ఇంద్రగంటి మోహనకృష్ణ అంటే చిన్న, మీడియం బడ్జెట్లలో సినిమాలు చేసుకునే దర్శకుడు. అతడి కాస్టింగ్ కూడా అలాగే ఉంటుంది. ఐతే ఇప్పుడాయన నుంచి రాబోతున్న వి.. తన గత సినిమాలకు భిన్నంగా కనిపిస్తోంది. దాని బడ్జెట్, లుక్ అన్నీ ఒక రేంజ్లో కనిపిస్తున్నాయి. ఇంద్రగంటితో ఇంతకుముందు రెండు సినిమాలు చేసినప్పటితో పోలిస్తే నాని ఇమేజ్ కూడా మారింది. ఇంద్రగంటిని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమాలా కనిపించింది టీజర్, ట్రైలర్ చూస్తే. ఇంద్రగంటి సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ శనివారం అమేజాన్ ప్రైమ్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇంద్రగంటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
‘‘నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చితే స్టైల్ పరంగా, స్కేల్ పరంగా ‘వి’ నాకొక ఛాలెంజింగ్ మూవీ. దీన్ని ఐదు రాష్ట్రాలతో పాటు థాయ్లాండ్లోనూ చిత్రీకరించాం. ఇంతకు ముందు నా సినిమాలను నేనింతలా లావిష్గా చేయలేదు. నేను తీసిన సినిమాల్లో నెక్స్ట్ రేంజ్ మూవీ అని చెప్పవచ్చు. ‘వి’ ఒక మిస్టరీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా. అందరినీ మెప్పించేలా ఉంటుంది’’ అని ఇంద్రగంటి అన్నాడు. వి సినిమా క్లైమాక్స్ చూస్తే అందరికీ సీక్వెల్ ఉంటుందనే అనుమానం వస్తుందని.. అయితే దాని సీక్వెల్ గురించి తాను ఇంకా ఆలోచించలేదని ఇంద్రగంటి చెప్పాడు.
ఇక ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీల్లో రిలీజ్ చేయడం గురించి ఇంద్రగంటి స్పందిస్తూ.. ‘‘మా సినిమాను ఇప్పటికే ఐదు నెలలుగా హోల్డ్ చేశాం. కానీ ఇప్పటికీ థియేటర్లు తెరిచే విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు సినిమాను హోల్డ్ చేయొద్దని నిర్ణయించుకున్నాం. ఓ రకంగా థియేటర్ల కంటే ఓటీటీ వల్ల సినిమా 200 దేశాల్లో విడుదలవుతుండటం సంతోషమే. అందరికీ సినిమా చేరువ అవుతుంది. మొదటివారంలో సినిమా చూసేవాళ్లు మొదటి రోజునే సినిమా చూసే అవకాశం కలిగింది. ఒక టెక్నీషియన్గా నాకు సినిమాలను థియేటర్లలో చూడటమే ఇష్టం. ప్రేక్షకులు కూడా అంతే. థియేటర్ల అనుభవాన్ని ఎవరూ మిస్ చేసుకోవాలనుకోరు. అయితే ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరమే’’ అని ఇంద్రగంటి అన్నాడు.
This post was last modified on September 1, 2020 12:24 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…