తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంతో ఎలాంటి పాలన ఉండబోతోందోనని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ కూడా ఉంది. పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం తరఫున పరిశ్రమకు పెద్దగా సమస్యలేం రాలేదు. టికెట్ రేట్లకు సంబంధించి అవసరమైనప్పుడు వెసులుబాట్లు వచ్చాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే ఇక్కడెలాంటి విషమ పరిస్థితులు తలెత్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో అంతకు మించిన సహాయ సహకారాలు ఉంటాయని ఇండస్ట్రీ పెద్దలు ఆశిస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చాక మౌనంగా ఉంటూ వచ్చిన సెలబ్రిటీలు ఇవాళ అధికారిక కార్యక్రమం పూర్తవ్వగానే శుభాకాంక్షలు అందజేస్తున్నారు. చిరంజీవి, రవితేజ, నాగార్జున, విశ్వక్ సేన్, సుధీర్ బాబు, హరీష్ శంకర్, వైజయంతి మూవీస్, రాహుల్ రామకృష్ణ, శ్రీను వైట్ల, గోపి మోహన్ తదితరులతో నిముషాలు గడిచే కొద్దీ ఈ లిస్టు పెరుగుతూ పోతోంది. బిజీగా ఉన్న కారణంగా రేవంత్ రెడ్డి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇంకా స్పందనలు రాలేదు కానీ ఆ లాంఛనం కూడా మొదలవుతుంది. ఇంకా విష్ చేయాల్సిన వాళ్ళు ఒక్కొకరుగా యాడ్ అవుతూనే ఉంటారు.
ఇంకో రెండు వారాల్లో సలార్ విడుదల ఉంది. పరిశ్రమకు సంబంధించి మొదటి విన్నపం దీనికి సంబంధించే వెళ్లొచ్చు. అనుమతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు కానీ అటు ఏపీలో పర్మిషన్ల వ్యవహారం తేలాల్సి ఉంది. టాలీవుడ్ తరఫున రేవంత్ రెడ్డి సన్మానం చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన కొందరు పెద్దలు పెడుతున్నారు కానీ గతంలో కేసీఆర్, అటు పక్క జగన్ కు చేయనిది ఇప్పుడు ప్రత్యేకంగా చేస్తే వేరే సంకేతాలు వెళ్లొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. అందుకే అలాంటిదేమి ఉండకపోవచ్చు కానీ వ్యక్తిగత కలయికలు ఉంటాయి.
This post was last modified on December 7, 2023 9:56 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…