎంతగా ఎగబడతారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా జాతీయ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కబోతున్న ఆర్సి 17 నవంబర్ నుంచి షూటింగ్ కు…
తెలుగు నేల రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ కేక్…