ఇండియన్ బాక్సాఫీస్ లో గత వారం రోజులుగా చర్చలన్నీ అనిమల్ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. విడుదలకు ముందు నుంచే చర్చనీయాంశంగా మారిన యానిమల్.. రిలీజ్ తర్వాత మరింతగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కొందరికి పిచ్చిపిచ్చిగా నచ్చితే.. కొందరికి అంతగా ఆగ్రహం తెప్పించింది. పాజిటివ్, నెగిటివ్ రియాక్షన్లు ఏవైనా సరే తీవ్రస్థాయిలోనే ఉన్నాయి.
అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ రిలీజ్ టైం లో ఆ చిత్రాన్ని వైలెంట్ ఫిలిం అన్నారని.. అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో తన తర్వాత చిత్రంలో చూపిస్తానని అన్న సందీప్ రెడ్డి.. చెప్పినట్లే యానిమల్ సినిమాలో హింసను పతాక స్థాయికి తీసుకెళ్లాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్, ఇంకా క్లైమాక్స్ లో అతను ఎంతటి విధ్వంసం సృష్టించాడో తెలిసిందే. తెరంతా రక్తంతో తడిసిపోయింది ఆ సన్నివేశాల్లో. చివర్లో యానిమల్ పార్క్ అనే టైటిల్ వేసి సీక్వెల్ కు హింట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి.
యానిమల్ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూశాక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ రిలీజ్ ఇంటర్వ్యూలలో సందీప్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటున్నారు ప్రేక్షకులు. యానిమల్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం కీలకమని.. అది వచ్చిందంటే మాత్రం తాను, రణబీర్ కలిసి ఇంకో ఐడియాను వర్క్ అవుట్ చేస్తామని.. అది యానిమల్ తో పోలిస్తే చాలా డార్క్ గా ఉంటుందని.. తామిద్దరం మరింత డార్క్నెస్ లోకి దూకేస్తామని.. తమకు ఆ రకమైన కాన్ఫిడెన్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు సందీప్ రెడ్డి.
ఇప్పుడు అతను కోరుకున్నట్లే యానిమల్ బ్లాక్ బస్టర్ అయింది. కబీర్ సింగ్ తర్వాత మోస్ట్ వైలెంట్ ఫిలిం అని హింట్ ఇచ్చి అలాంటి సినిమానే తీసిన సందీప్ రెడ్డి.. ఇప్పుడు మరింత డార్క్ ఫిలిం అనే మాట చెప్పి ఎలాంటి సినిమాతో వస్తాడో అనే ఆసక్తి అతడి అభిమానులు వ్యక్తమవుతోంది.
This post was last modified on December 5, 2023 10:59 pm
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. రెండు రోజుల కిందటే…