సుషాంత్ సింగ్ రాజ్పుట్ మరణంలో తన పాత్ర వుందని అనుమానాలు వ్యక్తమవుతోన్న సమయంలో సిబిఐ విచారణ జరిపించాలని రియా చక్రవర్తి డిమాండ్ చేసింది. అయితే ఆ సిబిఐకి తానే ప్రధాన టార్గెట్ అవుతానని ఊహించలేకపోయింది. సిబిఐ విచారణ అంటే ఎలాగుంటుందనేది రియాకు ప్రత్యక్షంగా తెలిసి వస్తోంది.
నాలుగు రోజులుగా రోజుకి ఎనిమిది నుంచి పది గంటల పాటు ఆమెను రకరకాల ప్రశ్నలు అడుగుతూ మొత్తం కూపీ లాగుతున్నారు. అసలు అన్ని గంటల పాటు ఏమి అడుగుతున్నారో, ఇంతవరకు ఆమెకి ప్రతికూలంగా కానీ, అనుకూలంగా కానీ ఏదైనా నిర్దారణకు వచ్చారో ఇంతవరకు తెలియదు. మీడియాకు లోపల వున్న సోర్సెస్ ద్వారా కాస్తో కూస్తో వివరాలు తెలుస్తున్నాయి కానీ అసలు ఈ కేసులో రియా నిందితురాలని నిర్దారించారో లేదో, ఆమెను అరెస్ట్ చేస్తారో లేదో మాత్రం ప్రస్తుతానికి సమాచారం లేదు.
రియాతో పాటు ఆమె సోదరుడిని, సుషాంత్ అనుచరులు, స్నేహితులు కొందరిని గట్టిగా విచారిస్తున్నారు. ఇంకా రియా తల్లిదండ్రులు, సుషాంత్ కుటుంబ సభ్యులను సిబిఐ పిలిపించలేదు. ఇదిలావుంటే రియా వద్ద కొన్ని ప్రశ్నలకు సవ్యమయిన సమాధానాలు లేవని, ముఖ్యంగా సుషాంత్కి అందించిన మెడికల్ ట్రీట్మెంట్, ఆమె ఫోన్లో దొరికిన ‘డ్రగ్స్ చాట్’ గురించి ఆమె స్పష్టమయిన సమాధానాలు ఇవ్వడం లేదని, ఈ కోణంలోనే ఆమెను ఎక్కువ సమయం విచారిస్తున్నారని సమాచారం.
This post was last modified on September 1, 2020 5:11 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…