Movie News

రవితేజ కథ సన్నీడియోల్ చేతికి ?

కొన్ని వారాల క్రితం మైత్రి మూవీ మేకర్స్ అట్టహాసంగా ప్రకటించిన రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా హఠాత్తుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. బడ్జెట్ వర్కౌట్ కాదనే సందేహంతోనే వద్దనుకున్నారనే వార్త గట్టిగానే తిరిగింది కానీ నిర్మాతల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదు. ఈలోగా తమిళ స్టార్ హీరో అజిత్ తో మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో ఇంకో ప్యాన్ ఇండియా మూవీ సెట్ చేసుకున్నారు. మరి కథ బాగా నచ్చి ముందు ఓకే అనుకున్న మాస్ మహారాజా ప్రాజెక్ట్ ఇప్పుడు అనూహ్యంగా చేతులు మారి బాలీవుడ్ వెళ్లిందట.

ఈ ఏడాది గదర్ 2 రూపంలో బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి అందుకున్న సన్నీడియోల్ హీరోగా ఇదే స్టోరీని తెరకెక్కించేందుకు మైత్రి సిద్ధమయ్యిందని వినికిడి. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ప్రాధమికంగా ముంబైలో ఒక దఫా చర్చలు జరిగిపోయాయట. క్రాక్ తరహాలో మంచి పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో గోపిచంద్ తయారు చేసుకున్న స్క్రిప్ట్ వినగానే సన్నీ డియోల్ మెచ్చుకున్నట్టు తెలిసింది. హిందీలో భారీ ఎత్తున అడుగు పెట్టాలని చూస్తున మైత్రికి ఇది మంచి కాంబో అవుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా సన్నీ మార్కెట్ పెరిగిపోవడంతో బిజినెస్ పరంగా ఢోకా లేదు.

ఒకవేళ ఇది నిజమైతే మాత్రం గోపిచంద్ కి మంచి బ్రేక్ అవుతుంది. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత సుమారు ఆరేడు నెలలు దీని మీదే వర్క్ చేశాడు. రవితేజ హ్యాట్రిక్ తర్వాత మరోసారి తన కలయికతో ఇంకో హిట్ ఇవ్వొచ్చనే నమ్మకంతో ఉన్నాడు. అయితే ఇప్పుడీ కాంబో మారిపోవడం ఒక రకంగా మంచిదే. సందీప్ రెడ్డి వంగా, ఆట్లీ తరహాలో నార్త్ హీరోల దృష్టిలో పడితే మార్కెట్ పెరుగుతుంది. టి సిరీస్, ధర్మా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థలు ఆఫర్లు ఇస్తాయి. కన్ఫర్మ్ అయితే మాత్రం క్యాస్టింగ్ తప్ప టెక్నికల్ టీమ్ మొత్తం ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా ఉంటుంది.

This post was last modified on December 8, 2023 9:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

15 minutes ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

1 hour ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

3 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

3 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

3 hours ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

4 hours ago