కెజిఎఫ్ 2 తర్వాత విపరీతమైన గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ యష్ ఎట్టకేలకు తన 19వ సినిమాని అధికారికంగా ప్రకటించాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీకి ‘టాక్సిక్’ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన లీక్ గత అయిదారు నెలలుగా మీడియా వర్గాల్లో తిరుగుతూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ టైం నానబెడుతూ వచ్చారే తప్ప అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ వేయలేకపోయారు. ఎట్టకేలకు దాని చెక్ పెడుతూ టీజర్ లాంటి వీడియో రూపంలో అఫీషియల్ గా చెప్పారు.
నిజానికి కెజిఎఫ్ తెచ్చిన ప్యాన్ ఇండియా సక్సెస్ యష్ ని విపరీతమైన ఒత్తిడికి గురి చేసింది. ఏ దర్శకుడికి ఓకే చెప్పాలి, ఎలాంటి కథను ఎంచుకోవాలనే దాని మీద తేల్చుకోలేక నెలల తరబడి కాలాన్ని ఖర్చు పెట్టేశాడు. పోనీ కెజిఎఫ్ 3 చేద్దామనుకుంటే ప్రశాంత్ నీల్ సలార్ రెండు భాగాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు లాక్ చేసుకోవడంతో అప్పుడప్పుడే జరిగే పనిలా కనిపించలేదు. లైగర్ విడుదలకు ముందు పూరి జగన్నాధ్ తో సైతం ఒక రౌండ్ స్టోరీ డిస్కషన్ జరిగింది కానీ రౌడీ హీరో రిజల్ట్ చూశాక ఇంకే ఆలోచన చేయకుండా దాన్ని ప్రతిపాదన స్టేజి దగ్గరే ఆపేశాడని టాక్.
టాక్సిక్ విడుదల తేదీని ప్రకటించేశారు. 2025 ఏప్రిల్ 10 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్ చివర్లో ఇచ్చేశారు. అంటే నిర్మాణానికి ఏడాదికి పైగా సమయం పడుతుందన్న మాట. గోవా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా రూపొందబోయే టాక్సిక్ కి గీతూ మోహన్ దాస్ నే యష్ ఎంచుకోవడానికి ఆమె ట్రాక్ రికార్డు కారణం. కమర్షియల్ స్టార్లను డీల్ చేయడంలో అనుభవం లేకపోయినా ఒక డైరెక్టర్ ఆమెకున్న పట్టుకు సాధించిన విజయాలే నిదర్శనం. అందుకే కాస్త లేట్ అయినా ఫైనల్ గా సెట్ చేసుకున్నాడు. అన్ని ప్రధాన భాషల్లో టాక్సిక్ రాబోతోంది
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…