ఒకప్పటిలా ఒళ్ళు జలదరింపజేసే సీరియస్ హారర్ సినిమాలు ఇప్పుడు రావడం లేదు. అశ్విన్స్ లాంటి ఒకటి రెండు వచ్చినా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15 విడుదల కాబోతున్న పిండం మీద దెయ్యాల ప్రియులకు మెల్లగా ఆసక్తి పెరుగుతోంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ అత్మల ట్రైలర్ ని ఇందాకా విడుదల చేశారు. మూడున్నర నిమిషాల పాటు ఉన్న వీడియోలో కథ తాలూకు తీరుతెన్నులతో పాటు అత్యంత భయపెట్టే చిత్రంగా వేసుకున్న ట్యాగ్ కి న్యాయం జరిగిందో లేదో సాంపిల్స్ చూపించారు.
సుక్లాపేట్ 1990లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా పిండం రూపొందింది. తక్కువ ధరకు మంచి వసతి దొరికిందన్న సంతోషంతో ఒక పాత ఇంట్లో చేరతాడు ఆంటోనీ(శ్రీరామ్). తల్లి, భార్య(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్ళతో చక్కని ఫ్యామిలీ ఇతనిది. అయితే మాటలు రాని ఆ పసి పిల్లలకు రాత్రిళ్ళు ఎవరో తమతో మాట్లాడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. భయపెట్టే సంఘటనలు జరుగుతాయి. విషయం తెలుసుకోవడం కోసం మంత్రగత్తె(ఈశ్వరిరావు)ని పిలిపిస్తారు. ఆవిడ అక్కడ ఒకటి కాక మరెన్నో దెయ్యాలు ఉన్నట్టు గుర్తిస్తుంది. అమావాస్యకు ఒక విరుగుడు సిద్ధం చేస్తుంది.
విజువల్స్ అన్నీ సీరియస్ హారర్ తో నింపేశారు. ఆర్టిస్టులు తక్కువే అయినప్పటికీ భీతి గొలిపేలా డిజైన్ చేసిన సీన్లు ఆసక్తి రేపెలా ఉన్నాయి. దర్శకుడు సాయికిరణ్ ధైడా మరీ కొత్త కథను ఎంచుకోకపోయినా టేకింగ్ లో మాత్రం డెప్త్ ఉండేలా చూసుకుని భయపెట్టడమే లక్ష్యంగా చేసుకున్నాడు. దానికి సాంకేతిక బలం తోడవ్వడంతో ఇంటెన్స్ పెరిగింది. విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, మంగళవారం ఇలా హారర్ కం థ్రిల్లర్ మూవీస్ కి మంది ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ పిండం కూడా వీటితో జత కట్టేది లేనిది వచ్చే శుక్రవారం థియేటర్లలో చూశాక తేలనుంది.
This post was last modified on December 7, 2023 12:49 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…