ఎవరైనా స్టార్ ఫ్యామిలీ నుంచి హీరో హీరోయిన్లు వస్తున్నారంటే జనాల దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది. ఫస్ట్ లుక్ తో మొదలుపెట్టి ఫైనల్ అవుట్ ఫుట్ దాకా చాలా నిశితంగా గమనిస్తారు. నిన్న నెట్ ఫ్లిక్స్ లో ది ఆర్చీస్ మూవీ రిలీజయ్యింది. ప్రత్యేక విశేషం ఏంటంటే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవి రెండో తనయ కం జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ దీంతో పరిచయమయ్యారు. ముంబైలో టాప్ బాలీవుడ్ సెలెబ్రిటీస్ అందరికీ స్పెషల్ షో వేస్తే ఏ ఒక్కరు మిస్ కాకుండా అందరూ వచ్చారు. ఏదో అవార్డు ఫంక్షన్ కి తరలి వచ్చినట్టు థియేటర్ మొత్తం నిండిపోయింది.
ట్విస్ట్ ఏంటంటే సుహానా, ఖుషిలు ట్రోలింగ్ బ్యాచ్ కి దొరికిపోయారు. వాళ్ళ ఎక్స్ ప్రెషన్లు, నటనను భూతద్దంలో పట్టి చూపిస్తూ సోషల్ మీడియాలో ఎగతాళి పర్వం మొదలుపెట్టారు. నిజానికి ఈ ఇద్దరూ నటన పరంగా ఇంకా బేసిక్ స్టేజిలో ఉన్నారు. శిక్షణ ఇప్పించారు కానీ ఇంకా మెరుగు పడాల్సింది చాలా ఉంది. సుహానా డాన్స్ బాగా చేసినా ఎమోషన్స్ ఎక్కువగా పండించాల్సిన సీన్స్ లో తడబడింది. ఖుషిది కూడా ఇదే సమస్య. దీంతో నెటిజెన్లు స్క్రీన్ షాట్లు తీసి మరీ టార్గెట్ చేసుకున్నారు. ఆర్చీస్ కి రివ్యూస్ పర్వాలేదనే వచ్చాయి. ఒక విభిన్న ప్రయత్నమంటూ మెచ్చుకున్నారు.
దర్శకురాలు జోయా అక్తర్ ని నమ్మి భారీ బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దీన్ని నిర్మించింది. 1960 బ్యాక్ డ్రాప్ లో లేలేత టీనేజర్స్ మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఆర్చీస్ ని రూపొందించారు. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేందుకు భారీ సెట్లు వేసి, విఎఫెక్స్ కూడా గట్టిగానే వాడారు. అయితే కామన్ ఆడియన్స్ మాత్రం ఆర్చీస్ కి నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. బోరింగ్ గా తీశారని, డ్రామా తగ్గిపోయి సంభాషణల మీద విపరీతంగా ఆధారపడటం వల్ల సాగతీత జరిగిందని విమర్శించారు. సరే ఓటిటి కాబట్టి సరిపోయింది అదే థియేటర్ సినిమా అయితే ఇదింకా తీవ్రంగా ఉండేదనడంలో డౌట్ అక్కర్లేదు.
This post was last modified on December 8, 2023 7:31 pm
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…