Movie News

కుటుంబాన్ని భయపెట్టే దెయ్యాల ‘పిండం’

ఒకప్పటిలా ఒళ్ళు జలదరింపజేసే సీరియస్ హారర్ సినిమాలు ఇప్పుడు రావడం లేదు. అశ్విన్స్ లాంటి ఒకటి రెండు వచ్చినా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 విడుదల కాబోతున్న పిండం మీద దెయ్యాల ప్రియులకు మెల్లగా ఆసక్తి పెరుగుతోంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ అత్మల ట్రైలర్ ని ఇందాకా విడుదల చేశారు. మూడున్నర నిమిషాల పాటు ఉన్న వీడియోలో కథ తాలూకు తీరుతెన్నులతో పాటు అత్యంత భయపెట్టే చిత్రంగా వేసుకున్న ట్యాగ్ కి న్యాయం జరిగిందో లేదో సాంపిల్స్ చూపించారు.

సుక్లాపేట్ 1990లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా పిండం రూపొందింది. తక్కువ ధరకు మంచి వసతి దొరికిందన్న సంతోషంతో ఒక పాత ఇంట్లో చేరతాడు ఆంటోనీ(శ్రీరామ్). తల్లి, భార్య(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్ళతో చక్కని ఫ్యామిలీ ఇతనిది. అయితే మాటలు రాని ఆ పసి పిల్లలకు రాత్రిళ్ళు ఎవరో తమతో మాట్లాడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. భయపెట్టే సంఘటనలు జరుగుతాయి. విషయం తెలుసుకోవడం కోసం మంత్రగత్తె(ఈశ్వరిరావు)ని పిలిపిస్తారు. ఆవిడ అక్కడ ఒకటి కాక మరెన్నో దెయ్యాలు ఉన్నట్టు గుర్తిస్తుంది. అమావాస్యకు ఒక విరుగుడు సిద్ధం చేస్తుంది.

విజువల్స్ అన్నీ సీరియస్ హారర్ తో నింపేశారు. ఆర్టిస్టులు తక్కువే అయినప్పటికీ భీతి గొలిపేలా డిజైన్ చేసిన సీన్లు ఆసక్తి రేపెలా ఉన్నాయి. దర్శకుడు సాయికిరణ్ ధైడా మరీ కొత్త కథను ఎంచుకోకపోయినా టేకింగ్ లో మాత్రం డెప్త్ ఉండేలా చూసుకుని భయపెట్టడమే లక్ష్యంగా చేసుకున్నాడు. దానికి సాంకేతిక బలం తోడవ్వడంతో ఇంటెన్స్ పెరిగింది. విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, మంగళవారం ఇలా హారర్ కం థ్రిల్లర్ మూవీస్ కి మంది ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ పిండం కూడా వీటితో జత కట్టేది లేనిది వచ్చే శుక్రవారం థియేటర్లలో చూశాక తేలనుంది.

This post was last modified on December 7, 2023 12:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూర్తిగారు చెప్పింది అక్షరాలా నిజాలు

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…

22 minutes ago

ఆ ఇద్దరు సీఎంలకు మరో ఛాన్స్ ఉన్నట్టే!

దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…

22 minutes ago

విజయ్ మాత్రమే కాదు.. డ్రైవర్ కొడుకు కూడా

నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…

31 minutes ago

విజ‌య్‌కు క‌లిసి వ‌చ్చిందేంటి?

త‌మిళ‌నాట ఎవ‌రి అంచ‌నాకు అంద‌ని విదంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న అధికారంలోకి…

55 minutes ago

ఎన్టీఆర్, ఎంజీఆర్.. మధ్యలో విజయ్

దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ముందుంటాయి.…

3 hours ago

రెండు హిట్లిచ్చి మాయ‌మైపోయిన హీరో

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవ‌ర్ నైట్ సెన్సేష‌న్ అయిపోయాడు యువ క‌థానాయ‌కుడు కార్తికేయ గుమ్మ‌కొండ‌. అప్ప‌టికే ప్రేమ‌తో మీ కార్తీక్…

5 hours ago