కెజిఎఫ్ 2 తర్వాత విపరీతమైన గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ యష్ ఎట్టకేలకు తన 19వ సినిమాని అధికారికంగా ప్రకటించాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీకి ‘టాక్సిక్’ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన లీక్ గత అయిదారు నెలలుగా మీడియా వర్గాల్లో తిరుగుతూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ టైం నానబెడుతూ వచ్చారే తప్ప అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ వేయలేకపోయారు. ఎట్టకేలకు దాని చెక్ పెడుతూ టీజర్ లాంటి వీడియో రూపంలో అఫీషియల్ గా చెప్పారు.
నిజానికి కెజిఎఫ్ తెచ్చిన ప్యాన్ ఇండియా సక్సెస్ యష్ ని విపరీతమైన ఒత్తిడికి గురి చేసింది. ఏ దర్శకుడికి ఓకే చెప్పాలి, ఎలాంటి కథను ఎంచుకోవాలనే దాని మీద తేల్చుకోలేక నెలల తరబడి కాలాన్ని ఖర్చు పెట్టేశాడు. పోనీ కెజిఎఫ్ 3 చేద్దామనుకుంటే ప్రశాంత్ నీల్ సలార్ రెండు భాగాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు లాక్ చేసుకోవడంతో అప్పుడప్పుడే జరిగే పనిలా కనిపించలేదు. లైగర్ విడుదలకు ముందు పూరి జగన్నాధ్ తో సైతం ఒక రౌండ్ స్టోరీ డిస్కషన్ జరిగింది కానీ రౌడీ హీరో రిజల్ట్ చూశాక ఇంకే ఆలోచన చేయకుండా దాన్ని ప్రతిపాదన స్టేజి దగ్గరే ఆపేశాడని టాక్.
టాక్సిక్ విడుదల తేదీని ప్రకటించేశారు. 2025 ఏప్రిల్ 10 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్ చివర్లో ఇచ్చేశారు. అంటే నిర్మాణానికి ఏడాదికి పైగా సమయం పడుతుందన్న మాట. గోవా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా రూపొందబోయే టాక్సిక్ కి గీతూ మోహన్ దాస్ నే యష్ ఎంచుకోవడానికి ఆమె ట్రాక్ రికార్డు కారణం. కమర్షియల్ స్టార్లను డీల్ చేయడంలో అనుభవం లేకపోయినా ఒక డైరెక్టర్ ఆమెకున్న పట్టుకు సాధించిన విజయాలే నిదర్శనం. అందుకే కాస్త లేట్ అయినా ఫైనల్ గా సెట్ చేసుకున్నాడు. అన్ని ప్రధాన భాషల్లో టాక్సిక్ రాబోతోంది
This post was last modified on December 8, 2023 10:17 am
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…